Ranji Trophy 2024: మధ్యప్రదేశ్పై ఉత్కంఠ విజయం.. ఫైనల్కు దూసుకెళ్లిన విదర్భ!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vidarbha set final with Mumbai in Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ 2023-24 సీజన్లో విదర్భ జట్టు ఫైనల్కు దూసుకెళ్లింది. చివరి రోజు వరకుఉత్కంఠగా సాగిన సెమీస్లో మధ్యప్రదేశ్ను ఓడించిన విదర్భ.. మూడోసారి రంజీ ట్రోఫీ ఫైనల్ పోరుకు అర్హత సాధించింది. ఇక ఫైనల్లో ముంబైతో విదర్భ అమీతుమీ తేల్చుకోనుంది. మరో సెమీస్ మ్యాచ్లో తమిళనాడుపై ముంబై గెలిచిన విషయం తెలిసిందే. రికార్డు స్థాయిలో ముంబై 48వ సారి రంజీ ట్రోఫీ ఫైనల్లో అడుగుపెట్టింది. మార్చి 10న ముంబై, విదర్భ మధ్య ఫైనల్ మ్యాచ్ ఆరంభం కానుంది.
శనివారం మొదలైన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన విదర్భ తొలి ఇన్నింగ్స్లో 170 పరుగులకు ఆలౌట్ అయింది. కరుణ్ నాయర్ (63) హాఫ్ సెంచరీతో రాణించాడు. మధ్యప్రదేశ్ బౌలర్ అవేశ్ ఖాన్ 4 వికెట్స్ పడగొట్టాడు. ఆపై తొలి ఇన్నింగ్స్లో మధ్యప్రదేశ్ 252 పరుగులు చేసింది. వికెట్ కీపర్ హిమాన్షు మంత్రి సెంచరీ (126) బాదాడు. 82 పరుగుల లోటుతో రెండో ఇన్నింగ్స్ ఆరంబించిన విదర్భ.. 402 పరుగులు చేసింది. యశ్ రాథోడ్ సెంచరీ (141) చేయగా.. అక్షయ్ వాడ్కర్ అర్ధ శతకం (77) బాదాడు. దాంతో మధ్యప్రదేశ్కు 321 పరుగుల లక్ష్యంను విదర్భ విధించింది.
Also Read
మంగళవారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్ రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు కోల్పోయి 228 పరుగులు చేసింది. చివరి రోజు మధ్యప్రదేశ్ విజయానికి 93 పరుగులు అవసరం కాగా.. విదర్భ గెలుపుకు నాలుగు వికెట్లు అవ్సరం అయ్యాయి. ఓవర్నైట్ స్కోరు 228/6 తో బుధవారం ఐదో రోజు ఆటను మొదలుపెట్టిన మధ్యప్రదేశ్ ఆరంభంలోనే వికెట్స్ కోల్పోయింది. కుమార్ కార్తికేయ (4), అనుభవ్ అగర్వాల్(6) స్వల్ప వ్యవధిలో పెవిలియన్ చేరారు. ఆవేశ్ ఖాన్తో కలిసి సారాంశ్ జైన్ జట్టును ఆదుకునే ప్రయత్నం చేశాడు. అయితే సారాంశ్ 25 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. అనంతరం ఖెజ్రోలియా (11) కూడా బౌల్డ్ అవడంతో మధ్యప్రదేశ్ ఓడిపోయింది.
తాజావార్తలు
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
-
CM Revanth Reddy vs KTR : సీఎం రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య సవాళ్లు.. మాటల తూటాలు.!
-
CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
-
Whisky Business: విస్కీ కిక్కు మామూలుగా లేదు.. మూడు నెలల్లోనే రూ.391 కోట్ల లాభం!
-
Shikhar Dhawan: కాక్రోచ్ ఉద్యమంపై శిఖర్ ధావన్ పోస్ట్.. సోషల్ మీడియాలో ట్రోలింగ్..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?