Zakir Hussain Death: మనమే బెస్ట్ అని అనుకోకూడదు.. ఎప్పుడూ విద్యార్థిగా ఉండాలి!
- జాకీర్ హుస్సేన్ కన్నుమూత
- సంగీత ప్రపంచానికి జాకీర్ హుస్సేన్ ఎనలేని సేవలు
- జాకీర్ హుస్సేన్ వ్యాఖ్యలు వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ తబలా విద్వాంసుడు, పద్మ విభూషణ్ గ్రహీత జాకీర్ హుస్సేన్ (73) తుదిశ్వాస విడిచారు. పదేళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన శాన్ ఫ్రాన్సిస్కోలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం కన్నుమూశారు. కొద్ది రోజులుగా గుండె సంబంధిత వ్యాధితో పాటు అధిక రక్తపోటుతో బాధపడిన జాకీర్ హుస్సేన్ ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. 1951 మార్చి 9న ముంబైలో జన్మించిన ఆయన సంగీత ప్రపంచానికి ఎనలేని సేవలు అందించారు.
జాకీర్ హుస్సేన్ అసలు పేరు జాకీర్ హుస్సేన్ అల్లారఖా ఖురేషి. ప్రముఖ తబలా వాయిద్యకారుడు అల్లారఖా పెద్ద కుమారుడు. జాకీర్ హుస్సేన్ గతంలో పలు ఇంటర్వ్యూల్లో మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మంచి విద్యార్థిగా ఉన్నపుడే విజయం సాధిస్తారన్నారు. ‘ఎన్ని అవార్డులు, పేరు ప్రఖ్యాతలు వచ్చినా ఎప్పుడూ నేర్చుకోవడం మాత్రం చాలా ముఖ్యం. మనల్ని మనం బెస్ట్ అని ఎప్పుడూ అనుకోకూడదని నాన్న చెప్పేవారు. ఉత్తమ ప్రదర్శన ఇచ్చినప్పటికీ.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకూడదు. మంచి మంచి విద్యార్థిగా ఉండాలి, అప్పుడే విజయం వరిస్తుంది. నేను గొప్ప సంగీత విద్వాంసులతో మాట్లాడినప్పుడు.. వారు ఇదే చెప్పారు. కొత్తదనాన్ని వెతుకుతూనే ఉండాలన్నారు. ఆ మాటలు నాలో స్ఫూర్తి నింపాయి’ అని జాకీర్ హుస్సేన్ అన్నారు.
Also Read
- Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
- School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
- Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
- Vaibhav Sooryavanshi: కోహ్లీ నుంచి అద్భుతమైన సలహా.. 'ఆరెంజ్ క్యాప్' విజేత వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం..
‘నా రంగంలో నేను అత్యుత్తమంగా ఉన్నా. అయినా ఎప్పుడూ దీని గురించి నేను ఆలోచించలేదు. నాకంటే గొప్ప తబలా విద్వాంసుల పేర్లు చెప్పమంటే.. 15 మంది పేర్లు చెబుతాను. నేనే బెస్ట్ అని ఎప్పుడూ అనుకోలేదు. అలా అనుకుంటే విజయాలు దొరమవుతాయి’ అని జాకీర్ హుస్సేన్ చెప్పిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. జాకీర్ హుస్సేన్ చిన్నప్పటి నుంచే తండ్రి బాటలోనే నడిచి.. ఏడేళ్లకే తబలా చేతబట్టారు. తండ్రిని మించిన తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. సంగీత ప్రపంచానికి చేసిన సేవలకు గాను పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు దక్కాయి. జాకీర్ హుస్సేన్ 10 ఏళ్ల క్రితమే కుటుంబంతో కలిసి అమెరికాలో స్థిరపడ్డారు.
తాజావార్తలు
-
Russia: చమురు మార్కెట్ను భారత్ శాసిస్తుంది.. రష్యా సంచలన వ్యాఖ్యలు..
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
The Paradise: నానీ ఫ్యాన్స్కు బ్యాడ్ న్యూస్.. ఆగస్టు రేసు నుంచి తప్పుకున్న ‘ది ప్యారడైజ్’? కారణం ఇదేనట!
-
School Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా, సంక్రాంతి సెలవుల ప్రకటన.. ఎన్నిరోజులంటే..
-
Suvendu Adhikari: బీజేపీ ప్రభుత్వానికి బుద్ధదేవ్ భార్య కితాబు.. సీపీఎం ప్రశంసలపై బెంగాల్లో చర్చ
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!