Project K : హాలీవుడ్ ఫార్మాట్ ను ఫాలో అవుతున్న వైజయంతి మూవీస్…?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ కె. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.ఈ సినిమా మెజారిటీ భాగం గ్రాఫిక్స్ తోనే ఉండబోతోందని సమాచారం.. నాగ్ అశ్విన్ అయితే ఈ చిత్రం కోసం సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నట్లు సమాచారం.అందుకే షూటింగ్ మొత్తం స్టూడియోలలో భారీ సెట్స్ వేసి మరీ చేస్తున్నారని సమాచారం.మెజారిటీ షూటింగ్ అంతా రామోజీ ఫిల్మ్ సిటీలోనే జరుగుతోందని సమాచారం.. చిత్రంలో అమితాబచ్చన్, దీపికా పదుకునే మరియు దిశాపటాని లాంటి బిగ్ స్టార్ క్యాస్టింగ్ నటిస్తున్నారు.. ఈ సినిమాలోని విలన్ పాత్ర కోసం కమల్ హాసన్ ని సంప్రదిస్తున్నారనే ప్రచారం కూడా జరుగుతుంది.. భారీగా పారితోషకం ఇచ్చి మరీ ఈ మూవీలో తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం.
ఇక ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు అందరూ కూడా అనుకుంటున్నారు..అధికారికంగా ఈ సినిమాను నిర్మిస్తున్నట్లు ఇప్పటికే వైజయంతి మూవీస్ ప్రకటించింది.సుమారు 500 నుంచి 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సినిమా కావడంతో అశ్వనీదత్ పెద్ద రిస్క్ చేస్తున్నాడని అందరూ కూడా భావిస్తున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ నిర్మాణంలో ఏకంగా 6 మంది భాగస్వాములుగా ఉన్నారని సమాచారం.
Also Read
- Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
- Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
- Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్లో 50% ఉద్యోగాల కోత
- WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ఏషియన్ ఫిలిమ్స్ సునీల్ నారంగ్ తో పాటు మరికొంత మంది ప్రాజెక్ట్ కె నిర్మాణ భాగస్వాములుగా ఉన్నారని సమాచారం.ముఖ్యంగా డిస్టిబ్యూటర్స్ మరియు ఎగ్జిబిటర్స్ ఈ సినిమా నిర్మాణంలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది.. అయితే అఫీషియల్ గా వైజయంతీ బ్యానర్ అయిన కూడా నిర్మాణ భాగస్వాములుగా వారి పేర్లు ఉంటాయని సమాచారం.హాలీవుడ్ సినిమాలు కూడా ఎక్కువగా మల్టీపుల్ ప్రొడక్షన్ హౌస్ లు అన్నీ కలిసి సినిమాలను నిర్మిస్తూ ఉంటాయి. అలా నిర్మించడం వలన బడ్జెట్ షేరింగ్ జరిగి ఒకరి మీదనే సినిమా భారం అంతా పడకుండా ఉంటుంది. ఎప్పటి నుంచో హాలీవుడ్ మూవీస్ ఈ ఫార్మాట్ ని కొనసాగిస్తుంది.. తెలుగులో కూడా ఈ ట్రెండ్ మొదలైందని సమాచారం.అయితే చిన్న సినిమాలకు కూడా రెండు, మూడు ప్రొడక్షన్ హౌస్ లు కలిసి పనిచేస్తున్నట్లు సమాచారం.. అయితే మొదటిసారి ఓ పాన్ వరల్డ్ సినిమా కోసం ఆరుగురు ప్రొడ్యూసర్ లు కలిసి పెట్టుబడులు పెట్టబోతున్నట్లు సమాచారం. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వార్త నిజమో కాదో తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!