Kohli vs Konstas: హీటెక్కిన బాక్సింగ్ డే టెస్ట్.. కోహ్లీ, కాన్స్టాస్ మధ్య వాగ్వాదం.. ఆసీస్ మాజీలు ఫైర్!
- ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్ట్ హీటెక్కింది..
- విరాట్ కోహ్లీ, ఆసీస్ ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య వాగ్వాదం..
- విరాట్ కోహ్లీపై మండిపడిన రికీ పాంటింగ్, మైకెల్ వాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kohli vs Konstas: ఈరోజు ప్రారంభమైన బాక్సింగ్ డే టెస్టు హీటెక్కింది. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, ఆస్ట్రేలియా ప్లేయర్ సామ్ కాన్స్టాస్ మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. అయితే, కాన్స్టాస్ భుజం తాకుతూ విరాట్ కోహ్లీ నడిచి వెళ్లడంతో గొడవకు దారి తీసింది. అంపైర్లతో పాటు మరో ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా వెంటనే పరిస్థితిని అదుపు చేశారు. కానీ, కోహ్లీ తీరుపై ఆసీస్ మాజీ సారథి రికీ పాంటింగ్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకెల్ వాన్ రియాక్ట్ అయ్యారు. కాన్స్టాస్ తన దారిన తాను వెళ్తుంటే.. విరాట్ మాత్రం తన డైరక్షన్ను మార్చుకుని.. సదరు ప్లేయర్ భుజాలు తాకడం మంచిది కాదని తెలిపారు. ఈ ఘటనలో కోహ్లీ ప్రవర్తించిన తీరుపై మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ దృష్టి సారించాలని మైకెల్ వాన్ పేర్కొన్నాడు.
Also Read
- Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
- Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
ఇక, ఆస్ట్రేలియా యువ ఓపెనర్ కాన్స్టాస్ క్రీజ్లో ఉండగా.. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్ వేస్తున్న సమయంలో కోహ్లీ వద్దకు బాల్ వెళ్లింది.. దానిని తీసుకుని నాన్స్ట్రైకర్ వైపు వస్తుండగా.. స్ట్రైకింగ్ క్రీజ్ వైపు కాన్స్టాస్ వెళ్తుండగా.. వీరిద్దరూ ఎదురుపడటంతో భుజాలు తాకాయి. దీంతో కాన్స్టాస్ ఏదో కామెంట్స్ చేయడంతో కోహ్లీ కూడా ధీటుగా రియాక్ట్ అయ్యాడు. కొంతసేపు ఇరువురి మధ్య వాగ్వాదం నెలకొనడంతో.. ఉస్మాన్ ఖవాజా, అంపైర్లు వచ్చి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: Joe Biden: జో బైడెన్ కీలక నిర్ణయం.. ఉక్రెయిన్కు మరిన్ని ఆయుధాలు అందిస్తామని వెల్లడి..
ఈ ఘటనపై ఒకవేళ ఐసీసీ రిఫరీ చర్యలు తీసుకుంటే ఏం జరుగుతుందనేది క్రికెట్ ఫ్యాన్స్ ల్లో ఆసక్తి రేపుతోంది. రూల్స్ ప్రకారం.. ఒక మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉందని క్రికెట్ విశ్లేషకుల అంచనా వేస్తున్నారు. అలాగే, ప్లేయర్, సహాయ సిబ్బందిని, అంపైర్ను, మ్యాచ్ రిఫరీని లేదా ఇతర వ్యక్తిని దురుద్దేశంతో కావాలని తాకితే ఐసీసీ చట్టం 2.12 ఆర్టికల్ ప్రకారం శిక్షకు అర్హుడు. ఇందులో ఒక్క మ్యాచ్ నిషేధం విధించే ఛాన్స్ ఉంటది. తన తప్పును అంగీకరిస్తే డీమెరిట్ పాయింట్లతో బయట పడే అవకాశం ఉంటుందని ఐసీసీ రూల్స్ పేర్కొంటున్నాయి.
తాజావార్తలు
-
Donald Trump: గూగుల్, చాట్జీపీటీలకు షాక్.. కంపెనీల్లో వాటాలు అడుగుతున్న డొనాల్డ్ ట్రంప్!
-
Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్తో రూ.95,100 మాయం..
-
Mohammed Siraj: ఇక వరంగల్కు ఆడనున్న టీమిండియా స్టార్ పేసర్ సిరాజ్!
-
Summer Holidays Extended: విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వేసవి సెలవులు పొడిగింపు
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!