Rajasthan: నీట మునిగిన స్మశానవాటిక.. నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలు..
- జైపూర్లో తెగిన డ్యామ్
- నీట మునిగిన స్మశానవాటిక
- నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జైపూర్లో డ్యామ్ తెగిపోవడంతో శ్మశానవాటిక మునిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాయి. అవి నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. కానీ ప్రజలు వాటిని కాలువలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానికులు తాడు సహాయంతో మృతదేహాలను బయటకు తీసి సమాధిలో మళ్లీ పాతిపెట్టారు.
READ MORE: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం
Also Read
వాస్తవానికి ఖోహ్ నగోరియన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భారీ వర్షానికి నూర్ డ్యాం ఆనకట్ట తెగింది. నీరు దర్గా వెనుక ఉన్న శ్మశాన వాటికలోకి చేరాయి.
ఈ సమయంలో వర్షం నీటికి శ్మశానవాటిక పూర్తిగా శిథిలమై 5 మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయి. కొంత సమయం తరువాత, మృతదేహాలు నీటి ప్రవాహంలో ఒక్కొక్కటిగా తేలడం ప్రారంభించాయి. చాలా కష్టపడి, ప్రజలు వాటిని తిరిగి సమాధిలో పాతిపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ కగ్గీ స్పందించారు. దీనిపై జైపూర్ కలెక్టర్కు సమాచారం అందించగా, తగిన ఏర్పాట్లు చేసేందుకు ఎస్ డీఆర్ఎఫ్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. భవిష్యత్తులో వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరారు.
READ MORE:Kannauj rape case: మైనర్ బాలికని రేప్ చేసింది సమాజ్వాదీ పార్టీ నాయకుడే.. డీఎన్ఏ మ్యాచ్..
కాగా.. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానలతో జనజీవనం స్తంభించింది. విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తీరం దాటిన వాయుగుండం జగదల్ పూర్కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా – విదర్భ చేరుకుని బలహీనపడుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!