Kohli vs Konstas: హీటెక్కిన బాక్సింగ్ డే టెస్ట్.. కోహ్లీ, కాన్స్టాస్ మధ్య వాగ్వాదం.. ఆసీస్ మాజీలు ఫైర్!
- ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ హీటెక్కింది..
- విరాట్ కోహ్లీ, ఆసీస్ ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య వాగ్వాదం..
- విరాట్ కోహ్లీపై మండిపడిన రికీ పాంటింగ్, మైకెల్ వాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli vs Konstas: ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు హీటెక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, కాన్స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడంతో గొడవకు దారి తీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపు చేశారు. కానీ, కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రియాక్ట్ అయ్యారు. కాన్స్టాస్ తన దారిన తాను వెళ్తుంటే.. విరాట్ మాత్రం తన డైరక్షన్ను మార్చుకుని.. సదరు ప్లేయర్ భుజాలు తాకడం మంచిది కాదని తెలిపారు. ఈ ఘటనలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలని మైకెల్ వాన్ పేర్కొన్నాడు.
Also Read
- Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
- Hyderabad: ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ వేళ.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఫ్యాన్స్కు పండగే..
- ICC: ఐసీసీ సంచలన నిర్ణయం.. ఆ పాకిస్థాన్ స్టార్పై నిషేధం.. ఎందుకంటే..?
- Rohit Sharma: ఇది కరెక్ట్ కాదు.. రోహిత్ శర్మ రికార్డులు బీసీసీఐ పరిశీలించాల్సిందే!
ఇక, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ కాన్స్టాస్ క్రీజ్లో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్న సమయంలో కోహ్లీ వద్దకు బాల్ వెళ్లింది.. దానిని తీసుకుని నాన్స్ట్రైకర్ వైపు వస్తుండగా.. స్ట్రైకింగ్ క్రీజ్ వైపు కాన్స్టాస్ వెళ్తుండగా.. వీరిద్దరూ ఎదురుపడటంతో భుజాలు తాకాయి. దీంతో కాన్స్టాస్ ఏదో కామెంట్స్ చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా రియాక్ట్ అయ్యాడు. కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొనడంతో.. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
ఈ ఘటనపై ఒకవేళ ఐసీసీ రిఫరీ చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ ల్లో ఆసక్తి రేపుతోంది. రూల్స్ ప్రకారం.. ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అలాగే, ప్లేయర్, సహాయ సిబ్బందిని, అంపైర్ను, మ్యాచ్ రిఫరీని లేదా ఇతర వ్యక్తిని దురుద్దేశంతో కావాలని తాకితే ఐసీసీ చట్టం 2.12 ఆర్టికల్ ప్రకారం శిక్షకు అర్హుడు. ఇందులో ఒక్క మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉంటది. తన తప్పును అంగీకరిస్తే డీమెరిట్ పాయింట్లతో బయట పడే అవకాశం ఉంటుందని ఐసీసీ రూల్స్ పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Citizenship: భూమి పత్రాలు పౌరసత్వానికి ఆధారం కాదు: కలకత్తా హైకోర్టు..
-
UK: బ్రిటన్ ప్రధానిగా ఆండీ బర్న్హామ్.. సోమవారం బాధ్యతలు స్వీకరణ
-
Ponnam Prabhakar: అలాంటి వాహనాలను సీజ్ చేయండి.. మంత్రి పొన్నం ప్రభాకర్ సీరియస్ వార్నింగ్..
-
Sonam Wangchuk: సోనం వాంగ్చుక్ దీక్షలో నవ్వులు.. పువ్వులు.. ఏం జరిగిందంటే..!
-
Gambhir-Kohli: గంభీర్-కోహ్లీ మధ్య ‘కోల్డ్ వార్’.. తొలి సారి నోరు విప్పిన టీమిండియా కోచ్!
ట్రెండింగ్
-
144Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరాతో Tecno Camon 50 Ultra 5G భారత్లో లాంచ్.. ధర ఎంతంటే?
-
Karapannam Recipe: అన్నం మిగిలి పోయిందా.? ఏంపర్లేదు.. ఇలా ‘కారపన్నం’ చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!
-
రూ.14,499లకే 8000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Realme C100x లాంచ్..!
-
Chilli Egg Recipe: రెస్టారెంట్ స్టైల్ ‘స్పైసీ చిల్లీ ఎగ్’.. ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి.!
-
Tollywood: సినిమాకి కలెక్షన్స్ వచ్చినా నిర్మాతలకు డబ్బులు రావా.! అసలు నిజం ఏంటి.?