Zakir Hussain Death: మనమే బెస్ట్ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!
- జాకీర్ హుస్సేన్ కన్నుమూత
- సంగీత ప్రపంచానికి జాకీర్ హుస్సేన్ ఎనలేని సేవలు
- జాకీర్ హుస్సేన్ వ్యాఖ్యలు వైరల్
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.
జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు. జాకీర్ హుస్సేన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి విద్యార్థిగా ఉన్నపుడే విజయం సాధిస్తారన్నారు. ‘ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదని నాన్న చెప్పేవారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మంచి మంచి విద్యార్థిగా ఉండాలి, అప్పుడే విజయం వరిస్తుంది. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు.. వారు ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉండాలన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి’ అని జాకీర్ హుస్సేన్ అన్నారు.
Also Read
- Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
- Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
- RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
- SAD: బిర్యానీ తిన్న తర్వాత పుచ్చకాయ తిని.. ఒకే కటుంబానికి చెందిన 4 గురు మృతి..
‘నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నా. అయినా ఎప్పుడూ దీని గురించి నేను ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే.. 15 మంది పేర్లు చెబుతాను. నేనే బెస్ట్ అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే విజయాలు దొరమవుతాయి’ అని జాకీర్ హుస్సేన్ చెప్పిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచి.. ఏడేళ్లకే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. జాకీర్ హుస్సేన్ 10 ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
తాజావార్తలు
-
Off The Record : ఉమ్మడి కృష్ణా జిల్లా వైసీపీలో నిర్లిప్తత పెరుగుతోందా?
-
Axar Patel: ఢిల్లీ ఘోర పరాజయంపై అక్షర్ పటేల్ షాకింగ్ కామెంట్స్.. పెదవి విప్పిన చేదు నిజం..
-
Off The Record : ఉమ్మడి రంగారెడ్డి కాంగ్రెస్లో వలస నేతల డామినేషన్
-
Anganwadi Jobs: అంగన్ వాడీ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. 2,645 కేంద్రాల్లో ఖాళీలు..
-
RCB vs DC: వార్ వన్ సైడ్.. ఢిల్లీపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఘన విజయం.!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!