Vikarabad SP: తండ్రి దొంగ.. కొడుకు గజదొంగ.. ఇద్దరిపై 105 కేసులు!
- ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను పట్టుకున్న వికారాబాద్ పోలీసులు
- ఇద్దరు దొంగలు తండ్రి కొడుకులు
- ఇప్పటికే వారిపై నాలుగు రాష్ట్రాల్లో 105 కేసులు
- ఏపీలోని గుంతకల్ కు చెందిన వారిగా గుర్తింపు
- గతంలో పరిగిలో చోరీ
- పుణేలో విరిని పట్టుకుని కేసును ఛేదించిన పోలీసులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తండ్రి కొడుకుకు ఆదర్శంగా ఉండాలి. తన కుమారుడు సమాజంలో తనకంటు ఓ మంచి పేరు తీసుకురావాలని తండ్రి కలలు కంటాడు. కానీ.. ఇక్కడ తండ్రి దొంగ అయితే.. తన కొడుకు గజదొంగగా మారాలని ఆశించాడు. తండ్రిపై ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో 70 కు పైగా కేసులు ఉంటే.. అతితక్కువ వయసులో పుత్రుడు మాత్రం 42 కేసులను క్రాస్ చేశాడు. వీరిని పట్టుకోవడంలో వికారాబాద్ పోలీసులు విజయం సాధించారు. అసలు విషయం ఏమిటంటే.. వికారాబాద్ పోలీసులు ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను పట్టుకున్నారు. ఇద్దరు దొంగల పైన 105 కేసులు ఉన్నాయని వికారాబాద్ ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. ఎస్పీ సమాచారం మేరకు.. తండ్రి కొడుకు ఇద్దరు దొంగలే. వీళ్లను షికారి గ్యాంగ్ దొంగలు అంటారు. వీళ్ళ ఇద్దరిదీ ఆంధ్రప్రదేశ్ లోని గుంతకల్. ఇద్దరు దొంగల పైన ఇప్పటికే రౌడీషీట్ ఓపెన్ చేశారు. ఇద్దరు దొంగలను పూణేలో పట్టుకున్నారు.. వికారాబాద్ పోలీసులు. ఇద్దరి నుంచి ఏడుతులలో బంగారం స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక మహారాష్ట్ర, తమిళనాడులోని ఈ ఇద్దరిపై కేసులు ఉన్నాయి. 30/6/2024 రోజున పరిగి పట్టణంలోని ఐదు ఇళ్లలో ఈ షికారి గ్యాంగ్ చోరీ చేసింది. వీళ్లు దొంగతనం చేయడానికి ప్రతి సారి ఒక కొత్త వ్యక్తిని తమ వెంట తీసుకోస్తారు.
READ MORE: Bulldozer action: ఉదయ్పూర్లో మత ఘర్షణలకు కారణమైన నిందితుడి ఇళ్లు కూల్చివేత..
Also Read
- Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
- IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
- Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
- Yogi Adityanath: ‘‘దోషుల్ని వదిలే ప్రసక్తే లేదు’’.. రామ మందిర విరాళాల చోరీపై యోగి వార్నింగ్..
ఈ షికారి గ్యాంగ్ రైలు, బస్సు మార్గంలో వచ్చి తాళాలు ఉన్న ఇళ్లను టార్గెట్ చేస్తారు. పగలు రక్కి నిర్వహిస్తారు.. రాత్రి చోరీ చేస్తారు. ఏ వన్ పెద్ద సర్దార్ (రాజు ) తండ్రి. ఏ టూ మద్దిలేటి మధవ కొడుకు. ఏ వన్ తండ్రి పైన 70 కు పైగా దొంగతనం కేసులు అదేవిధంగా కొడుకు మాధవ పైన 42 కు పైగా దొంగతనం కేసులు ఉన్నట్టు జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి తెలిపారు. వికారాబాద్ జిల్లా సిసిటి ఎస్ఎస్ పోలీసులు ఈరోజు తండ్రి, కొడుకు ను మీడియా సమావేశంలో ప్రవేశపెట్టారు. మీడియా సమావేశంలో వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణరెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ కేసును చేదించడంలో ఉన్న పోలీస్ అధికారులకు జిల్లా ఎస్పీ రివార్డు ఇవ్వడం జరిగింది.
తాజావార్తలు
-
Laundry Tips: వర్షాకాలంలో బట్టలు వాసన వస్తున్నాయా? సింపుల్గా ఇలా చేసేయండి!
-
Smartphone Restart Benefits: స్మార్ట్ఫోన్ను రీస్టార్ట్ చేయాలా?.. టెక్ నిపుణులు చెబుతున్న సీక్రెట్స్..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
IND Vs IRE: వైభవ్ సూర్యవంశీకి బిగ్షాక్.. తుది జట్టులో దక్కని స్థానం.. కారణం ఇదే..
-
Prashant Kishor: తొలిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిశోర్.. పోటీ ఎక్కడ్నుంచంటే..!
ట్రెండింగ్
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?