Vizag: విశాఖ స్టీల్ ప్లాంట్ విషాదం.. డీఎన్ఏ పరీక్షల తర్వాతే మృతదేహాల గుర్తింపు.! విచారణకు కేంద్రం ఉన్నతస్థాయి కమిటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vizag: విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో చోటుచేసుకున్న ఘోర ప్రమాదం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాదంలో మృతి చెందిన ఎనిమిది మంది ఉద్యోగుల మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో వాటిని గుర్తించడం కష్టసాధ్యంగా మారింది. ఈ నేపథ్యంలో మృతదేహాల గుర్తింపునకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని వైద్యులు నిర్ణయించారు. ప్రస్తుతం మృతదేహాలను కింగ్ జార్జ్ ఆసుపత్రి (KGH)లో భద్రపరిచారు.
కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదంలో మృతి చెందిన వారి శరీరాలు వేడి ఉక్కు ద్రవం కారణంగా పూర్తిగా కాలిపోయాయి. ఎవరి మృతదేహమో గుర్తించలేని పరిస్థితి నెలకొంది. మృతుల కుటుంబ సభ్యుల నుంచి డీఎన్ఏ నమూనాలు సేకరించి మంగళగిరిలోని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించనున్నారు. డీఎన్ఏ నివేదికలు వచ్చిన తర్వాతే పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబాలకు అప్పగించే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియ పూర్తవడానికి నాలుగు నుంచి ఐదు రోజుల సమయం పట్టవచ్చని తెలిపారు.
Also Read
- President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
- Ben Stokes: "నేను మానసికంగా అలసిపోయాను".. రిటైర్మెంట్పై నోరు విప్పిన బెన్ స్టోక్స్..
- Anganwadi Working Hours: అంగన్వాడీ కేంద్రాల వేళల్లో కీలక మార్పు.. ఉత్తర్వులు జారీ
- Gudivada Amarnath: మహిళా కమిషన్ ఎదుట నేడు విచారణకు మాజీ మంత్రి.. 'నా వ్యాఖ్యల్లో తప్పు లేదు'..!
ఈ ప్రమాదంలో గోల్డ్ కుమార్ (మేనేజర్), ప్రభాకరరావు (స్టాండ్-3 ఆపరేటర్), జి. భానుకుమార్ (షిఫ్ట్ ఇన్చార్జ్), కృష్ణ నాగు (స్టాండ్-4 ఆపరేటర్), రమణ (కాంట్రాక్ట్ వర్కర్), త్రినాథ్ (కాంట్రాక్ట్ స్టాండ్ ఆపరేటర్), ఎన్. అప్పలరాజు (కాంట్రాక్ట్ స్టాండ్ ఆపరేటర్), జీవీ అప్పారావు (సైడ్ ఆపరేటర్) మృతి చెందారు. ఈ ఘటనతో మృతుల కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. తమ ఆత్మీయుల మృతదేహాలను కూడా గుర్తించలేని స్థితి రావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబాలకు ప్రధాన ఆధారంగా ఉన్న వ్యక్తులను కోల్పోవడంతో వారి భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తమవుతోంది. షిఫ్ట్ ఇన్చార్జ్ జి. భానుకుమార్కు మూడు నెలల పసిబిడ్డ ఉండగా, మరో ఉద్యోగి స్థానంలో విధులకు హాజరై ఈ ప్రమాదానికి గురైనట్లు తెలిసింది. అలాగే 25 ఏళ్లుగా కాంట్రాక్ట్ ఉద్యోగిగా పనిచేస్తున్న రమణ మృతి చెందడంతో ఆయన కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
ఇదిలా ఉండగా.. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ ఉన్నతస్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసింది. బొకారో స్టీల్ ప్లాంట్ సీనియర్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ముగ్గురు సభ్యులతో కూడిన ఈ కమిటీ ప్రమాద స్థలాన్ని పరిశీలించనుంది. ఎస్ఎంఎస్ విభాగంలో ల్యాడిల్ పేలుడు ఎలా జరిగింది, భారీ ప్రాణనష్టం, ఆస్తినష్టం ఎందుకు సంభవించాయనే అంశాలపై సమగ్ర విచారణ చేపట్టనుంది. ప్రమాదానికి కారణమైన సాంకేతిక లోపాలు, ముడి పదార్థాల నాణ్యత, సిబ్బంది నైపుణ్యం, యంత్రాల పరిస్థితి వంటి అంశాలను కమిటీ పరిశీలించనుంది. ముఖ్యంగా దాదాపు 30 ఏళ్ల నాటి యంత్రాలు ఇంకా వినియోగంలో ఉండటం, గత రెండు నెలల్లో 27 సార్లు ల్యాడిల్కు రంధ్రాలు పడి ద్రవ ఉక్కు బయటకు వచ్చినట్లు కార్మిక సంఘాలు చెబుతున్న నేపథ్యంలో ఈ అంశాలు విచారణలో కీలకంగా మారనున్నాయి. కమిటీ 15 రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించనుంది. అయితే ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరోవైపు ప్రమాదంలో గాయపడిన ఆరుగురిలో కొందరికి 90% వరకు కాలిన గాయాలు అయినట్లు వైద్యులు వెల్లడించారు. వారికి చికిత్స కొనసాగుతోంది. ఈ ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విశాఖపట్నం పర్యటనకు సిద్ధమయ్యారు. ఆయన కిమ్స్ ఐకాన్ ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు. అనంతరం స్టీల్ ప్లాంట్కు చేరుకుని ప్రమాద స్థలాన్ని పరిశీలించడంతో పాటు ఘటనకు గల కారణాలపై అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. ప్రస్తుతం మంత్రి నా లోకేష్ ఆసుపత్రికి చేరుకొన్నారు.
youtube.com/watch?v=GBA2yUTUXtc&feature=youtu.be
తాజావార్తలు
-
Deepika Padukone: 8 గంటల వర్క్డేపై దీపికకు ఇండస్ట్రీ మద్దతు.. ఇంద్రజిత్ లంకేష్ కీలక వ్యాఖ్యలు
-
Bulliraju : రోజుకి లక్ష రూపాయలు ఛార్జ్ చేస్తున్న బుల్లిరాజు
-
President Droupadi Murmu Vizag Visit: విశాఖకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. గిరిజన వర్సిటీ తొలి స్నాతకోత్సవానికి హాజరు..
-
LA Olympics 2028: ఒలింపిక్స్కు టీమిండియా చేరాలంటే ఇదే మార్గం.. నంబర్వన్గా నిలవాలి, విఫలమైతే మరో అవకాశం!
-
WhatsApp Custom Username: ప్రైవసీ బూస్ట్!.. వాట్సాప్ 3 బిలియన్ యూజర్ల కోసం కస్టమ్ యూజర్నేమ్.. పూర్తి వివరాలు
ట్రెండింగ్
-
PBKS Star: పంజాబ్ కింగ్స్ స్టార్ క్రికెటర్పై ఎఫ్ఐఆర్ నమోదు.. వంట మనిషిపై..!
-
Clean and Clutter Free Home: బిజీ లైఫ్లోనూ క్లీన్ హోమ్ సాధ్యం.. పరిశుభ్రమైన ఇంటి రహస్యం ఇదే.!
-
6000mAh భారీ బ్యాటరీ, Snapdragon 6 Gen 3 ప్రాసెసర్తో Samsung Galaxy M47 5G లాంచ్.! ధర ఎంతంటే.?
-
టీవీ కాదు భయ్యో.. అంతకు మించి.! AI పవర్, True RGB డిస్ప్లేతో Sony BRAVIA 9 II, BRAVIA 7 II భారత్లో లాంచ్.!
-
Ragi Milk: శరీరాన్ని సహజంగా చల్లగా ఉంచే సూపర్ డ్రింక్ ‘రాగి మిల్క్’.. ఇంట్లోనే చేసేయండి ఇలా.!