VB Foundation : మహిళలకు అండగా వీబీ ఫౌండేషన్.. కుట్టుమిషన్లు పంపిణీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతోమంది అనాథలను అక్కున చేర్చుకుంటూ.. పేద మహిళలకు భరోసా ఇస్తూ మద్దతుగా నిలుస్తోంది వీబీ ఫౌండేషన్. మాజీ కేంద్రమంత్రి, ప్రస్తుత హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి నిర్వహిస్తున్న ఈ ఫౌండేషన్ మరోసారి మహిళలకు అండగా నిలిచి.. ముషీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లకు చెందిన మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కుట్టుమిషన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు కె.లక్ష్మణ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు రాష్ట్రంలో వివిధ బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలను తీర్చలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం రూ.4500 కోట్లు వడ్డీ లేని రుణాలను మంజూరు చేస్తోందని తెలిపారు.
Also Read : Puvvada Ajay Kumar : ప్రజలు ఆగం కావద్దు.. టక్కు టమరా గోకర్ణ విద్యలు ప్రదర్శిస్తారు…
Also Read
- JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
- WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
- Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
- Arshdeep Singh-Samreen Kaur: హార్ట్, లాక్ ఎమోజీలే చెప్పేస్తున్నాయా..? అర్ష్దీప్-సమ్రీన్ రిలేషన్పై మళ్లీ చర్చ..!
అయితే.. ఆ వడ్డీలేని రుణాలను కేసీఆర్ ప్రభుత్వం అర్హులకు అందజేయడం లేదని ఆయన ఆరోపించారు. ప్రధాని మోడీ పీఎం విశ్వకర్మ పథకం పేరిట ఓబీసీ వర్గాల కోసం ప్రత్యేక పథకాన్ని అమలు చేస్తున్నారని, పేద ప్రజలపై వంట గ్యాస్ భారం తగ్గించేందుకు ధరలను తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఈ సందర్భంగా బండారు విజయలక్ష్మీ మాట్లాడుతూ.. మహిళలు అన్ని రంగాల్లో ముందుండాలని, స్వశక్తితో ఆర్థిక ప్రగతిని సాధించాలని ఆమె వ్యాఖ్యానించారు. స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలను సద్వినియోగం చేసుకొని భవిష్యత్తును బంగారు మయం చేసుకోవాలని బండారు విజయలక్ష్మీ అన్నారు. కార్యక్రమంలో జిల్లా మాజీ అధ్యక్షుడు ఎ.వినయ్కమార్, కార్పొరేటర్లు రచనశ్రీ, సుప్రియ నవీన్ గౌడ్, మహిళామోర్చా కన్వీనర్ మాధవి, నాయకులు రత్నసాయిచంద్, అరుణ్ కుమార్, రవికుమార్, బద్రినారాయణ, ఆర్.నరేష్, మహేందర్ బాబు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Varanasi : ‘వారణాసి’కి నాలుగేళ్లు.. ఇంకా చెక్కుతూనే ఉన్న జక్కన్న
-
Prabhas Fauji: ప్రభాస్ కోసం హైదరాబాద్లో మరో ‘చార్మినార్’.. ‘ఫౌజీ’కి భారీ సెటప్ రెడీ!
-
JIO: ఒక్కసారి రీఛార్జ్ చేస్తే ఏడాదిపాటు నో టెన్షన్.. అన్లిమిటెడ్ కాలింగ్, 912GB డేటా.. OTT, Google Gemini Pro ఫ్రీ..!
-
WhatsApp: వాట్సాప్ యూజర్లకు బిగ్ షాక్.. ఉన్నపళంగా సస్పెండ్ అవుతున్న అకౌంట్లు.. ఎందుకంటే?
-
Gannavaram Bus Accident: గన్నవరం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. డివైడర్పై బోల్తా పడిన ప్రైవేట్ బస్సు!
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఉల్లి-ఆలూ తాజాగా ఉండాలంటే.? ఈ చిన్న జాగ్రత్తలు పాటించండి.!
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్తో ఈజీ సొల్యూషన్!
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!