HYDRA: చెరువుల అనుసంధానంతోనే వరదకు కట్టడి..
- వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశం
- నగరంలో చెరువుల పరిస్థితిపై సమీక్ష
- వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించిన హైడ్రా కమిషనర్
- హైడ్రా చర్యలపట్ల హర్షం వ్యక్తం చేసిన డా. మన్సీబాల్ భార్గవ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
చెరువులు, నాలాల పరిరక్షణతో పాటు వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, లేక్మ్యాన్స్, జలవనరుల అభివృద్ధికి సంబంధించిన పలువురు పరిశోధకులు, నిపుణలతో హైడ్రా సమావేశాలు నిర్వహించింది. గురువారం హైడ్రా కార్యాలయంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఆధ్వర్యంలో వాటర్-ఉమెన్ రైట్స్ యాక్టవిస్టు డా. మన్సీబాల్ భార్గవతో హైడ్రా బృందం సమావేశమైంది. నగరంలో చెరువుల పరిస్థితిపై సమీక్షించారు. వాటికి పునరుజ్జీవనం కల్పించేందుకు తీసుకుంటున్న చర్యలను హైడ్రా కమిషనర్ వివరించారు. హైడ్రా చర్యల పట్ల డా. మన్సీబాల్ భార్గవ హర్షం వ్యక్తం చేశారు. చెరువుల పునరుద్ధరణతోనే నగరానికి వరద ముప్పు తప్పుతుందంటూ ఆయన సూచించారు. అలాగే.. శరీరానికి నాడీ వ్యవస్థ ఎంత ముఖ్యమో.. చెరువులకు నాలా వ్యవస్థ అంతే అవసరమని డా. మన్సీబాల్ భార్గవ తెలిపారు. నాలాలు సరిగా ఉంటే.. వరద నీరు సాఫీగా చెరువుకు చేరుతుందని అన్నారు. అనుసంధానం ఉన్నప్పుడే ఒక దాని తర్వాత మరో చెరువు నిండుతుందని పేర్కొన్నారు. ఆ గొలుసు తెగకుండా చూడాలి.. ఎక్కడైనా ఆటంకాలు ఏర్పడితే వాటిని పునరుద్ధరించాలని తెలిపారు.
CM Chandrababu: గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్ఫీల్డ్ హైవేలు!
Also Read
- PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
- OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
- Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
- OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
భారీ వర్షాలు కురవడంతో బెంగళూరులోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి.. ఇలాంటి పరిస్థితులు నగరంలో తలెత్త కూడదంటే చెరువుల అనుసంధానం, గొలుసుకట్టు చెరువులు, నాలా వ్యవస్థ సరిగా ఉండాలని డా. మన్సీబాల్ భార్గవ సూచించారు. సహజ సిద్ధంగా చెరువులకు పునరుజ్జీవనం కల్పించే పద్ధతులను వివరించారు. చెరువులకు కాలువులు జీవనాడులు.. వాటిని ముందుగా పరిరక్షించుకుంటూ.. ఆ కాలువల నుంచి మంచి నీరు వచ్చేలా చూస్తే.. చెరువుల కాలుష్యం తగ్గుతుందంటూ సూచనలు చేశారు. కాంక్రీట్ కట్టడాలు కాకుండా.. సహజసిద్ధంగా చెరువులను పునరుద్ధరించినప్పడే వాటిలో జీవకళ ఉంటుందని.. ఆ నీరు జీవరాసులకు ఉపయోగపడుతుందని భార్గవ తెలిపారు. ఇలా తక్కువ ఖర్చుతో చెరువులకు పునరుజ్జీవనం సాధ్యమౌతుందని అన్నారు.
Kaleshwaram Commission: మాజీ ఈఎన్సీని విచారించిన కాళేశ్వరం కమీషన్.. కీలక విషయాలు వెల్లడి
ఈ క్రమంలో.. ఆ విధానాలపై ఆయన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. నెలలో కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే.. ఒక్క రోజులో కురిసే వర్షం.. ఒక గంటలో పడి నగర జీవనాన్ని అతలాకుతలం చేస్తున్న వేళ.. వరద నీటి కాలువలు ఎలా ఉండాలనే అంశంపై లోతైన చర్చ జరిపారు. వరద నీరు చెరువుకు చేరాలి.. చెరువులు నిండితే ఆ నీరు నదుల్లో కలవాలన్నారు. అలా కాకుండా ఆటంకాలు ఏర్పడితే నివాసాలు నీట మునుగుతాయని తెలిపారు. చెరువులలో ఆక్రమణలు తొలగింపు.. నగరం ముంపునకు గురి కాకుండా చేసిన శస్త్ర చికిత్స లాంటిదని డా. మన్సీబాల్ భార్గవ అన్నారు.
తాజావార్తలు
-
PMSBY: రూ.20తో రూ.2 లక్షల బీమా.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
-
OTR: సీట్ల పంపకానికి ముందే ‘నోట్ల’ పంచాయితీ! టీడీపీ-జనసేనలో కొత్త టెన్షన్
-
Off The Record: కొండా సురేఖ, చిన్నారెడ్డిపై యాక్షన్కు బ్రేక్! ఢిల్లీ నుంచి వచ్చిన సందేశమేంటి?
-
OTR: ఎమ్మెల్యే పదవిని వదిలి మేయర్ అవుతారా? విశాఖలో టీడీపీ నేతల కొత్త స్కెచ్!
-
Story Board : వీసా అపాయింట్మెంట్లు ఎందుకు నిలిపేశారు..?| ట్రంప్ కఠిన చర్యలు దేనికి సంకేతం..?
ట్రెండింగ్
-
Festival Recipes : రక్షా బంధన్ స్పెషల్.. ఇంట్లోనే సింపుల్గా కాజు కట్లీ రెడీ..!
-
MS Dhoni-CSK: సీఎస్కేలో ధోనీకి 25 శాతం వాటానా?.. ఫ్రీగా ఎవరైనా ఇస్తారా?.. మాజీ టీమిండియా ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు!
-
కేవలం రూ.7,999కే.. 5000mAh బ్యాటరీ, LED ఫ్లాష్ కెమరాతో Lava Bold N4 Lite లాంచ్..!
-
రూ.14,999కే మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీ, 6500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే.. Realme C100i 4G ఫోన్ లాంచ్.!
-
Paneer Bhurji Recipe: పప్పు, కూరలతో బోర్ కొడుతోందా.? అయితే “పనీర్ భుర్జీ”తో కొత్త టేస్ట్ ఆస్వాదించండి..!