NTV Telugu Site icon

Delhi: దారుణం.. యువకుడి పై నుంచి వెళ్లిన వాటర్ ట్యాంకర్, మృతి

Delhi Water Tanker

Delhi Water Tanker

ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ యువకుడి పై నుంచి వాటర్ ట్యాంకర్‌ వెళ్లడంతో తీవ్ర గాయాలైన అతన్ని ఆస్పత్రికి తరలించే లోపే ప్రాణాలు వదిలాడు. ఈ ఘటనకు సంబంధించిన మొత్తం వీడియో సీసీటీవీ కెమెరాలో రికార్డైంది.

Read Also: Siddharth: అప్పుడు కండోమ్ తో రోడ్డెక్కింది నేనే.. సిద్ధార్థ్ షాకింగ్ కామెంట్స్

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీలో భారీ వర్షం పడి రోడ్లన్నీ నిండిపోయాయి. ఈ క్రమంలో.. ఎక్కడికక్కడ నీరు నిలిచిపోయాయి. అయితే.. ఓ గల్లీలోకి వచ్చిన వాటర్ ట్యాంకర్.. అనుకోకుండా అక్కడే నిల్చున్న ముగ్గురు యువకులపై నీరు చిమ్మింది. దీంతో.. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ తో ముగ్గురు వ్యక్తులు వాగ్వాదానికి దిగారు. డ్రైవర్ యువకులకు ఎంత చెబుతున్న వినకపోవడంతో.. ఓ పెద్ద బండ రాయి ట్యాంకర్ అద్దాలను పగులగొట్టారు.

Read Also: Jagannath Rath Yatra:రథ యాత్రలో తోపులాట..ఒకరి మృతి..వందల మందికి గాయాలు

గొడవ మరింత ఎక్కువవుతుందని భావించిన ట్యాంకర్ డ్రైవర్ సపాన్ సింగ్.. అక్కడి నుంచి పరారీ అయ్యేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో.. సద్దాం అలియాస్ షహబాద్ అనే వ్యక్తిపై నుంచి వాటర్ ట్యాంకర్ తీసుకెళ్లాడు. దీంతో.. యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించే లోపే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపడుతున్నారు.