Warangal Politics : ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు.. పరిస్థితి ఇలా..!
తెలంగాణ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. అయితే ఆయా పార్టీల అధిష్టానాలు ఎన్నికల బరిలోకి దించేందుకు అభ్యర్థుల జాబితాను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. మొత్తం ఓటర్లు 28,92,786 ఉండగా.. అందుతలో మహిళలు14,60,915, పురుషులు 13,31,395లు ఉన్నారు. అయితే.. పురుషులకంటే మహిళా ఓటర్లు 1,29,520 ఎక్కువగా ఉండటం విశేషం. అయితే.. ఉమ్మడి జిల్లాలో వర్దన్నపేట, స్టేషన్ ఘనపూర్ ఎస్సీ రిజర్వు. ములుగు, మహబూబాబాద్, డోర్నకల్ మూడు నియోజకవర్గాలు ఎస్టీ రిజర్వు. 2018 ఎన్నికల్లో 12 స్థానాల్లో బిఆర్ఎస్ 10 స్థానాలు గెలుచుకుంది. కేవలం ములుగు, భూపాలపల్లి లో కాంగ్రెస్ గెలిచింది. ఏడాదిలోగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి కాంగ్రెస్ కు చేయిచ్చి కారెక్కి గులాబీ గూటిలో చేరారు. ప్రస్తుత ఎన్నికల నేపథ్యంలో బిఆర్ఎస్ 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది.
Also Read : Chandrababu Case: బెయిల్, కస్టడి పిటిషన్ డిస్మిస్ చేసిన ఏసీబీ కోర్టు
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, తాటికొండ రాజయ్య కు టికెట్ నిరాకరణ. ములుగు లో సిట్టింగ్ ఎమ్మెల్యే సీతక్క ను ఎదుర్కొనేలా అదే సామాజిక వర్గానికి చెందిన జడ్పీ చైర్ పర్సన్ బడే నాగజ్యోతి బరిలోకి దింపిన బీఆర్ఎస్. జనగామ టికెట్ విషయంలో సస్పెన్స్ నేడో రేపో తెరపడనుంది. జనగామ సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డిని కాదని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు. ముత్తిరెడ్డి కి టిఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి ఇవ్వడంతో నిన్ననే పదవి బాధ్యతలు స్వీకరించారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ను కాదని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కి టిక్కెట్ ఖరారు చేసారు. రాజయ్యకు రైతుబందు సమితి చైర్మన్ పదవి ఇవ్వగా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. బీఆర్ఎస్ నుంచి పాలకుర్తి లో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వరంగల్ పశ్చిమలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, స్టేషన్ ఘనపూర్ లో ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులను ఖరారు చేసేందుకు భారీ కసరత్తు చేస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఉమ్మడి జిల్లొలో బిఆర్ఎస్ కాంగ్రెస్ మద్యనే ప్రదాన పోటీ. బీజేపీ పోటీ ఉమ్మడి జిల్లాలో నామమాత్రమేకానుంది.
Also Read : Minister KTR : సీఎం కేసీఆర్ జబర్దస్త్ గా ఉన్నాడు.. మనకోసం లోపల కూర్చొని అన్ని చేస్తున్నాడు
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!