Rajasthan: నీట మునిగిన స్మశానవాటిక.. నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలు..
- జైపూర్లో తెగిన డ్యామ్
- నీట మునిగిన స్మశానవాటిక
- నీటిలో కొట్టుకుపోయిన మృతదేహాలు
జైపూర్లో డ్యామ్ తెగిపోవడంతో శ్మశానవాటిక మునిగిపోయింది. అందులో నుంచి బయటకు వచ్చాయి. అవి నీటిలో కొట్టుకుపోయాయి. చాలా మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయని స్థానికులు తెలిపారు. ఇది చూసి అందరూ అవాక్కయ్యారు. కానీ ప్రజలు వాటిని కాలువలోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. స్థానికులు తాడు సహాయంతో మృతదేహాలను బయటకు తీసి సమాధిలో మళ్లీ పాతిపెట్టారు.
READ MORE: CM Revanth Reddy: మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు.. ఎకరాకు రూ.10 వేలు పరిహారం
Also Read
- CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
- RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
- 10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
- CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
వాస్తవానికి ఖోహ్ నగోరియన్ ప్రాంతంలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో భారీ వర్షానికి నూర్ డ్యాం ఆనకట్ట తెగింది. నీరు దర్గా వెనుక ఉన్న శ్మశాన వాటికలోకి చేరాయి.
ఈ సమయంలో వర్షం నీటికి శ్మశానవాటిక పూర్తిగా శిథిలమై 5 మృతదేహాలు సమాధి నుంచి బయటకు వచ్చాయి. కొంత సమయం తరువాత, మృతదేహాలు నీటి ప్రవాహంలో ఒక్కొక్కటిగా తేలడం ప్రారంభించాయి. చాలా కష్టపడి, ప్రజలు వాటిని తిరిగి సమాధిలో పాతిపెట్టారు. దీనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అమీన్ కగ్గీ స్పందించారు. దీనిపై జైపూర్ కలెక్టర్కు సమాచారం అందించగా, తగిన ఏర్పాట్లు చేసేందుకు ఎస్ డీఆర్ఎఫ్ బృందాన్ని సంఘటనా స్థలానికి పంపారు. భవిష్యత్తులో వర్షాకాలంలో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని స్థానికులు కోరారు.
READ MORE:Kannauj rape case: మైనర్ బాలికని రేప్ చేసింది సమాజ్వాదీ పార్టీ నాయకుడే.. డీఎన్ఏ మ్యాచ్..
కాగా.. వాయుగుండం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. భారీ వానలతో జనజీవనం స్తంభించింది. విజయవాడ నగరం పూర్తిగా నీట మునిగింది. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం శనివారం అర్ధరాత్రి కళింగపట్నం సమీపంలో తీరం దాటిందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి శ్రీనివాసరావు తెలిపారు. తీరం దాటిన వాయుగుండం జగదల్ పూర్కు ఆగ్నేయంగా 60 కిలోమీటర్లు, విశాఖకు వాయువ్యంగా 120 కిలోమీటర్ల దూరంలో ఉందని వెల్లడించారు. ఇది క్రమంగా దక్షిణ ఒడిశా – విదర్భ చేరుకుని బలహీనపడుతుందని పేర్కొన్నారు. దీని ప్రభావంతో ఆది, సోమవారాల్లో కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ క్రమంలో పల్నాడు, ఎన్టీఆర్, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రెడ్ అలర్ట్ జారీ చేశారు. అటు, ఏలూరు, కృష్ణా, బాపట్ల జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని హెచ్చరించారు.
తాజావార్తలు
-
CM Chandrababu: ఘనంగా Andhra University శతాబ్ది వేడుకలు.. విశాఖను గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దుతా.!
-
RCB Vs DC: విరాట్ కోహ్లీని ఊరిస్తున్న మరో సంచలన రికార్డు.. ఒక్క అడుగు దూరంలోనే..
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Producing States in India: భారత్లో ‘పెట్రోల్’ బావులు ఏయే రాష్ట్రాల్లో ఉన్నాయో తెలుసా?
-
CM Revanth Reddy : కేసీఆర్కు సీఎం రేవంత్ సవాల్.. బీజేపీతో పొత్తు ఉండదని దేవుడిపై ఒట్టేసి చెప్తావా.?
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!