CM Chandrababu: గుడ్న్యూస్ చెప్పిన సీఎం.. రూ.45,300 కోట్లతో నాలుగు గ్రీన్ఫీల్డ్ హైవేలు!
- ఏపీలో రూ.45300 కోట్లతో నాలుగు గ్రీన్ఫీల్డ్ హైవేలు
- ఏపీకి మరో మూడు పోర్టులు
- . లాజిస్టిక్స్ హబ్గా ఏపీ
- సీఎం చంద్రబాబు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: నాలుగు గ్రీన్ఫీల్డ్ హైవేలకు 45,300 కోట్లు అవసరమని.. ఈ పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఆరు ప్రాజెక్టులు బిడ్డింగ్ దశలో ఉన్నాయన్నారు. 18వేల కోట్లతో పనులు ముందుగా పూర్తి చేస్తారని.. హైదరాబాదు నుంచీ మచిలీపట్నం కనెక్ట్ చేసేలా గ్రీన్ ఫీల్డ్ హైవే వస్తుందన్నారు. జాతీయ రహదారుల అధికారులు, ఏజెన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో 15 ప్రాజెక్టులు నిలిచిపోయాయని.. 70 ప్రాజెక్టులకు భూసేకరణ సమస్యలు, 21 ప్రాజెక్టులకు అటవీ భూముల సమస్యలు, 3 ప్రాజెక్టులకు టోల్ప్లాజా సమస్యలు ఉన్నాయని చెప్పారు. ఇవన్నీ మూడు నెలల్లో సరిచేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో చేపట్టబోయే ప్రాజెక్టులన్నింటికీ 3 నెలల్లో భూసేకరణ పూర్తి చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. రణస్ధలం నుంచీ శ్రీకాకుళం హైవే ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. ఎన్హెచ్-42లో పాడేరు బైపాస్, బైరెడ్డిపల్లి నుంచీ వి.కోట, బెంగళూరు హైవే విషయంలోనూ చర్చించామన్నారు.
Read Also: Aswini Vaishnaw: పవన్ చొరవతోనే రైల్వేలైన్కు మోడీ ఆమోదం.. రైల్వే మంత్రి కీలక వ్యాఖ్యలు
Also Read
- Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
- Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
- Sugar Prices Fall: సామాన్యులకు తీపి కబురు.. భారీగా తగ్గిన చక్కెర ధరలు
- Modi-Rahul Gandhi: కులగణనపై మోడీకి ఖర్గే, రాహుల్గాంధీ లేఖ.. ఏముందంటే..!
ఏపీకి మరో మూడు పోర్టులు వస్తాయని.. లాజిస్టిక్స్ హబ్గా ఏపీ తయారవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఆక్వా కల్చర్, హార్టికల్చర్ వల్ల ఎక్స్పోర్టులు పెరిగే అవకాశం ఉందన్నారు. రైల్వే లో 70వేల కోట్ల ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. గత ఐదేళ్ళలో చాలా పనులు ఆగిపోయాయని విమర్శించారు. లాజిస్టిక్స్ కనెక్టివిటీ పూర్తిగా ఆగిపోయిందన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఇంకా ఎఫెక్టివ్ గా ఉండాలని అధికారులను సీఎం ఆదేశించారు. పరిటాల దగ్గర మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు వస్తాయని చెప్పారు. 14 శాతం లాజిస్టిక్స్ కాస్ట్ ఇంటర్నేషనల్లో మనకు ఉంది… తగ్గిస్తామన్నారు. ఇసుక ప్రతీ సామాన్యుడికి అందించాలని ఉచిత ఇసుక విధాన తీసుకొచ్చామన్నారు. ఇసుక విధానంలో గత ప్రభుత్వంలో మోనోపోలీ తీసుకొచ్చారని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. గత ప్రభుత్వం సహజ వనరులను లూటీ చేశారని విమర్శించారు. ఇప్పుడు ఇసుక కావాల్సిన వాళ్ళే తవ్వుకుని తీసుకెళ్ళే అవకాశం ఉందన్నారు. అన్ని అంశాలను ట్రాక్లో పెడుతున్నామన్నారు.
Read Also: AP CM Chandrababu: అమరావతికి రైల్వే లైన్.. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కృతజ్ఞతలు
గత ఐదేళ్ళలో తప్పుడు కేసులు పెట్టడమే ధ్యేయంగా పెట్టుకున్నారని విమర్శించారు. మేం చేసే పనులు చూసి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారన్నారు. 129 ప్రాజెక్టులు గురించి ఇవాళ చర్చించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. గతంలో అమరావతి, పోలవరంను డ్యామేజీ చేశారని మండిపడ్డారు. పోలవరం ఒక లైఫ్ లైన్ అని.. ఆ లైఫ్ లైన్ చెరిపేసే పరిస్ధితిని గత ప్రభుత్వంలో తెచ్చారన్నారు. నదుల అనుసంధానం.. గోదావరి వంశధార, గోదావరి కృష్ణ, కృష్ణ పెన్న… ఇలా అనుసంధానం చేస్తే కరువు ఉండదన్నారు. నాలుగు నెలల్లో ఆలోచనా విధానంలో మార్పు తెచ్చామన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ కూడా తీసుకొస్తున్నామని.. దానిపై లోకేష్ ఆ కంపెనీలతో మాట్లాడుతున్నాడని చెప్పారు. విధ్వంసానికి చిరునామాగా ఉన్న ఏపీని అభివృద్ధికి చిరునామాగా చేస్తున్నామన్నారు. రాబోయే రోజుల్లో అమరావతి రైల్వే లైన్ మరింతగా పెంచుకోవాల్సి వస్తుందన్నారు. మిగిలిన రైళ్ళు కూడా వస్తే.. అన్నిరకాల అభివృద్ధి వస్తుందన్నారు. వందేభారత్ తరువాత బుల్లెట్ ట్రైన్ కూడా వస్తుందని చెప్పారు. అమరావతి, హైదరాబాదు, బెంగళూరు, చెన్నై మధ్య గంటన్నరలో జర్నీ ఉంటుందని తెలిపారు. అమరావతి మిగిలిన సిటీలకు కేంద్రంగా ఉంటుందన్నారు. అమరావతి ని టచ్ చేయకుండా సౌత్ ఇండియాలో ప్రయాణించలేమన్నారు. అమరావతిని లాజిస్టిక్స్ హబ్గా అభివృద్ధి చేయవచ్చన్నారు. ఏదైనా ప్రభుత్వం గవర్నెన్స్ ఇచ్చేప్పుడు పారదర్శకత ఉండాలన్నారు. పబ్లిక్ పాలసీ కానీ పబ్లిక్ గవర్నెన్స్ పారదర్శకంగా ఉండాలన్నారు. గత ఐదేళ్ళ జీఓలు ఆన్ లైన్ లో పెడుతున్నామని చెప్పారు. డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఏంటి.. తల్లి, చెల్లి గొడవ అయితే మా గురించి మాట్లాడుతున్నాడని జగన్ గురించి సీఎం చంద్రబాబు విమర్శించారు. తల్లి పై కేసులు పెట్టి మా గురించి మాట్లాడుతున్నాడని ఆరోపించారు.
తాజావార్తలు
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ ఖరారు.. ఇద్దరు స్టార్ ఆటగాళ్లను వదులుకుంటున్న కేకేఆర్?
-
Vivo T5 5G: వివో T5 5G భారత్ లో రిలీజ్ డేట్ ఫిక్స్.. 7,050mAh బ్యాటరీ, 144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే
-
Suryapet Bus Accident: సూర్యాపేట జిల్లాలో ఘోర ప్రమాదం.. బస్సు-కంటైనర్ ఢీ, ఆరుగురు మృతి
-
Kriti Sanon: సంస్కృతి గుండెల్లో ఉంటుంది, దుస్తుల్లో కాదు.. ట్రోలింగ్ పై కృతి సనన్ స్ట్రాంగ్ కౌంటర్!
-
TVS iQube MillionR Edition: 145KM రేంజ్తో TVS iQube కొత్త అవతార్.. 35.5L స్టోరేజ్, USB-C పోర్ట్తో MillionR Edition!
ట్రెండింగ్
-
Raksha Bandhan 2026: రక్షాబంధన్ ఎప్పుడు? ఆగస్టు 27నా.. 28నా? శుభముహూర్తం, పూర్తి వివరాలు ఇవే..
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!