Virat Kohli: క్రికెట్ జుజుబీ.. అక్కడే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది!
- లండన్లో ఉంటున్న విరాట్ కోహ్లీ
- వింబుల్డన్ మ్యాచ్ను సతీసమేతంగా వీక్షించిన విరాట్
- వింబుల్డన్ ఆడటమే కష్టమని చెప్పిన కోహ్లీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
క్రికెట్లో కన్నా వింబుల్డన్లోనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుందని టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చెప్పాడు. ప్రపంచకప్లో భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్లు ఉన్నప్పుడు ఎంత తీవ్రమైన ఒత్తిడి ఉంటుందో.. వింబుల్డన్ ప్రతి మ్యాచ్లోనూ అంతే ఉంటుందన్నాడు. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా తమ ఫిట్నెస్ను కాపాడుకోవడం గ్రేట్ అని విరాట్ పేర్కొన్నాడు. ప్రస్తుతం వింబుల్డన్ 2025 టోర్నీ జరుగుతోంది. లండన్లో ఉంటున్న కోహ్లీ.. సోమవారం జకోవిచ్, మినార్ మధ్య మ్యాచ్ను సతీసమేతంగా వీక్షించాడు.
మ్యాచ్ అనంతరం స్టార్ స్పోర్ట్స్ ఛానల్తో విరాట్ కోహ్లీ మాట్లాడుతూ క్రికెట్ కన్నా.. వింబుల్డన్ ఆడటమే కష్టమని చెప్పాడు. ‘క్రికెట్లో ఆటగాళ్లకు దూరంగా ఫాన్స్ ఉంటారు. బౌండరీ దగ్గర ఫీల్డింగ్ చేసే ఆటగాళ్లు మాత్రమే ప్రేక్షకులకు దగ్గరగా ఉంటారు. వింబుల్డన్లో మాత్రం ఫాన్స్ చాలా దగ్గరగా ఉంటారు. ఇది ఆటగాళ్లకు ఒత్తిడిని పెంచుతుంది. అందుకే టెన్నిస్ ఆటగాళ్లంటే నాకు ఎంతో గౌరవం ఉంటుంది. టెన్నిస్ ప్లేయర్స్ శారీరకంగా, మానసికంగా ఫిట్నెస్ను కాపాడుకోవడం నిజంగా గ్రేట్. ప్రపంచకప్లో భారత్, పాకిస్థాన్ మ్యాచ్లో మాత్రమే తీవ్ర ఒత్తిడి ఉంటుంది. టెన్నిస్లో అయితే క్వార్టర్ ఫైనల్ నుంచి ఫైనల్ వరకు తీవ్ర ఒత్తిడిని ఉంటుంది’ అని విరాట్ చెప్పాడు.
Also Read
- Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
- Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
- Nandana Arrest: యూట్యూబర్ నందనను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. ఎయిర్పోర్టులో అరెస్ట్.!
- Pranay Reddy Vanga: ఫేక్ కలెక్షన్ల దందాపై ప్రణయ్ రెడ్డి వంగా సంచలన వ్యాఖ్యలు.!
Also Read: Revanth Reddy: యూరియా సరఫరా వేగవంతం చేయండి.. కేంద్రమంత్రిని కోరిన సీఎం రేవంత్!
ఐపీఎల్ 2025లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) టైటిల్ను గెలుచుకున్న విషయం తెలిసిందే. తొలి ఐపీఎల్ టైటిల్ను గెలిచిన నేపథ్యంలో విరాట్ కోహ్లీ సంబరాలు చేసుకున్నాడు. అనంతరం లండన్కు వెళ్ళిపోయాడు. ప్రస్తుతం కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన విరాట్.. కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్నాడు. బంగ్లాదేశ్ పర్యటన వాయిదా పడడంతో.. విరాట్ ఇప్పట్లో బరిలోకి దిగే అవకాశాలు లేవు. ఆక్టోబర్లో ఆస్ట్రేలియాతో జరిగే వన్డే సిరీస్లో కోహ్లీ ఆడనున్నాడు.
తాజావార్తలు
-
Sumanth Prabhas: ప్రభాస్ బంగారంరా.. కలిసి మాట్లాడిన ఆ క్షణం మైండ్ బ్లాంక్ అయింది.!
-
India vs Japan: టీమిండియా చారిత్రాత్మక మ్యాచ్.. బ్రాడ్కాస్టింగ్పై బిగ్ టెన్షన్.. చివరకు యూట్యూబే దిక్కా!
-
Aqua Farmers Crop Holiday: సమస్యలు పరిష్కరించకపోతే క్రాప్ హాలిడే.. ఆక్వా రైతుల డెడ్లైన్
-
Om Chapter 1: ధనుష్ ‘ఓం’ మూవీపై అంచనాలు పెంచేస్తున్న బర్మా కార్తికేయన్ గ్లింప్స్!
-
CM Rekha Gupta: ఢిల్లీ భవన ప్రమాదంపై సీఎం రేఖా గుప్తా కీలక చర్యలు.. MCD డిప్యూటీ కమిషనర్ సహా 5 మంది అధికారులు సస్పెండ్
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!