Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ కెప్టెన్!
- టెస్టులకు విరాట్ కోహ్లీ వీడ్కోలు
- 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
- 2011లో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ
- 'ది మోస్ట్ సక్సెస్ఫుల్' టీమిండియా కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం పొట్టి క్రికెట్కు టాటా చెప్పిన కోహ్లీ.. తాజాగా టెస్టులకు గుడ్బై చెప్పాడు. ఇక కింగ్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2011లో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ టెస్ట్ కెప్టెన్ కూడా. ఆ రికార్డ్స్ ఏంటో ఓసారి చూద్దాం.
2015లో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. జనవరి 2022 వరకు టెస్ట్ కెప్టెన్గా ఉన్న కోహ్లీ.. 68 మ్యాచ్లలో సారథిగా వ్యవహరించాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా 40 మ్యాచ్ల్లో గెలవగా.. 17 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ఇక 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విజయశాతం 58.82 శాతంగా ఉంది. ఇది మరెవరికి సాధ్యం కాలేదు. భారత క్రికెట్కు 2015-2022 మధ్య కాలం స్వర్ణ యుగంగా నిలిచింది. దాంతో టీమిండియా టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు.
Also Read
- Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
- Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
- PSCMS : ఇక ప్రైవేట్ స్కూళ్లకు చుక్కలే.. రంగంలోకి తెలంగాణ విద్యాశాఖ 'ఆన్లైన్ ఫిర్యాదుల' అస్త్రం.!
- Story Board: నాడు కేసులు.. నేడు వరాలు.. యువతను ఆకట్టుకునేందుకు బీజేపీ కొత్త వ్యూహాలు..!
Also Read: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
ఎంఎస్ ధోనీ 60 టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించాడు. ఇందులో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు ఉన్నాయి. ధోనీ విజయ శాతం 45గా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడింది. ఇందులో 21 విజయాలు, 13 ఓటములు ఉండగా.. 15 డ్రాగా ముగిసాయి. దాదా విజయ శాతం 42.86గా ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ 47 టెస్టుల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు.14 విజయాలు, 14 ఓటములు మరియు 19 డ్రాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అజారుద్దీన్ విజయ శాతం 29.78.
తాజావార్తలు
-
Mahesh – Sandeep Vanga: స్పిరిట్ తర్వాత మహేష్ బాబు-సందీప్ రెడ్డి వంగ కాంబో?
-
Spirit : స్పిరిట్ ఎన్ని వేల కోట్లు..?
-
Sandeep Vanga : Spirit సెట్ లో అందరికి కోటింగ్…ప్రణయ్ రెడ్డి సంచలన కామెంట్స్
-
Google Offers For Students: విద్యార్థులకు గూగుల్ బంపరాఫర్.. రూ.4,800 విలువైన ఏఐ సబ్స్క్రిప్షన్ ఫ్రీ.. ఎప్పటి వరకు అంటే..?
-
Maharashtra: ‘‘వచ్చే జన్మలోనైనా డాక్టర్ అవుతా’’.. నీట్ అభ్యర్థి ఆత్మహత్య
ట్రెండింగ్
-
Home Decoration Ideas : వరలక్ష్మీ వ్రతం 2026.. తక్కువ బడ్జెట్లో ఇంటికి పండుగ లుక్.!
-
50 గంటల బ్యాటరీ, 42ms లో లేటెన్సీతో రూ.1,899కే iQOO Buds లాంచ్.. గేమర్లకు బెస్ట్ TWS.!
-
రూ.1,999కే CMF Buds Neo.. 35dB ANC, 52 గంటల బ్యాటరీ లైఫ్తో అదిరిపోయే ఇయర్బడ్స్..!
-
144Hz AMOLED డిస్ప్లే, 7050mAh బ్యాటరీతో iQOO Z11 వచ్చేసిందోచ్.. ధర ఎంతంటే.?
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?