Varun Gandhi: బాబా సీఎం ఎప్పుడైనా కావచ్చు.. యోగి ఆదిత్యనాథ్ పై వరుణ్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi Setairts On Yogi Adityanath: బీజేపీ నేత వరుణ్ గాంధీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీపైనా, నేతలపైనా ఈ మధ్య సెటర్లు వేస్తు్న్నారు. ట్విటర్ వేదికగా పార్టీకి నష్టం కలిగించే అనేక పోస్టులను ఆయన పెడుతున్నారు. ఇక మరోమారు వరుణ్ గాంధీ అలాంటి పనినే చేశారు. తన నియోజకవర్గమైన పిలిభిత్లో పార్టీ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరణ్ గాంధీ. ఇక ఆ సమావేశంలో సొంతపార్టీపైనే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ సమావేశంలో వరుణ్ మాట్లాడుతూ ఉండగా ఒక సాధువు ఫోన్ రింగ్ అయ్యింది. అప్పుుడు వరణ్ గాంధీ స్పందిస్తూ ఆయనను ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎవరు అడగొద్దు. ఎందుకంటే సాధువులు ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికీ తెలియదు. వారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. అప్పుడు మనకి ఏం జరగుతుందో ఎవరికి తెలుసు అంటూ మాట్లాడారు. ఇప్పుడు వరుణ్ గాంధీ మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా వరుణ్ సొంతపార్టీ, ఆ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Rahul Gandhi: ప్రధాని మోడీ ఆ విషయంలో అబద్దం చెప్పారు
Also Read
- Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
- Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
- Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
- Crispy Raw Potato Paratha Recipe: ఉడికించిన బంగాళదుంపలు అవసరం లేదు.. పచ్చి ఆలూతో నిమిషాల్లో కరకరలాడే పరాఠా తయారీ ఇలా!
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లోని గోరక్ష పీఠాధీశ్వరుడు అనే సంగతి తెలిసిందే. సీఎం అయిన తరువాత కూడా ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలు ధరించే కనిపిస్తారు. సాధువు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాఫియాపై విరుచుకుపడిన యోగి బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి పొందారు. ఇక వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా గెలుపొందారు. చాలా సంవత్సరాల తరువాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత యోగీ ఆదిత్యనాథ్ కే దక్కుతుంది. మూకదాడులు, హిందు ముస్లిం గొడవలు లాంటి రకరకాల విమర్శలు ఎదుర్కున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో రెండోసారి అధికారం సాధించారు.
తాజావార్తలు
-
Pawan Kalyan: జనసేన కీలక సమావేశం.. 25 పార్లమెంట్ కమిటీలతో పవన్ ప్రత్యేక భేటీ
-
Shreyas Iyer: 63 మ్యాచ్ల తర్వాత రీఎంట్రీ.. కెప్టెన్గా తొలి మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ చెత్త రికార్డు..
-
Hero Passion+ Disc: న్యూ లుక్, డిజిటల్ ఫీచర్లతో విడుదలైన హీరో ప్యాషన్ కొత్త మోడల్.. 71KM మైలేజీ
-
Bahubali -3 : బాహుబలి 3.. అసలు సాధ్యమయ్యే పనేనా?
-
Sree Vishnu : శ్రీవిష్ణు బంపర్ ఆఫర్.. ‘దీవాన’కు బై 1 గెట్ 1 ప్రకటించిన హీరో!
ట్రెండింగ్
-
Viral Video: ఛీ.. ఛీ.. ఇంత దారుణంగా ఉన్నారేంట్రా బాబు.. భోజనం చేస్తున్న వారి మధ్యే మూత్ర విసర్జన మహిళ..
-
Kitchen Hacks: ఆమ్లెట్ పెనానికి అంటుకుపోతోందా? అయితే ఇలా చేయండి.!
-
White Furniture : తెల్ల ప్లాస్టిక్ కుర్చీలు కొత్తవాటిలా మెరవాలా.? ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Health Tips : ప్యూరిఫైయర్ ఉందంటే సరిపోదు.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి.!
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్గా ఉంచండి.!