Zakir Hussain Death: మనమే బెస్ట్ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!
- జాకీర్ హుస్సేన్ కన్నుమూత
- సంగీత ప్రపంచానికి జాకీర్ హుస్సేన్ ఎనలేని సేవలు
- జాకీర్ హుస్సేన్ వ్యాఖ్యలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.
జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు. జాకీర్ హుస్సేన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి విద్యార్థిగా ఉన్నపుడే విజయం సాధిస్తారన్నారు. ‘ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదని నాన్న చెప్పేవారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మంచి మంచి విద్యార్థిగా ఉండాలి, అప్పుడే విజయం వరిస్తుంది. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు.. వారు ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉండాలన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి’ అని జాకీర్ హుస్సేన్ అన్నారు.
Also Read
- Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
- Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
- Messi Retirement: హార్మోన్ లోపం నుంచి ప్రపంచకప్ కల వరకు.. మెస్సీ జీవిత ప్రయాణం సాగిందిలా..
- Modi-Putin: అంతులేని యుద్ధాన్ని ముగించండి.. పుతిన్కు మోడీ కీలక సందేశం
‘నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నా. అయినా ఎప్పుడూ దీని గురించి నేను ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే.. 15 మంది పేర్లు చెబుతాను. నేనే బెస్ట్ అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే విజయాలు దొరమవుతాయి’ అని జాకీర్ హుస్సేన్ చెప్పిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచి.. ఏడేళ్లకే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. జాకీర్ హుస్సేన్ 10 ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
తాజావార్తలు
-
Don’t Trouble the Trouble: వాయిదా పడిన ఫహద్ ఫాసిల్ ఫాంటసీ సినిమా.. కొత్త రిలీజ్ డేట్ ఇదే!
-
Kalki 2 : కల్కి 2 అప్డేట్ ఇచ్చిన నాగ్ అశ్విన్
-
Sardar 2 : సర్దార్ ఆన్ యాక్షన్.. స్పై థ్రిల్లర్తో మళ్లీ రాబోతున్న కార్తీ
-
Cheyutha Pensions: చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు పెంపు.. చివరి తేదీ ఎప్పుడంటే..
-
Anna Hazare: అన్నా హజారేకు సీరియస్.. ముంబై ఆస్పత్రికి తరలింపు
ట్రెండింగ్
-
9000mAh బ్యాటరీ, 1.5K AMOLED డిస్ప్లేతో POCO X8 5G సెప్టెంబర్ 4న లాంచ్..!
-
క్రిస్టల్స్తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!