Virat Kohli: విరాట్ కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ కెప్టెన్!
- టెస్టులకు విరాట్ కోహ్లీ వీడ్కోలు
- 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు
- 2011లో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన కోహ్లీ
- 'ది మోస్ట్ సక్సెస్ఫుల్' టీమిండియా కెప్టెన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీమిండియా స్టార్ బ్యాటర్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టులకు వీడ్కోలు పలికాడు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో సుదీర్ఘ పోస్ట్ చేశాడు. 2024 టీ20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం పొట్టి క్రికెట్కు టాటా చెప్పిన కోహ్లీ.. తాజాగా టెస్టులకు గుడ్బై చెప్పాడు. ఇక కింగ్ కేవలం వన్డేల్లో మాత్రమే ఆడనున్నాడు. 2025 జనవరి 3న ఆస్ట్రేలియాతో చివరి టెస్టు ఆడాడు. 2011లో టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టిన విరాట్.. 123 టెస్టులు ఆడి 46.85 సగటుతో 9,230 పరుగులు చేశాడు. ఎన్నో గొప్ప ఇన్నింగ్స్లు ఆడిన కోహ్లీ.. ‘ది మోస్ట్ సక్సెస్ఫుల్’ టెస్ట్ కెప్టెన్ కూడా. ఆ రికార్డ్స్ ఏంటో ఓసారి చూద్దాం.
2015లో ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ తర్వాత భారత జట్టు పూర్తిస్థాయి టెస్ట్ కెప్టెన్గా విరాట్ కోహ్లీ బాధ్యతలు చేపట్టాడు. జనవరి 2022 వరకు టెస్ట్ కెప్టెన్గా ఉన్న కోహ్లీ.. 68 మ్యాచ్లలో సారథిగా వ్యవహరించాడు. విరాట్ సారథ్యంలో టీమిండియా 40 మ్యాచ్ల్లో గెలవగా.. 17 మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసింది. ఇక 11 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. కోహ్లీ కెప్టెన్సీలో భారత్ విజయశాతం 58.82 శాతంగా ఉంది. ఇది మరెవరికి సాధ్యం కాలేదు. భారత క్రికెట్కు 2015-2022 మధ్య కాలం స్వర్ణ యుగంగా నిలిచింది. దాంతో టీమిండియా టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్గా కోహ్లీ నిలిచాడు.
Also Read
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- Women's World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
Also Read: Satya Kumar Yadav: నర్సులు సంపదను సృష్టిస్తారని ఇవాళే తెలిసింది!
ఎంఎస్ ధోనీ 60 టెస్టుల్లో భారత్కు నాయకత్వం వహించాడు. ఇందులో 27 విజయాలు, 18 ఓటములు, 15 డ్రాలు ఉన్నాయి. ధోనీ విజయ శాతం 45గా ఉంది. సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో భారత్ 49 టెస్టులు ఆడింది. ఇందులో 21 విజయాలు, 13 ఓటములు ఉండగా.. 15 డ్రాగా ముగిసాయి. దాదా విజయ శాతం 42.86గా ఉంది. మహమ్మద్ అజారుద్దీన్ 47 టెస్టుల్లో భారతదేశానికి నాయకత్వం వహించాడు.14 విజయాలు, 14 ఓటములు మరియు 19 డ్రాలు అతడి ఖాతాలో ఉన్నాయి. అజారుద్దీన్ విజయ శాతం 29.78.
తాజావార్తలు
-
Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
-
Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
-
Women’s World Cup 2026: రన్రేట్ ప్లస్.. కానీ ఆసీస్తో నెక్స్ట్ మ్యాచ్! సెమీఫైనల్ చేరాలంటే భారత్కు ఉన్న అవకాశాలివే..
-
CM Yogi: “ఎవ్వరినీ వదిలి పెట్టను”.. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
-
Online Shopping: ఒక్క పైసా ఖర్చు చేయకుండా ఆన్లైన్ షాపింగ్… కొరియాలో ఊపందుకుంటున్న కొత్త ట్రెండ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!
-
Baahubali 3 Announced: ఇండియన్ సినీ ప్రియులకు బిగ్ సర్ప్రైజ్.. ‘బాహుబలి 3′ వస్తోంది!