Viral Video: జోరు వానలో చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ.. హాట్సాఫ్ లైన్మ్యాన్! వీడియో వైరల్
- జిల్లాలను ముంచెత్తుతున్న భారీ వర్షాలు
- జలదిగ్బంధంలోపలు జిల్లాలు
- చెరువు మధ్యలోకి వెళ్లి విద్యుత్ పునరుద్ధరణ
- హైముద్దీన్ సూపర్ అంటూ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Lineman Restores Power in Middle of Lake in Siddipet: గత 5-6 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోత వానలకు చాలా జిల్లాలు అతలాకుతలమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధం కావడంతో జనజీవనానికి ఆటంకం కలుగుతోంది. చాలా చోట్ల చెట్లు నేలకొరగడం, భారీ గాలులకు విద్యుత్ సరఫరాకు ఆటంకం కలుగుతోంది. ఓ వైపు భారీ వర్షాలు కురుస్తున్నా.. విద్యుత్ అంతరాయం కలగకుండా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు. చెట్లు, స్తంభాలు నేలకొరగడంతో వైర్లు తెగిపడినా.. గంటల్లో బాగు చేస్తున్నారు.
తాజాగా సిద్దిపేటలోని నాగసముద్రాల గ్రామం (బత్తులవానిపల్లి)లో విద్యుత్ సరఫరాకు కలిగింది. లైన్మెన్ హైముద్దీన్ నాగసముద్రం చెరువు మధ్యలో లైన్ తెగిపోవడం గుర్తించాడు. విద్యుత్ పునరుద్ధరించేందుకు హైముద్దీన్ పెద్ద సాహసం చేశారు. తాడు సాయంతో చెరువు మధ్యలోకి వెళ్లి.. స్తంభం ఎక్కి మరీ కనెక్షన్ ఇచ్చారు. దాంతో నాగసముద్రాల గ్రామంలో వెలుగులు విరజిమ్మాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. లైన్మెన్ హైముద్దీన్పై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. హైముద్దీన్ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read
- Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
- Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
- BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
- Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
Also Read: TSRTC Record: రాఖీ పౌర్ణమికి రికార్డు ప్రయాణాలు.. టీఎస్ఆర్టిసీ చరిత్రలో ఇదే తొలిసారి!
లైన్మెన్ హైముద్దీన్ సాహసంను దక్షిణ తెలంగాణ విద్యుత్తు పంపిణీ సంస్థ (టీజీఎస్పీడీసీఎల్) తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. నాగసముద్రం చెరువు, బత్తులవానిపల్లి (బస్వాపూర్ సెక్షన్, సిద్దిపేట సర్కిల్) మధ్యలో తెగిపోయిన లైన్ను పునరుద్ధరించడం జరిగింది అని పేర్కొంది. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కలను ట్యాగ్ చేశారు. టీజీఎస్పీడీసీఎల్ ట్వీట్పై డిప్యూటీ సీఎం స్పందించారు. ‘జోరు వానలో సైతం విద్యుత్తును పునరుద్ధరించడానికి ధైర్యంగా పనిచేసిన సిద్దిపేటకు చెందిన మన లైన్మ్యాన్ హైముద్దీన్ గారిని చూసి గర్వంగా ఉంది. మీ ధైర్యం తెలంగాణ ఇంధన శాఖ స్ఫూర్తిని ప్రతిబింబిస్తుంది. మనం అంకితభావంతో ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు భద్రతకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలి’ అని పేర్కొన్నారు.
Proud of our lineman, Haimuddin garu from Siddipet, who braved floodwaters to restore power.
Your courage reflects the spirit of Telangana’s Energy Department.
While we serve the people with dedication, we must always keep safety first. https://t.co/6AqaKBYPEA— Bhatti Vikramarka Mallu (@Bhatti_Mallu) August 13, 2025
తాజావార్తలు
-
Offer for Gamers: వీడియో గేమ్ ఆడేవారికి రూ.1.38 కోట్ల ప్యాకేజీ.. డిగ్రీ అవసరం లేకుండానే ఉద్యోగం..
-
Renukaswamy Murder: నటుడు దర్శన్కు బిగుస్తోన్న ఉచ్చు.. సహ నిందితుడి సంచలన వాంగ్మూలం
-
BE ALERT: అనకాపల్లిలో దారుణం.. బాలికపై లైంగిక దాడి, తల్లిపైనా పోక్సో కేసు
-
Khiladi Wife: పక్కా ప్లాన్ చేసింది.. భర్తను లేపేసింది..
-
Rahul Gandhi: ఇటలీ ప్రధాని మెలోనీని టార్గెట్ చేసిన కాంగ్రెస్.. రాహుల్ గాంధీ వీడియో వైరల్
ట్రెండింగ్
-
బ్లాక్ డిజైన్, హైబ్రిడ్ పవర్తో Toyota Hyryder Aero Black Edition వచ్చేసింది.. ధర, ఫీచర్లు ఇవే..!
-
5,000 నిట్స్ డిస్ప్లే, 50MP కెమెరాలు, 6,500mAh బ్యాటరీతో Vivo X300 FE కొత్త వేరియంట్ లాంచ్..!
-
Airtel Recharge Plans: రూ.299 సహా 4 ప్రీపెయిడ్ ప్లాన్లు తొలగింపు.. ఇకపై కొత్త ఆప్షన్లు ఇవే.!
-
Money Plant Growing Tips: మానీ ప్లాంట్ వేగంగా, గుబురుగా పెరగాలంటే ఈ చిట్కాలు ఫాలో అవ్వండి.!
-
CSK Head Coach: సీఎస్కే హెడ్ కోచ్గా వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్!