Vikarabad SP: తండ్రి దొంగ.. కొడుకు గజదొంగ.. ఇద్దరిపై 105 కేసులు!
- ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు
- ఇద్దరు దొంగలు తండ్రి కొడుకులు
- ఇప్పటికే వారిపై నాలుగు రాష్ట్రాల్లో 105 కేసులు
- ఏపీలోని గుంతకల్ కు చెందిన వారిగా గుర్తింపు
- గతంలో పరిగిలో చోరీ
- పుణేలో విరిని పట్టుకుని కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు. వీరిని పట్టుకోవడంలో వికారాబాద్ పోలీసులు విజయం సాధించారు. అసలు విషయం ఏమిటంటే.. వికారాబాద్ పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు దొంగల పైన 105 కేసులు ఉన్నాయని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్పీ సమాచారం మేరకు.. తండ్రి కొడుకు ఇద్దరు దొంగలే. వీళ్లను షికారి గ్యాంగ్ దొంగలు అంటారు. వీళ్ళ ఇద్దరిదీ ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్. ఇద్దరు దొంగల పైన ఇప్పటికే రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఇద్దరు దొంగలను పూణేలో పట్టుకున్నారు.. వికారాబాద్ పోలీసులు. ఇద్దరి నుంచి ఏడుతులలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడులోని ఈ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. 30/6/2024 రోజున పరిగి పట్టణంలోని ఐదు ఇళ్లలో ఈ షికారి గ్యాంగ్ చోరీ చేసింది. వీళ్లు దొంగతనం చేయడానికి ప్రతి సారి ఒక కొత్త వ్యక్తిని తమ వెంట తీసుకోస్తారు.
READ MORE: Bulldozer action: ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
Also Read
- Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
- Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
- OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
- UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ఈ షికారి గ్యాంగ్ రైలు, బస్సు మార్గంలో వచ్చి తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. పగలు రక్కి నిర్వహిస్తారు.. రాత్రి చోరీ చేస్తారు. ఏ వన్ పెద్ద సర్దార్ (రాజు ) తండ్రి. ఏ టూ మద్దిలేటి మధవ కొడుకు. ఏ వన్ తండ్రి పైన 70 కు పైగా దొంగతనం కేసులు అదేవిధంగా కొడుకు మాధవ పైన 42 కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా సిసిటి ఎస్ఎస్ పోలీసులు ఈరోజు తండ్రి, కొడుకు ను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేదించడంలో ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ రివార్డు ఇవ్వడం జరిగింది.
తాజావార్తలు
-
Essential Food Items Price Hike: సామాన్యుడి జేబుకు చిల్లు.. పప్పు నుంచి నూనె వరకు 15 నిత్యావసర వస్తువులు ఖరీదు..
-
Football Player Died: తీవ్ర విషాదం.. ఫుట్బాల్ మ్యాచ్పై పడిన పిడుగు.. 24 ఏళ్ల ఆటగాడు మృతి..
-
OTR: ఆ మాజీ మంత్రి టీడీపీ అధిష్టానం పై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారా?
-
OTR: తెలంగాణలో అధికార పార్టీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షం కొత్త రూట్ ఎంచుకుందా..?
-
UP Elections: అయోధ్య అభ్యర్థిని ప్రకటించిన సమాజ్వాదీ పార్టీ.. ఎవరంటే..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్లో లాంచ్కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్లో లాంచ్..!