Virat Kohli: మళ్లీ చిక్కుల్లో కోహ్లీకి చెందిన పబ్.. కేసు నమోదు చేసిన పోలీసులు..!
- బెంగళూరులోని One8 Commune బార్ అండ్ రెస్టారెంట్ పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు.
- టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ ఈ స్థలానికి సహ యజమానిగా ఉన్నారు.
- బార్ ప్రాంగణంలో స్పెషల్ స్మోకింగ్ జోన్ లేకపోవడం నిబంధనల ఉల్లంఘనగా గుర్తింపు.
- కేసు బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Virat Kohli: బెంగళూరులోని కస్తూర్బా రోడ్, ఎంజీ రోడ్ సమీపంలో ఉన్న One8 Commune బార్ అండ్ రెస్టారెంట్పై కుబ్బన్ పార్క్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ స్థలానికి టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సహ యజమానిగా ఉండటం గమనార్హం. మే 31న బెంగళూరు పోలీసులు సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల నిషేధ చట్టం (COTPA) కింద కేసు నమోదు చేశారు. అలాగే సెక్షన్ 4, సెక్షన్ 21 కింద FIR నమోదు చేశారు. ఈ కేసును స్థానిక న్యాయస్థాన అనుమతి అనంతరం పోలీసులు నమోదు చేశారు.
Read Also: Rajamouli: ఫలితం ఏదైనా.. హార్ట్ బ్రేక్ అవుతుంది.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్..!
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
మే 29 నుంచి బెంగళూరు పోలీసులు ధూమపాన నియమాల ఉల్లంఘనపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. ఈ సందర్భంగా One8 Commune ప్రాంగణంలో ధూమపానం కోసం ప్రత్యేకంగా కేటాయించిన ప్రాంతం లేకపోవడం పోలీసులు గుర్తించారు. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనగా ఉందని పోలీసుల అధికారులు పేర్కొన్నారు. FIRను బార్ మేనేజర్, సిబ్బందిపై నమోదు చేశారు. వారి నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా పోలీసులు అభిప్రాయపడ్డారు.
Read Also: TPCC Mahesh Goud : బీఆర్ఎస్ పాలనపై బహిరంగ చర్చకు సిద్ధమా..? హరీష్ రావుకు సవాల్
నిజానికి One8 Commune పబ్ వార్తల్లోకి రావడం ఇది తొలిసారి కాదు. డిసెంబరు 2024లో బెంగళూరు నగర పాలక సంస్థ BBMP ఈ స్థలానికి ఫైర్ సేఫ్టీ అనుమతి లేని అంశంపై రెండవసారి నోటీసు జారీ చేసింది. జూలై 2024లో, One8 Commune నిబంధనలకు విరుద్ధంగా రాత్రి 1:30 వరకు పని చేసినట్లు కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పటి నిబంధనల ప్రకారం, రాత్రి 1 గంట వరకు మాత్రమే అనుమతి ఉంది.
ఈ పరిణామాలు భారత క్రికెట్ స్టార్ విరాట్ కోహ్లీకి కొత్త చికాకులు తెచ్చిపెడుతున్నాయి. కోహ్లీ ఈ స్థలాన్ని ప్రమోట్ చేయడం, సహ యజమాని కావడంతో ఈ అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి, పబ్లిక్ హెల్త్ నియమాల ఉల్లంఘనలపై బెంగళూరు పోలీసులు తీవ్రంగా స్పందిస్తున్న నేపథ్యంలో ప్రముఖుల సంబంధిత వ్యాపారాలకూ ఈ చర్యలు వర్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!