Virat Kohli: ఇంగ్లాండ్‌కు అసలైన మొగుడు విరాట్.. మైదానంలోకి తిరిగి రాగానే ‘కోచ్’గా మారిన కోహ్లీ!

Virat

Virat

Virat Kohli: ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 0-4తో క్లీన్‌స్వీప్ అయి తీవ్ర నిరాశలో ఉన్న టీమిండియా.. ఇక వన్డే సిరీస్‌లో ఎలాగైనా పుంజుకోవాలని చూస్తోంది. మూడు మ్యాచ్‌ల ఈ వన్డే సిరీస్ జూలై 14 నుంచి ప్రారంభం కానుంది. వన్డే సిరీస్ కోసం రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా వంటి సీనియర్ ఆటగాళ్లు జట్టులోకి తిరిగి రావడంతో భారత జట్టుకు కొండంత బలం చేకూరినట్లయింది. ఈ సిరీస్ ప్రారంభానికి ముందు శనివారం బర్మింగ్‌హామ్‌లో జరిగిన టీమిండియా ప్రాక్టీస్ సెషన్‌లో ఒక ఆసక్తికరమైన దృశ్యం కనిపించింది. ఈ ఏడాది ఆరంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్ తర్వాత విరాట్ కోహ్లీ మళ్లీ టీమిండియా జెర్సీలో మైదానంలోకి అడుగుపెట్టాడు. గాయం కారణంగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన వన్డే సిరీస్‌కు దూరమైన కోహ్లీ.. సుదీర్ఘ విరామం తర్వాత పునరాగమనం చేస్తూ మొదటి ప్రాక్టీస్ సెషన్‌లోనే తీవ్రంగా చెమటోడ్చాడు. దాదాపు రెండు గంటల పాటు సాగిన ఈ అభ్యాసంలో విరాట్ కోహ్లీ వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు దాదాపు అరగంట పాటు బ్యాటింగ్ పాఠాలు నేర్పించాడు. షాట్ సెలక్షన్, ఇంగ్లాండ్ బౌలర్లను ఎలా ఎదుర్కోవాలి, ఇంగ్లీష్ పరిస్థితుల్లో బ్యాటింగ్ వ్యూహాలు ఎలా ఉండాలి అనే విషయాలపై గిల్‌తో కోహ్లీ సుదీర్ఘంగా చర్చించాడు. కేవలం మాటలతోనే సరిపెట్టకుండా, కోహ్లీ స్వయంగా నెట్స్‌లో రకరకాల షాట్లు ఆడుతూ గిల్‌కు వివరించాడు. ఇంగ్లాండ్ గడ్డపై మొదటిసారి వన్డే జట్టుకు సారథ్యం వహిస్తున్న గిల్‌కు కోహ్లీ అనుభవం ఎంతో ఉపయోగపడనుంది.

కోహ్లీ ముంగిట అరుదైన రికార్డు:

ఇంగ్లాండ్ పరిస్థితులపై విరాట్ కోహ్లీకి మంచి అవగాహన ఉంది. అక్కడ ఆడిన 33 వన్డేల్లో అతను 51.88 సగటుతో ఒక శతకం, 12 అర్ధశతకాల సహాయంతో 1349 పరుగులు చేశాడు. ఈ సిరీస్‌లో కోహ్లీ వన్డే క్రికెట్‌లో 15 వేల పరుగుల మైలురాయిని అందుకునే సువర్ణావకాశం ఉంది. ఇందుకోసం అతను ఈ మూడు వన్డేల సిరీస్‌లో 2023 పరుగులు చేయాల్సి ఉంటుంది. మరోవైపు, కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు ఈ పర్యటన ఒక పెద్ద పరీక్ష కానుంది. అయితే, ఇంగ్లాండ్‌పై గిల్‌కు మంచి రికార్డు ఉంది. ఇప్పటివరకు ఇంగ్లీష్ జట్టుపై ఆడిన 4 వన్డేల్లో 67 సగటుతో 268 పరుగులు చేశాడు. ఇందులో మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. చివరిగా ఇంగ్లాండ్‌తో ఆడిన మ్యాచ్‌లో గిల్ 102 బంతుల్లో 112 పరుగుల అద్భుత సెంచరీతో రాణించాడు.

నెట్స్‌లో రోహిత్, బుమ్రా జోరు:

తొలి ప్రాక్టీస్ సెషన్‌లో రోహిత్ శర్మ కూడా పూర్తి ఫామ్‌లో కనిపించాడు. నెట్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేస్తూ బంతులను బాదాడు. ఇక స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా, గుర్‌నూర్ బ్రార్‌లు బ్యాటర్లకు కఠిన సవాళ్లు విసిరారు. ముఖ్యంగా పిచ్‌పై పడిన తర్వాత వేగంగా బౌన్స్ అయ్యే బంతులపై వారు ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ కూడా నెట్స్‌లో తీవ్రంగా శ్రమించాడు. భారత బ్యాటర్లను ఇంగ్లాండ్ పరిస్థితులకు అలవాటు చేయడానికి స్థానిక స్పిన్ బౌలర్ల సహాయాన్ని కూడా తీసుకున్నారు. ఈ ప్రాక్టీస్ సెషన్‌లో ఫీల్డింగ్ కోచ్ టి. దిలీప్, స్పిన్ బౌలింగ్ కోచ్ సాయిరాజ్ బహుతులే, త్రోడౌన్ స్పెషలిస్ట్ దయాసాగర్ పర్యవేక్షించారు.