Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసు.. నలుగురు నిందితులు అరెస్ట్
Kidney Rocket Case: విజయవాడ కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ వ్యవహారంలో మొత్తం నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కార్తీక్, నాగమణి, తమ్మిశెట్టి వెంకయ్య, కనక మహాలక్ష్మీ అనే నలుగురిని అదుపులోకి తీసుకున్నట్లు వెస్ట్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న మహిళలే టార్గెట్గా ఈ ముఠా కిడ్నీ రాకెట్ ను నడిపిందని వెల్లడించారు. విజయవాడలో చోటు చేసుకున్న రెండు కేసులో వీరు నిందితులుగా ఉన్నారని ఏసీపీ తెలిపారు.ఈ క్రమంలోనే ఒక్కో కేసులో రూ.25 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు డీల్ కుదుర్చుకుని కిడ్నీ విక్రయాలు సాగిస్తున్నట్లు తెలిపారు.
Also Read: Andhrapradesh: అడవుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశే ఆదర్శం.. అటవీ సంరక్షణ బిల్లుపై విజయసాయి రెడ్డి
Also Read
- IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
- Donald Trump: పాకిస్తాన్ మధ్యవర్తిత్వం విఫలం.. ట్రంప్ సంచలన నిర్ణయం..
- Barrier Free Tolling: భారత్లో కొత్త రకం టోల్ విధానం.. వాహనాలు ఆపాల్సిన అవసరం లేకుండా...
- Off The Record : కాకినాడలో 'పేకాట' జోరు.. వెనుక ఉన్నది ఎమ్మెల్యేల అనుచరులేనా?
కిడ్నీ మార్పిడి రాకెట్లో కీలకమైన కార్తీక్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిడ్నీ మార్పిడిలో మొత్తం 29 లక్షలకు డీల్ సెట్ చేశాడు. కిడ్నీ డోనర్కు రూ.7.50 లక్షలు, ఇతరులకు రూ.21.50 లక్షలు ఇచ్చేలా.. కిడ్నీ రిసీవర్ దీపక్ రెడ్డితో మీడియేటర్ కార్తీక్ డీల్ కుదుర్చుకున్నాడు. గతంలో బాబురావు అనే మీడియేటర్ వద్ద కార్తీక్ అసిస్టెంట్గా చేశాడు. కిడ్నీని దీపక్కు ఇచ్చేందుకు కార్తీక్ ఒప్పందం చేసుకున్నారని పోలీసులు గుర్తించారు. కార్తిక్ సహా మరో ముగ్గురిని పోలీసులు ఇవాళ అరెస్ట్ చేశారు.
Also Read: AP High Court: అమరావతి అసైన్డ్ భూముల కేసు.. కీలక వాదనలు వినిపించిన సీఐడీ
విజయవాడ బాలభాస్కర్ నగర్కు చెందిన చిన్న అనే మహిళ తూర్పు గోదావరి జిల్లాకు చెందిన నల్లమిల్లి దీపక్ రెడ్డిని తన పెద్దనాన్న కొడుకుగా చూపి కిడ్నీ దానానికి అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. ఈ పత్రాలు నకిలీవిగా తేలడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు తహసీల్దార్. గుంటూరు జిల్లాకు చెందిన మస్తాన్బీ కిడ్నీ దానం కోసం అనుమతివ్వాలని ఈ ఏడాది జూలై 24న విజయవాడ పశ్చిమ తహసీల్దార్కు దరఖాస్తు చేసుకున్నారు. రామవరప్పాడులో నివాసం ఉండే సత్యవతికి కిడ్నీ దానం చేసేందుకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ మేరకు ఆధార్ కార్డులో పేరును కూడా మార్చుకున్నట్టుగా తమ దర్యాప్తులో వెల్లడైందని తహసీల్దార్ చెప్పారు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కిడ్నీ రాకెట్పై పోలీసులు విచారణ ప్రారంభించారు. ఈ రెండు ఘటనల్లో కార్తీక్ కీలకంగా వ్యవహరించినట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహరంలో కీలక సూత్రధారి బాబూరావు పరారీలో ఉన్నాడు. గతంలో బాబురావు వద్దే కార్తీక్ పనిచేసినట్టుగా పోలీసులు గుర్తించారు. ఇదిలా ఉంటే.. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో లక్ష్మి గతంలో తన కిడ్నీని విక్రయించినట్టుగా పోలీసుల విచారణలో తేలింది. కిడ్నీ విక్రయించిన తర్వాత లక్ష్మి కిడ్నీ బ్రోకర్గా మారిందని పోలీసులు పేర్కొంటున్నారు.
తాజావార్తలు
-
Aari Arjunan :‘GS’తో తెలుగులోకి బిగ్ బాస్ విన్నర్ ఆరి అర్జునన్!
-
IAS Transfers: తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారుల బదిలీలు.. జిల్లాలకు కొత్త కలెక్టర్లు వచ్చేశారు..
-
Suhas: సుహాస్, సూరి ‘మండాడి’ షూటింగ్ పూర్తి!
-
Off The Record : నెల్లిమర్ల ఎమ్మెల్యే పీఏపై తీవ్ర ఆరోపణలు
-
TVS Raider 125 2026: కొత్త TVS రైడర్ 125 బైక్.. అదరహో అనిపించే ఫీచర్లతో.. లక్ష రూపాయల కన్నా తక్కువ ధరకే!
ట్రెండింగ్
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!
-
165Hz రిఫ్రెష్ రేట్, 12.3 అంగుళాల డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో Honor MagicPad 3 Pro లాంచ్.!
-
వేసవికాలంలో చల్లటి కబురు.. 22,000 భారీ తగ్గింపుతో Lloyd Air Conditioner.. త్వరపడండి.!
-
రూ. 9,999కే 6.88 అంగుళాల పెద్ద స్క్రీన్, 5200mAh బ్యాటరీ.. POCO C81 సిరీస్ లాంచ్..!