Venkaiah Naidu: ‘యోగా ఫర్ మోడీ కాదు.. యోగా ఫర్ బాడీ’.. మాజీ ఉప రాష్ట్రపతి కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Venkaiah Naidu: అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అనాలోచిత యుద్ధమని.. ట్రంప్ ఏమీ మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియదని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. దేశం శాంతి యుతంగా ఉండాలని, ఇరాన్, ఇజ్రాయెల్ లతో భారతదేశం స్నేహంగా ఉందని తెలిపారు. తాజాగా నక్లేస్ రోడ్లో ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ఇరాన్ వాళ్ళు థ్యాంక్ యూ ఇండియా అని అంటున్నారని గర్తు చేశారు. ప్రపంచ మంతా శాంతిగా ఉండాలని కోరారు. మనం శాంతి కాముకులం.. కానీ మన జోలికి ఎవరైనా వస్తే ఆపరేషన్ సింధూర్ లాంటి వాటితో మన ప్రతాపం ఏంటో చూపించామని తెలిపారు. ఖేల్ ఇండియా, ఫిట్ ఇండియాలో భాగంగా నవ్ భారత్ పేరుతో రన్ కార్యక్రమం నిర్వహించడం సంతోషకరమన్నారు. దేశ యువత, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని కోరారు.
READ MORE: Hyderabad: నగరాన్ని కుదిపేస్తున్న కల్తీ ప్రొడక్ట్స్.. రసాయనాలతో చిక్కీలు, నమ్కీన్ తయారీ
Also Read
- Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
- Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
- Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
- ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
“దేశం అభివృద్ధి చెందాలంటే ప్రతి ఒక్కరూ ఫిట్ నెస్ తో ఆరోగ్యంగా ఉండాలి. ముఖ్యంగా దేశ యువత ఫిట్ ఉండాలి. యోగా ఫర్ మోడీ కాదు. యోగా ఫర్ బాడీ. ఆరోగ్య మార్పు మాత్రమే శక్తివంతమైన మార్పు. ఉదయం లేవగానే రోజు ఆసనాలు, శరీర వ్యాయామం చేయాలి.
ఎవరికి ఇష్టం ఉన్నా దాంట్లో ప్రతి ఒక్కరూ నిమగ్నమై ఉండాలి. సాహిత్యామైన, రన్నింగ్ అయినా, యోగా అయిన ప్రతి చేయాలి. అమెరికాలో సైతం భరత నాట్యం , కూచుపూడీ నేర్పిస్తున్నారు. మన దేశ కల్చర్ ఇతర దేశాల్లో పాటిస్తున్నారు. పోషకాలు ఉండే బియ్యాన్ని తినండి. రాగులు, సజ్జలు జొన్నలు ఎక్కువగా తీసుకోవాలి. డ్రగ్స్ మారిన పడొద్దు. యువత డ్రగ్, గంజాయి బారిన పడి అనారోగ్యంతో పాటు వ్యసనంగా మారి పనికి రాకుండా పోతున్నారు. సృజనాత్మకత పెంపొందించుకోవాలి. మొబైల్ వాడండి కానీ వ్యసనంగా వాడొద్దు. పురుషులతో సమానంగా మహిళలను భావించండి. కుటుంబ సభ్యులతో సమయం కేటాయించి గడపండి. ఇంట్లో వృద్ధులతో మాట్లాడి సలహాలు సూచనలు తీసుకోవాలి. భారత్ దేశ కుటుంబ వ్యవస్థ గొప్పది. పెద్దల మాట సద్ది మూట. పాఠాలు చెప్పిన గురువులను మర్చిపోవద్దు. తల్లిదండ్రులను, మాతృభాష, మాతృభూమి, దేశాన్ని గౌరవించండి. ఇంగ్లీష్ భాష కళ్ళద్ధలాంటిది. అమ్మ భాషలో మాట్లాడండి. బ్రో ఏంటీ బ్రోకర్ హా ? అని అడిగా. మంచి భోజనం చేయండి. పీజా, బర్గర్లు తినొద్దు.” అని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు.
తాజావార్తలు
-
Maharashtra: ఐఫోన్ కోసం కొండపై నుంచి దూకలేదు.. మహారాష్ట్ర ఘటనలో వెలుగులోకి షాకింగ్ నిజాలు..
-
Gold and Silver Rate Today: స్వల్పంగా తగ్గిన పసిడి ధర.. భారీగా దిగివచ్చిన వెండి.. నేటి రేట్లు ఇవే
-
Dharma : ఓజి కాంబో రిపీట్.. ఇన్స్టా స్టోరీతో హింట్ ఇచ్చిన శ్రియ శరణ్
-
Allahabad High Court: హిజాబ్ ధరించడం ఇస్లాంలో తప్పనిసరి కాదు..! అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు..
-
Sri Gouri Priya: తమిళ ప్రేక్షకుల మనసు గెలిచిన తెలుగు అమ్మాయి.. శ్రీ గౌరీ ప్రియ సక్సెస్ వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
-
Ragi Poha Roti: రోజూ తినే టిఫిన్లు బోర్ కొట్టాయా? ఇన్స్టెంట్గా ఈ రాగి-పోహా రోటీ ట్రై చేయండి.!
-
8,050mAh బ్యాటరీ, 200MP కెమెరాతో సెప్టెంబర్ 1న రాబోతున్న POCO F9 Ultra..
-
43 నుంచి 85 అంగుళాల వరకు Haier Mini LED M70 Series టీవీలు లాంచ్.. ధరలు ఎంతంటే.?