Salon Shop: సెలూన్ షాపు నిర్వాహకుడికి రూ.72 లక్షల జీఎస్టీ.. అంత సంపాదన ఉందా..?
- బార్బర్ షాపు నిర్వాహకుడికి అధికారుల షాక్..
- రూ.72 లక్షల జీఎస్టీ కట్టాలని నోటీసులు..
- బిత్తర పోయిన నిర్వాహకుడు..
విజయవాడలో ఒక సామాన్య సెలూన్ నిర్వాహకుడికి ఎదురైన వింత అనుభవం.. ప్రస్తుతం ఆధార్, పాన్ కార్డుల భద్రతపై పెను ఆందోళనను రేకెత్తిస్తోంది. కేవలం కత్తెర, దువ్వెనతో జీవనం సాగించే వ్యక్తికి కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వ్యాపారంతో ముడిపెట్టి నోటీసులు పంపడం అనేది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..
అమాయకుడిపై అక్షరాలా రూ.72 లక్షల భారం
విజయవాడ పంజా సెంటర్ సమీపంలో గత నాలుగు దశాబ్దాలుగా సెలూన్ షాపు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న పైడాడ శ్రీనివాసరావు అనే వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. తన జీవితంలో ఎన్నడూ చూడని రీతిలో సుమారు రూ.72 లక్షల జీఎస్టీ (GST) బకాయి చెల్లించాలని జిఎస్టీ అధికారుల నుంచి ఆయనకు నోటీసులు అందాయి. విశాఖపట్నం కేంద్రంగా భారీ ఎత్తున ‘స్క్రాప్ ఐరన్’ (పాత ఇనుము) వ్యాపారం నిర్వహించినట్లు, దానికి సంబంధించిన పన్నులు చెల్లించలేదని అధికారులు ఆ నోటీసుల్లో పేర్కొన్నారు.
Also Read
- Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
- Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
- Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
- Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
బ్యాంక్ ఖాతా నిలిపివేత..
తనకు తెలియకుండానే తన పేరు మీద ఇంత పెద్ద మోసం జరుగుతోందని శ్రీనివాసరావుకు మొదట తెలియలేదు. అయితే.. ఇటీవల ఆయన తన బ్యాంక్ ఖాతా నుంచి నగదు తీసుకోవడానికి వెళ్ళినప్పుడు, ఖాతా ‘హోల్డ్’లో ఉన్నట్లు బ్యాంక్ సిబ్బంది తెలిపారు. జిఎస్టీ అధికారుల ఆదేశాల మేరకే ఈ చర్య తీసుకున్నామని వారు స్పష్టం చేశారు. దీంతో కంగుతిన్న ఆయన, తన ఆవేదనను అధికారుల వద్ద మొరపెట్టుకున్నారు. “చిన్నప్పటి నుంచి సెలూన్ షాపులో కష్టపడి బతుకుతున్నాను.. నాకు ఇనుప వ్యాపారంతో సంబంధం లేదు” అని చెప్పినా అధికారులు మాత్రం విశాఖ వెళ్లి వివరణ ఇవ్వాలని సూచించారు.
Also Read:HPV వైరస్ అలర్ట్.. చిన్న వయస్సులోనే టీకా తీసుకోకపోతే క్యాన్సర్ ముప్పు.!
డాక్యుమెంట్లతో కేటుగాళ్ల మాయాజాలం..
ఈ ఉదంతం వెనుక పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు స్థానికులు, బాధితుడు అనుమానిస్తున్నారు. శ్రీనివాసరావుకు తెలియకుండానే ఆయన ఆధార్, పాన్ కార్డు వంటి వ్యక్తిగత వివరాలను సేకరించిన గుర్తుతెలియని వ్యక్తులు, వాటితో నకిలీ కంపెనీని సృష్టించి ఉంటారని భావిస్తున్నారు. ఇలాంటి నకిలీ లావాదేవీల వల్ల ఆయన ఇప్పుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేవలం ఆర్థిక పరమైన ఇబ్బందులే కాకుండా.. ఈ వివాదం కారణంగా ఆయనకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు కూడా ప్రస్తుతానికి నిలిచిపోయాయి.
ప్రస్తుతం శ్రీనివాసరావు తన నిజాయితీని నిరూపించుకోవడానికి అధికారుల కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. డిజిటల్ యుగంలో వ్యక్తిగత పత్రాలు ఎంత సులభంగా దుర్వినియోగం అవుతున్నాయో చెప్పడానికి ఈ సంఘటనే నిదర్శనం. అధికారులు లోతైన విచారణ జరిపి.. అసలు నిందితులను పట్టుకోవాలని, అమాయకుడైన శ్రీనివాసరావుకు ఈ పన్నుల భారం నుంచి విముక్తి కలిగించాలని బాధితుడి కుటుంబ సభ్యులు కోరుతున్నారు.
తాజావార్తలు
-
Manish Sisodia: కోర్టులో మీరుంటే విచారణకు రాను.. జస్టిస్ స్వర్ణకాంతకు మనీష్ సిసోడియా లేఖ
-
Google Data Center: విశాఖలో గూగుల్ డేటా సెంటర్కు శంకుస్థాపన
-
Icon Star : ఐకాన్ స్టార్ కొత్త రూల్.. ఫ్యాన్స్కు పండగే!
-
Nashik TCS Case: నిదా ఖాన్ బెయిల్ పిటిషన్పై కోర్టులో ముగిసిన కీలక వాదనలు.. ఆసక్తికరంగా మారిన తీర్పు..!
-
Mahesh Babu: రాజమౌళి తర్వాత మహేష్ బాబు ప్లాన్ మామూలుగా లేదుగా!
ట్రెండింగ్
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో
-
Malware Alert : ఆండ్రాయిడ్ యూజర్లకు కేంద్రం వార్నింగ్.. కొత్త మాల్వేర్ వచ్చేసింది.. జాగ్రత్త..!
-
7,200mAh బ్యాటరీ, 8.39mm మందంతో Vivo Y6 5G లాంచ్.. ఫీచర్స్, ధర ఇలా.!