Janasena: కొందరు జనసేన నేతలతో పార్టీకి చెడ్డపేరు..! వినుత దంపతుల ఆరోపణలతో రాజకీయ కలకలం..
- పార్టీకి చెడ్డపేరు తెస్తున్న కొందరు జనసేన నేతలు..
- జనసేనకు మచ్చ తెస్తున్న నేతల డర్టీ పనులు..
- యువతిని మోసం చేశాడనే కేసులో కిరణ్ రాయల్..
- మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్..
- మహిళా డాక్టర్పై వేధింపుల కేసులో మరో నేత సస్పెండ్ ..
- మర్డర్ కేసులో కోట వినుత, ఆమె భర్త చంద్రబాబు అరెస్ట్ ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Janasena: జనసేనకు చెందిన కొందరి నేతల డర్టీ పనులు పార్టీపై ప్రభావం చూపిస్తున్నాయి. ప్రతిపక్షాలు మాత్రమే కాదు, సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సామాన్యులు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. కొందరు నేతల డర్టీ వీడియోలు, లైంగిక ఆరోపణలు, కుటుంబ కలహాలు ఇలా ప్రతి సంఘటన కూడా ప్రత్యక్షంగా పార్టీపై ప్రతికూలంగా ప్రభావం చూపుతున్నాయి. ఇవేనా ప్రజాస్వామ్యానికి కొత్త గళంగా ఎదిగిన జనసేన నాయకత్వ లక్షణాలు అన్న ప్రశ్నలు ప్రజల నోట మొదలయ్యాయి. వివాదాలకు కారణమైన నేతలపై అధినేత పవన్ కళ్యాణ్… ఆలస్యం చేయకుండా చర్యలు తీసుకుంటున్నప్పటికీ… ప్రజా విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం నుంచి బయటపడాల్సిన బాధ్యత మాత్రం మిగిలే ఉంది.
Read Also: Donald Trump: 50 రోజుల్లో యుద్ధం ఆపకుంటే.. రష్యాకు ట్రంప్ వార్నింగ్..
Also Read
- Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
- BAN vs AUS: ఆసీస్పై పంజా విసిరిన బంగ్లాదేశ్.! 86 పరుగుల తేడాతో భారీ విజయం..
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
వరుస విమర్శలు, వివాదాలు జనసేనను చుట్టుముడుతున్నాయి. పవన్ కళ్యాణ్ నిజాయితీ, నిబద్ధతకు పెద్దపీట వేస్తూ పార్టీని పటిష్టానికి కృషి చేస్తుండగా… కింది స్థాయిలో మాత్రం కొంతమంది నేతల డర్టీ పనులు పార్టీకి మచ్చ తెస్తున్నాయి. ఇటీవల కొందరు జనసేన నేతలు మర్డర్ కేసులు, మోసం, వేధింపుల ఆరోపణలతో వార్తల్లో నిలుస్తున్నారు. ప్రేమ పేరుతో యువతిని మోసం చేశాడనే కేసులో కిరణ్ రాయల్, మైనర్ బాలికపై లైంగిక దాడి కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ అరెస్ట్ కూడా అయ్యారు. మహిళా డాక్టర్పై వేధింపుల కేసులో మరో నేత సస్పెండ్ అయ్యారు. తాజాగా శ్రీకాళహస్తికి చెందిన కారు డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు హత్య కేసులో శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ కోట వినుత, ఆమె భర్త చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో కోట వినుతను పార్టీ నుంచి బహిష్కరించింది జనసేన.
Read Also: Supreme Court: ప్రధాని మోడీ-ఆర్ఎస్ఎస్పై కార్టూన్, సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం..
ఈ తరహా ప్రవర్తనపై జనసేన గతంలోనే ఇతర పార్టీలపై తీవ్రంగా విమర్శలు చేసింది. వైసీపీ నేతలు అంబటి రాంబాబు, గోరంట్ల మాధవ్, అవంతి శ్రీనివాస్, అనంతబాబులపై మండిపడింది. ఇప్పుడు అవే విమర్శలు జనసేనపై వినిపిస్తున్నాయి. ప్రజల్లో నమ్మకాన్ని నిలబెట్టుకోవాలంటే నేతలు ప్రవర్తన హుందాగా ఉండాలి. కానీ… ప్రస్తుత పరిణామాలతో జనసేన ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకి మేలుచేసే విధంగా వ్యవహరించాలి కానీ ఇప్పుడు తమ నేతల వ్యక్తిగత వ్యవహారాలు సెట్ చేసుకోవడంలోనే గడిపే పరిస్థితి ఆ పార్టీకి వచ్చిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే… భవిష్యత్తులో పార్టీకి డ్యామేజీ తప్పదనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
తాజావార్తలు
-
Prabhas:”దురంధర్” దర్శకుడితో ప్రభాస్ మూవీ… ఆ హీరోలకు దక్కని ఛాన్స్!
-
Wednesday Astrology: బుధవారం దిన ఫలాలు.. ఉద్యోగ, వ్యాపార రంగాలలో మిశ్రమ ఫలితాలు!
-
Delhi: డబుల్ ధమాకా.. 12 ఏళ్ల మోడీ పాలన పూర్తి.! కేంద్ర క్యాబినెట్, ఎన్డీఏ కీలక భేటీలు.!
-
E85 Flex Fuel Vehicles: చౌకైన E85 పెట్రోల్ తో నడిచే వాహనాలు.. భారత్లో ఏవి కొనవచ్చు? కార్లు & బైకులు పూర్తి జాబితా!
-
Spirituality: ప్రతి ఆలయంలో గంట ఎందుకు ఉంటుంది? అసలు రహస్యం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
ట్రెండింగ్
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?