Arvind Kejriwal : మోడీజీ సిగ్గు పడండి.. ప్రధానిపై కేజ్రీవాల్ నిప్పులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Arvind Kejriwal : ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ ఛీప్ అరవింద్ కేజ్రీవాల్ ప్రధాని మోదీపై నిప్పులు చెరిగారు. మనీష్ సిసోడియా సాధువులాంటివారని, అలాంటి వ్యక్తిని జైల్లో పెడతారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిసోడియా కేవలం ఐదేండ్లలోనే ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలలను చక్కదిద్ది రూపురేఖలు మార్చేశారని, అందుకు బహుమానంగా ఆయనను జైల్లో పెట్టారని ఎద్దేవా చేశారు. సాధువు, మహాత్ముని లాంటి సిసోడియాను జైలుకు పంపారు.. ఇందుకు మీరు సిగ్గు పడాలి అని వ్యాఖ్యానించారు.
Read Also: Priya Prakash Varrior: వింక్ బ్యూటీ.. బ్లాక్ అండ్ వైట్ లో కూడా ధారాళంగా చూపించేస్తోందే
Also Read
- Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్... సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
- Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
- Pakistan: గర్భిణీలు, చిన్న పిల్లల్ని కూడా వదల్లేదు.. POKలో పాక్ ఆర్మీ దుర్మార్గాలు..
- Off The Record: అధికారం కోసం తప్ప పార్టీ కోసం ఎవరూ పని చేయట్లేదా..? ఆ ఉమ్మడి జిల్లా జనసేన కమిటీ మొత్తం రద్దు..
ఆదివారం ఛత్తీస్ గఢ్ రాజధాని రాయ్ పూర్ లో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు. కర్ణాటకలో బీజేపీ ప్రభుత్వం పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ల నుంచి 40 శాతం కమిషన్ వసూలు చేస్తున్నదంటూ వచ్చిన ఆరోపణలను కేజ్రివాల్ ప్రస్తావించారు. సాధువు లాంటి మనీశ్ సిసోడియాను తప్పుడు కేసులో ఇరికించారన్నారు. కాంట్రాక్టర్ల నుంచి కమిషన్ వసూలు చేసిన వాళ్లను మాత్రం వదిలేశారని విమర్శించారు. మాజీ డిప్యూటీ సీఎం సిసోడియా సిబిఐ కస్టడీని ఢిల్లీ కోర్టు మరో రెండు రోజులు పొడిగించడాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. సిసోడియాను మానసికంగా టార్చర్ పెడుతున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ అంతకు ముందు ఆరోపించారు. జైల్లో సిసోడియాకు ఈ వేధింపులు తప్పడంలేదన్నారు.
Read Also: టాలీవుడ్ హీరోయిన్స్ ఒక్కో సినిమాకు ఎన్ని కోట్లు తీసుకుంటున్నారో తెలుసా..?
ఈడీ, సిబిఐ సంస్థలు కేంద్ర ఆదేశాలపై పని చేస్తున్నాయని, గత ఎనిమిదేళ్లలో ఇవి కనీసం మూడు వేలసార్లు దాడులు నిర్వహించాయని ఆయన అన్నారు. 95 శాతం దాడులు విపక్ష నేతలపైనే జరుగుతూ వచ్చాయన్నారు. త్వరలో ఛత్తీస్గఢ్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అక్కడ వివిధ పార్టీల నేతలు తమ క్యాడర్ను అప్రమత్తం చేస్తున్నారు. ఇవాళ ఆప్ చీఫ్ కేజ్రివాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కూడా తమ కార్యకర్తల్లో ఉత్తేజం నింపడం కోసం ఛత్తీస్గఢ్కు వెళ్లారు. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు రాయచూర్లో ఏర్పాటు చేసిన సభలో కేజ్రివాల్ మాట్లాడారు.
తాజావార్తలు
-
Nail Cutting : సూర్యాస్తమయం తర్వాత గోళ్లు కత్తిరించొద్దంటారు.. అసలు కారణం ఇదే.!
-
Homemade Ayurvedic Bath Powder: ఇంట్లో తయారుచేసే ఆయుర్వేద పౌడర్… సబ్బులు, బాడీ వాష్లకు చెక్! చర్మం సహజ కాంతితో మెరిసిపోతుంది..
-
OTR : బండి ఎందుకు దూరమవుతున్నారు.?
-
Off The Record: కుప్పం ఫార్ములా ఏంటి..? వారి మధ్య సమన్వయం లోపించిందా?
-
SIPRI 2026: తొలిసారి అణ్వాయుధాలు మోహరించిన భారత్.. వణుకుతున్న శత్రు దేశాలు! సిప్రి షాకింగ్ నివేదిక..
ట్రెండింగ్
-
Sleep Tips : ప్రశాంతమైన నిద్ర కోసం ఈ 7 అలవాట్లకు దూరంగా ఉండండి
-
Cumin Water Benefits : కడుపు సమస్యలకు నేచురల్ సొల్యూషన్ ఇదే.!
-
India Fertility Rate: యువ భారత్కు వృద్ధాప్య గండం.. పిల్లల్ని కనాలంటేనే ఎందుకు భయపడుతున్నారు?
-
Global Birth Rates: ఐఫోన్ ఎంట్రీతో దారుణంగా పడిపోయిన జననాల రేటు.. అసలు 2007-2024 మధ్య ఏం జరిగిందంటే..?
-
Vivo Y31s 5G లాంచ్.. IP69K+ రేటింగ్, 6500mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్ తో అదిరిపోయే ఫీచర్లు.!