Viral video : తల్లితో కొడుకు ప్రాంక్.. హార్ట్ టచింగ్ వీడియో వైరల్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తల్లి, బిడ్డల అనుభందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆ బంధానికి పేరు, సరి తూగె ప్రేమ మరొకటి లేదు.. ఎక్కడ.. ఎంత మందిలో ఉన్నా కూడా తన కొడుకును తల్లి గుర్తు పడుతుంది.. తన పిల్లల విషయంలో చాలా నిస్వార్ధంగా ఉంటుంది. వారి కోసం ప్రాణాలను ఇవ్వడానికైనా సిద్ధమవుతుంది.. పిల్లలకు మంచి జీవితం అందించడానికి పొద్దున లేచిన సమయం నుంచి రాత్రి పడుకునే వరకు పనిచేస్తూనే ఉంటుంది. అందుకే తల్లిని మించిన దైవం మరొకటి ఉండదని కూడా అంటుంటారు.
ఎప్పుడూ పిల్లల తిన్నారా, మంచిగున్నారా, పడుకున్నారా అనేవే తల్లికి ముఖ్యం. అలా ఆలోచించే తల్లి తమ బిడ్డ చదువుల కోసమో లేదా ఉద్యోగం కోసమో విదేశాలకు వెళ్ళినప్పుడు ఎంతగా అల్లాడిపోతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. ఓ కొడుకు తన తల్లిని సడెన్ గా సర్ప్రైజ్ చెయ్యాలని అనుకున్నాడు.. తల్లి తనను గుర్తుపట్టకుండా కర్చీఫ్ పెట్టుకొని వెళ్లాడు.. ఆ తల్లి చేపలు అమ్ముతుండగా ఆమె వద్దకు వెళ్లి బేరం ఆడాడు. అయితే రెండు నిమిషాల్లోనే ఆ అమ్మ బేరం ఆడేది తన కుమారుడేనని గుర్తించింది. ఆ తర్వాత బాగా ఎమోషనల్ అయ్యి ఆనంద భాష్పాలు కార్చింది… అందుకు సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..
Also Read
- Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
- Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
- Tamil Nadu: విత్తనాలు చల్లింది అన్నామలై.. పంట కోసుకున్నది విజయ్.. తమిళ గడ్డపై "సింగం" ఫార్ములా బ్లాక్బస్టర్!!
ఈ ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది.. గంగోల్లి నివాసి అయిన రోహిత్ ఏళ్ల కిందట ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్లాడు. రీసెంట్ గానే ఇంటికి తిరిగి వచ్చాడు. అయితే ఇంటికి వస్తున్నట్లు తల్లికి గానీ, బంధుమిత్రులకు గానీ చెప్పలేదు. నేరుగా ఇంటికి వెళ్లిపోయాడు ఆ సమయంలో ఆమె ఇంట్లో లేదు. దాంతో అతడు కందపుర తాలూకాలోని గంగోల్లి మార్కెట్కు వెళ్లాడు. తన అమ్మ ఉండటం గమనించి ముఖానికి కర్చీఫ్ కట్టుకున్నాడు. కళ్ళు కనిపించకుండా గ్లాసెస్ పెట్టుకున్నాడు. ఆపై తల్లితో చేపలు బేరం ఆడటం మొదలుపెట్టాడు… మొదట కనుక్కోలే పోయింది.. ఆ తర్వాత తన కొడుకే అని తెలుసుకొని ఏడ్చేసింది.. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..
Son of a fisherwoman who worked in Dubai returned to his native- Gangolli in #Uudpi, he did not reveal his identity initially, but mother sensed it was his son who played a prank#Mothersentiment @XpressBengaluru @vinndz_TNIE pic.twitter.com/XvS5XIGeKc
— Prakash (@prakash_TNIE) September 22, 2023
తాజావార్తలు
-
Aadhaar Update: ఆధార్లో ఈ తప్పులు ఉంటే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవు.. ఇప్పుడే చెక్ చేసుకోండి
-
Visakhapatnam-Araku Vistadome Train: ఏపీకి జాతీయ స్థాయిలో గౌరవం.. దేశంలోనే నెం.1 రూట్గా విశాఖ-అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం.!
-
Malkajgiri: ఎట్టకేలకు చిక్కిన నేపాలీ గ్యాంగ్.. వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Dream Numbers Lottery: కలలో వచ్చిన నంబర్లలే జీవితాన్ని మార్చేశాయి.. కూరగాయలు అమ్మే మహిళకు రూ.2 కోట్ల లాటరీ!
-
AFG vs IND: లంచ్ బ్రేక్.. ఆచితూచి ఆడుతున్న భారత బ్యాటర్లు.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!