Huge Investment: గుజరాత్ లో డబ్బుల సునామీ.. 40వేల ప్రాజెక్టులు..రూ.26.3లక్షల కోట్ల పెట్టుబడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Huge Investment: వైబ్రంట్ గుజరాత్ సదస్సుకు ఈసారి కూడా కంపెనీల నుంచి విశేష మద్దతు లభించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ సదస్సులో భారతీయ, విదేశీ కంపెనీలు గుజరాత్లో భారీ పెట్టుబడులకు సంబంధించి పలు ప్రకటనలు చేశాయి. అదానీ గ్రూప్, టాటా గ్రూప్, రిలయన్స్ ఇండస్ట్రీస్, డీపీ వరల్డ్ సహా అనేక చిన్న, పెద్ద కంపెనీలు పెట్టుబడి ప్రతిపాదనల కోసం 41299 అవగాహన ఒప్పందాలపై సంతకం చేశాయి. ఈ ప్రాజెక్టుల ద్వారా గుజరాత్లోని కంపెనీలు సుమారు రూ.26.33 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపాయి.
వైబ్రంట్ గుజరాత్ 10వ ఎడిషన్లో గ్రీన్ ఎనర్జీ రంగంలో చాలా పెద్ద ఒప్పందాలు జరిగాయి. 2022లో గుజరాత్లో రూ.18.87 లక్షల కోట్ల విలువైన 57,241 ప్రాజెక్టుల కోసం కంపెనీలు ఎంవోయూలపై సంతకాలు చేశాయి. కోవిడ్ -19 కారణంగా 2021లో జరగాల్సిన సమావేశం రద్దు చేయబడింది. ఈ విధంగా గత రెండు ఎడిషన్లలో మొత్తం 98540 ప్రాజెక్టుల ఎంవోయూలు కుదిరి గుజరాత్కు దాదాపు రూ.45 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
Also Read
Read Also:Bangladesh Cricket Board: బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రాజీనామా
సెమీకండక్టర్లు, ఇ-మొబిలిటీ, గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాలలో పెద్ద సంఖ్యలో పెట్టుబడులు వచ్చాయని వైబ్రంట్ గుజరాత్ అధికారిక ట్విటర్ హ్యాండిల్ పోస్ట్ చేసింది. స్వాతంత్ర్యం వచ్చిన 100వ సంవత్సరంలో అభివృద్ధి చెందిన భారతదేశం (విక్షిత్ భారత్ @ 2047) అనే ప్రధాని నరేంద్ర మోడీ కలలను సాకారం చేయడంలో ఇది ఒక పెద్ద అడుగు. ఈ మూడు రోజుల్లో 3500 మంది విదేశీ ప్రతినిధులు సదస్సులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో 34 భాగస్వామ్య దేశాలు, 16 భాగస్వామ్య సంస్థలు ఉన్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లో పెట్టుబడి అవకాశాలను ప్రదర్శించేందుకు కూడా ఈ సదస్సును ఉపయోగించారు.
ఈ ఏడాది జరిగిన కార్యక్రమంలో లక్ష్య మిట్టల్, తోషిహిరో సుజుకీ, ముఖేష్ అంబానీ, సంజయ్ మెహ్రోత్రా, గౌతమ్ అదానీ, జెఫ్రీ చున్, ఎన్ చంద్రశేఖరన్, సుల్తాన్ అహ్మద్ బిన్ సులాయెమ్, శంకర్ త్రివేది, నిఖిల్ కామత్ తదితరులు పాల్గొన్నారు. ప్రధాని మోడీ బుధవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రానున్న కొద్ది సంవత్సరాల్లో భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి అమిత్ షా కూడా పాల్గొన్నారు.
Read Also:Guntur Kaaram: డే 1 కలెక్షన్స్… రీజనల్ బాక్సాఫీస్ దగ్గర ఆల్ ఇండియా రికార్డ్
తాజావార్తలు
-
Off The Record: మెట్రో కేంద్రంగా కాంగ్రెస్, బీజేపీ పొలిటికల్ వార్..
-
Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
-
Dehradun: నేలరాలిన విద్యాకుసుమం.. 12వ తరగతి టాపర్ ఆత్మహత్య
-
Off The Record: గాంధీ భవన్ను తాకుతున్న పాత-కొత్త గొడవలు..
-
Mumbai: కనిపించని రుతుపవనాల జాడ.. ముంబైలో నీటి సరఫరాపై ఆంక్షలు.. జరిమానా
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Fight: భారత్-శ్రీలంక మ్యాచ్లో గొడవ.. వైభవ్ సూర్యవంశీ ఆగ్రహానికి అసలైన కారణం ఇదే!
-
Mrigashira నక్షత్రంలో పుట్టినవారు ఒక్కచోటు కుదురుగా ఉండరుగా.! అదృష్టం, స్వభావం, కెరీర్ అవకాశాలు ఎలా ఉంటాయంటే.?
-
Tilak Varma: నేను ఎవరికీ నీతులు చెప్పడానికి ఇక్కడ రాలేదు.. తిలక్ వర్మ సంచలన వ్యాఖ్యలు!
-
Vaibhav Sooryavanshi Fight: వైభవ్ సూర్యవంశీపై కఠిన చర్యలు తప్పవా?.. ఐసీసీ నిబంధనలు ఏం చెబుతున్నాయంటే?
-
Lucky Plants : మీ పుట్టిన తేదీ ప్రకారం ఇంట్లో ఏ మొక్క పెంచితే అదృష్టం కలిసొస్తుందో తెలుసా?