G20 Summit: జీ-20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు పుతిన్ దూరం.. క్రెమ్లిన్ ప్రకటన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
G20 Summit: సెప్టెంబర్లో భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ హాజరుకావడం లేదు. పుతిన్ భారత్కు రాలేరని క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ధృవీకరించారు. అదే సమయంలో విమాన ప్రమాదంలో యెవ్జెనీ ప్రిగోజిన్ మరణంలో క్రెమ్లిన్ ప్రమేయం ఉందన్న ఆరోపణలు పూర్తిగా అబద్ధమని ఆయన అన్నారు. ప్రిగోజిన్ మరణం వెనుక క్రెమ్లిన్ ఉందని పాశ్చాత్య దేశాలు చెబుతున్నాయని, ఇది పూర్తిగా అబద్ధమని పెస్కోవ్ చెప్పారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ జి-20 శిఖరాగ్ర సమావేశానికి భారత్కు రావడం లేదని, ఉక్రెయిన్ యుద్ధమే కారణమని పేర్కొంది. జీ-20 సదస్సు కోసం పుతిన్ భారత్లో పర్యటించేందుకు ఎలాంటి ప్రణాళికలు లేవని.. తమ దృష్టంతా ప్రస్తుత సైనిక చర్య పైనే ఉంది దిమిత్రి పెస్కోవ్ వెల్లడించారు.
Read Also: Asaduddin Owaisi: దేశానికి ఏం చెప్పదలచుకున్నారు.. బీజేపీ సర్కార్పై ఒవైసీ ఫైర్
Also Read
- IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
- Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
- Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీకి అన్యాయం.. రెండో టీ20లో కూడా అదే తప్పు’..
- Ben Stokes: క్రికెట్ ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన బెన్ స్టోక్స్.. రిటైర్మెంట్ ప్రకటన..
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్లో జరగనున్న జీ20 సదస్సుకు వ్యక్తిగతంగా హాజరయ్యే ఆలోచన లేదని క్రెమ్లిన్ శుక్రవారం తెలిపిందని రాయిటర్స్ వార్తా సంస్థ నివేదించింది. రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్లో యుద్ధ నేరాలకు పాల్పడ్డారని అంతర్జాతీయ క్రిమినల్ కోర్ట్ (ICC) ఆయనపై వారెంట్ జారీ చేసిన తర్వాత పుతిన్ విదేశాలకు వెళ్లినప్పుడు అరెస్టు చేసే ప్రమాదం ఉంది. దీంతో ఆయన విదేశాలకు వెళ్తే అరెస్టయ్యే ముప్పు ఉంది. ఐసీసీ సభ్యదేశంగా ఉన్న దక్షిణాఫ్రికా.. ఒకవేళ పుతిన్ తమ దేశానికి వస్తే ఆయనను అరెస్టు చేయాల్సి ఉంటుంది. ఈ కారణం వల్లనే ఆయన.. బ్రిక్స్ సదస్సుకు హాజరుకాలేదు. వీడియో లింక్ ద్వారా దక్షిణాఫ్రికాలో ఇటీవల ముగిసిన బ్రిక్స్ సదస్సుకు పుతిన్ హాజరయ్యారు. కాగా.. గతేడాది ఇండోనేషియాలో జరిగిన జీ-20 సదస్సుకు కూడా పుతిన్ గైర్హాజరయ్యారు.
ప్రస్తుత G20 సమ్మిట్కు భారతదేశం ఆతిథ్యం ఇస్తోంది. ప్రధాన కార్యక్రమం సెప్టెంబర్ 9-10 తేదీలలో న్యూఢిల్లీలో జరగనుంది. సమ్మిట్కు 29 మంది దేశాధినేతలతో పాటు ఈయూ ఉన్నతాధికారులు, ఆహ్వానిత అతిథి దేశాలు, 14 అంతర్జాతీయ సంస్థల అధిపతులు హాజరయ్యే అవకాశం ఉంది. న్యూఢిల్లీ సమ్మిట్ ముగింపులో జీ20 లీడర్స్ డిక్లరేషన్ ఆమోదించబడుతుంది.
తాజావార్తలు
-
IND Vs IRE: టీమిండియాకు షాక్.. కొంపముంచనున్న వర్షం.. ఐర్లాండ్దే సిరీస్..
-
NTR – Trivikram Movie: రేపే ఎన్టీఆర్-త్రివిక్రమ్ ‘God Of War’ అనౌన్స్మెంట్!
-
Garuda Puran: చనిపోయిన వారి బట్టలు ఇంట్లో ఉంచుతున్నారా? గరుడ పురాణంలో చెప్పిన భయంకరమైన నిజాలు ఇవే!
-
Komatireddy Venkat Reddy : రేవంత్పై కోమటిరెడ్డి ప్రశంసలు.. నల్లగొండలో 12 సీట్లు మావే.!
-
Womens T20 World Cup: ముగిసిన టీమిండియా బ్యాటింగ్.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే..
ట్రెండింగ్
-
Smriti Mandhana: నీయవ్వ తగ్గేదేలే.. ఆస్ట్రేలియా అంటే బయపడుతామా?.. మా సత్తా ఏంటో చూపిస్తాం!
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!