Vijaysai Reddy:చంద్రబాబు ముసలి నక్క..లోకేష్ గుంట నక్క
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టీడీపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఎంపీ విజయసాయిరెడ్డి. భవానీపురంలో జిల్లా పార్టీ కార్యాలయం ప్రారంభించటం సంతోషంగా ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా వైసీపీ పార్టీ కార్యాలయాన్ని భవానీ పురంలో ప్రారంభించిన ఎంపీ విజయసాయిరెడ్డి. మంత్రులు తానేటి వనిత, అంబటి రాంబాబు, జోగి రమేష్, జిల్లా పార్టీ అధ్యక్షుడు వెల్లంపల్లి, ఎమ్మెల్యేలు, నేతలు హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో జిల్లాలో ఏడు స్థానాలు గెలిచి సీఎంకి బహుమతిగా ఇస్తామన్నారు వెల్లంపల్లి. 26 జిల్లాల్లోనూ పార్టీ సొంత కార్యాలయాలు నిర్మించుకుంటాం. ఏడాది గడువులో ఈ కార్యక్రమం పూర్తి అవుతుంది. పార్టీ కార్యాలయం నా దృష్టిలో దేవాలయం లాంటిది. ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి ఇదొక వేదిక అన్నారు విజయసాయి.
టీడీపీ పార్టీ అధ్యక్షుడిని అసభ్య పదజాలంతో మాట్లాడటం ఈ మధ్య ప్రారంభమైంది. లోకేష్ పుట్టుకతోనే డిఫాల్ట్ మ్యానుఫ్యాక్చర్డ్. ఇద్దరూ మిస్ ఇన్ఫెక్షన్ క్యాంపైన్ ప్రారంభించారు. ముసలి నాయుడు, పప్పు నాయుడు ..ఇద్దరూ ఈ వైఖరి మానుకోవాలి. నేనూ ఇంటర్మీడియట్ లో ఫెయిల్ అయ్యాను. అప్పుడు అనారోగ్యం, ఇతర కారణాలతో ఫెయిల్ అయ్యాను. ప్రభుత్వానికి విద్యార్థులు ఫెయిల్ అవటానికి సంబంధం ఉండదన్నారు.
Also Read
- Sai Krishna Lockup Dea*th Case : సాయికృష్ణ మృతి కేసు.. ఏపీ పోలీసులపై NHRC ఆగ్రహం.. నోటీసులు జారీ
- Tobacco Farmers: పొగాకు రైతులకు ప్రభుత్వం అండ.. కిలో రూ.200 కంటే తక్కువకు కొనొద్దు..
- IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
- Saikrishna Lockup Death: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సిట్ దూకుడు.. మరో ఇద్దరు పోలీసుల కోసం గాలింపు!
కుసంస్కారం ఉన్న వాళ్ళను తెచ్చి తిట్టించటం కాదు. మీరు ఒకటి చెబితే… మేం పది చెబుతాం. ప్రజాస్వామ్య బద్దంగా విమర్శలు చేయవచ్చు. నిన్నటి జూమ్ ఆరంభం మాత్రమే. పప్పు నాయుడు సవాలును స్వీకరిస్తున్నాం. చంద్రబాబు అయినా రావచ్చు…మా నాయకులు ఎవరైనా చర్చకు సిద్దమే. ఎక్కడైనా, ఎప్పుడైనా… చర్చకు మేం సిద్ధం అన్నారు విజయసాయి. నిన్న లోకేష్ పారిపోయాడు. ఆత్మకూరులో టీడీపీ ఎందుకు పోటీ చేయటం లేదు? పోటీ చేసి ఆ ఫలితాలనే రెఫరెండంగా తీసుకోవాలి. టీడీపీ నాయకులు నోటికి తోచినట్లు మాట్లాడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విజయసాయి హెచ్చరించారు.
రీజనల్ కోఆర్డినేటర్ మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ.. విజయసాయిరెడ్డి చేతుల పై ఆఫీసు ప్రారంభం చాలా సంతోషంగా ఉంది.పార్టీ నిర్మాణం కోసం ఆఫీసు ఉండాలని నిర్ణయించారు. ఆ వెంటనే జిల్లా అధ్యక్షుడు వెంటనే ఏర్పాట్లు చేశారు. ముఖ్యమంత్రి ఆదేశించే ప్రతి కార్యక్రమాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. జిల్లా స్థాయి నాయకులు అందరూ పార్టీ ఆఫీసులో అందుబాటులో ఉంటారన్నారు. పార్టీని బలోపేతం చేయటానికి శాయశక్తులా కృషి చేస్తాం. అందరినీ కలుపుకుని సమన్వయంతో పని చేస్తాం అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా వెల్లంపల్లి బాధ్యత లు తీసుకున్నారు. ఈ ఏడు నియోజకవర్గాల్లో గెలుపు జిల్లా ఇంఛార్జ్ మంత్రి గా నేను కృషి చేస్తానన్నారు హోంమంత్రి తానేటి వనిత.
President : రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పార్టీకి ఎన్ని ఓట్లున్నాయి? కౌన్ బనేగా ప్రెసిడెంట్?
తాజావార్తలు
-
Ireland: ఐర్లాండ్ చేతిలో ఓడిన 8వ దేశంగా భారత్.. ఇక మిగిలింది ఆ మూడే..
-
Off The Record: కందుకూరు టీడీపీలో సిట్టింగ్ వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
-
Shreyas Iyer: ఐర్లాండ్ చేతిలో ఓటమికి కారణం ఇదే.. నిజాన్ని అంగీకరించిన శ్రేయాస్ అయ్యర్..
-
Pulse Polio: 28న పల్స్ పోలియోకు తెలంగాణ రెడీ.!
-
India Lose: ప్రపంచ ఛాంపియన్ల పరువు ఐర్లాండ్ వీధుల్లో పారేశారు.. శ్రేయాస్ అయ్యర్పై ఆగ్రహం..
ట్రెండింగ్
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!