Viral Video: ఇంట్లో బెడ్ అనుకున్నావా నాయనా.. రైలు పట్టాలపై ఎలా నిద్రపోతున్నాడో చూడండి
- యూపీలోని ప్రయాగ్రాజ్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన
- రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్న ఓ వ్యక్తి
- కింద టవల్.. పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్న వ్యక్తి
- అతన్ని చూసి సకాలంలో స్పందించిన లోకో పైలట్
- బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడిన లోకో పైలట్
- వీడియో సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యూపీలోని ప్రయాగ్రాజ్లో ఓ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి ఇంట్లో బెడ్ పై పడుకున్నట్లు.. రైలు పట్టాలపై గాఢ నిద్రలోకి జారుకున్నాడు. అది కూడా.. కింద టవల్, పైన గొడుగు పెట్టుకుని హాయిగా నిద్రపోతున్నాడు. ట్రాక్పై నిద్రిస్తున్న లోకో పైలట్ సకాలంలో చూసి బ్రేకులు వేసి అతని ప్రాణాలు కాపాడాడు. కాగా.. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Kiccha Sudeep: అయ్యబాబోయ్.. హీరో సుదీప్కు ఇంత పెద్ద కూతురా..? హీరోయిన్ లు కూడా పనికి రారుగా..
Also Read
- Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
- DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
- BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
- Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
ఈ వీడియోలో.. ఓ వ్యక్తి రైలు పట్టాలపై గాడనిద్రలో ఉన్నట్లు కనిపిస్తోంది. కింద టవల్, పైన ఎండ కొట్టకుండా గొడుగు పెట్టుకుని దర్జాగా పడుకున్నాడు. పట్టాలపై అతన్ని చూసిన లోకో పైలట్ అతనిని నిద్ర లేపాడు. అనంతరం.. ట్రాక్ నుండి అతనిని తప్పించడంతో.. రైలు ముందుకి కదిలింది. మీడియా నివేదికల ప్రకారం.. ఈ వైరల్ వీడియో ప్రయాగ్రాజ్లోని మౌయిమా రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగినట్లు తేలింది. గురువారం మధ్యాహ్నం ప్రయాగ్రాజ్ నుంచి మౌయిమా మీదుగా ప్రతాప్గఢ్ వైపు రైలు వెళ్తోంది. ఇంతలో రైలు రైల్వే క్రాసింగ్ దగ్గర నుంచి ఫ్లైఓవర్ వద్దకు రాగానే లోకో పైలట్ ట్రాక్పై ఓ వ్యక్తి పడి ఉండడం చూశాడు. దీంతో.. అలర్ట్ అయి సకాలంలో రైలును ఆపి అతని వద్దకు చేరుకున్నాడు.
Unified Pension Scheme: యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్లో కీలక అంశాలివే..
పని చేసి అలసిపోయిన ఓ వ్యక్తి రైల్వే ట్రాక్పై టవల్, గొడుగు పెట్టుకుని నిద్రిస్తున్నాడు. డ్రైవర్ అతడిని నిద్రలేపి ట్రాక్పై నుంచి పక్కకు తీసుకెళ్లాడు. తర్వాత రైలు అక్కడి నుంచి కదిలింది. ఈ ఘటనపై స్పందించిన మౌయిమా రైల్వే స్టేషన్ సూపరింటెండెంట్ తనకు ఈ విషయం తెలియదని అన్నారు. కాగా.. రైల్వే ట్రాక్పై నిద్రిస్తున్న వ్యక్తి ఎవరనేది తెలియలేదు. కాగా.. సోషల్ మీడియాలో నెటిజన్లు ఈ వీడియోను షేర్ చేసుకుంటున్నారు. అంతేకాకుండా.. కామెంట్స్ కూడా చేస్తున్నారు.
किसी को भी कहीं भी और कभी भी नींद आ सकती है। ऐसा ही कुछ यूपी में देखने को मिला। एक शख्स छतरी लेकर रेलवे ट्रैक पर सो गया। लोको पायलट ने जब उसे देखा तो ब्रेक लगाकर ट्रेन रोकी और उसे पटरी से हटाया। मीडिया रिपोर्ट्स के मुताबिक ये मामला प्रयागराज का है। #Train #Prayagraj #viralvideo pic.twitter.com/ZVV5939Nq9
— Pawan Kumar Sharma (@pawanks1997) August 25, 2024
తాజావార్తలు
-
Uttar Pradesh: మసీదు కూల్చివేతపై అభ్యంతరం ఉంటే, పాక్, బంగ్లాదేశ్ వెళ్లిపోండి ఖర్చు మేమే భరిస్తాం..
-
DGCA: డీజీసీఏ సంచలన నిర్ణయం.. ఇకపై పైలట్లందరికీ డ్రగ్ టెస్టులు
-
BRICS: బ్రిక్స్ కోసం ఢిల్లీలో భారీ భద్రత.. యాంటీ-డ్రోన్ వ్యవస్థలు, భవనాలపై స్నైపర్లు
-
Supreme Court: ‘చేపల్లా కుక్కేస్తున్నారు’.. ప్రైవేటు హాస్టళ్లపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు
-
CM Revanth Reddy : రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్లో 350 పరుగులు.. తొలి బ్యాటర్గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?