Varun Gandhi: బాబా సీఎం ఎప్పుడైనా కావచ్చు.. యోగి ఆదిత్యనాథ్ పై వరుణ్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi Setairts On Yogi Adityanath: బీజేపీ నేత వరుణ్ గాంధీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీపైనా, నేతలపైనా ఈ మధ్య సెటర్లు వేస్తు్న్నారు. ట్విటర్ వేదికగా పార్టీకి నష్టం కలిగించే అనేక పోస్టులను ఆయన పెడుతున్నారు. ఇక మరోమారు వరుణ్ గాంధీ అలాంటి పనినే చేశారు. తన నియోజకవర్గమైన పిలిభిత్లో పార్టీ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరణ్ గాంధీ. ఇక ఆ సమావేశంలో సొంతపార్టీపైనే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ సమావేశంలో వరుణ్ మాట్లాడుతూ ఉండగా ఒక సాధువు ఫోన్ రింగ్ అయ్యింది. అప్పుుడు వరణ్ గాంధీ స్పందిస్తూ ఆయనను ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎవరు అడగొద్దు. ఎందుకంటే సాధువులు ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికీ తెలియదు. వారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. అప్పుడు మనకి ఏం జరగుతుందో ఎవరికి తెలుసు అంటూ మాట్లాడారు. ఇప్పుడు వరుణ్ గాంధీ మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా వరుణ్ సొంతపార్టీ, ఆ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Rahul Gandhi: ప్రధాని మోడీ ఆ విషయంలో అబద్దం చెప్పారు
Also Read
- Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
- Polavaram Tiger: పోలవరం ఊపిరి పీల్చుకో.. డ్రోన్ కెమెరాలకు చిక్కిన పెద్దపులి!
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లోని గోరక్ష పీఠాధీశ్వరుడు అనే సంగతి తెలిసిందే. సీఎం అయిన తరువాత కూడా ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలు ధరించే కనిపిస్తారు. సాధువు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాఫియాపై విరుచుకుపడిన యోగి బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి పొందారు. ఇక వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా గెలుపొందారు. చాలా సంవత్సరాల తరువాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత యోగీ ఆదిత్యనాథ్ కే దక్కుతుంది. మూకదాడులు, హిందు ముస్లిం గొడవలు లాంటి రకరకాల విమర్శలు ఎదుర్కున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో రెండోసారి అధికారం సాధించారు.
తాజావార్తలు
-
Tilak Varma: టీజీ20 లీగ్ వేలం.. తిలక్ వర్మకు ఊహించని ధర.. ఏ జట్టు సొంతం చేసుకుందో తెలుసా?
-
Shreyas Iyer: కేక్పై ఐసింగ్ లాంటిది.. టీమిండియా కెప్టెన్సీపై తొలిసారి స్పందించిన శ్రేయస్ అయ్యర్!
-
Sriram Krishnan: ట్రంప్ ప్రభుత్వానికి షాక్.. AI విధాన సలహాదారు పదవికి శ్రీరామ్ కృష్ణన్ రాజీనామా
-
Drishyam 3 Hindi Version : ‘దృశ్యం 3’ హిందీ వెర్షన్ లో భారీ మార్పులు… రీజన్ ఇదేనా ?
-
Odisha Engineer: రూ.6 వేల జీతంతో ప్రారంభం.. రూ.2 కోట్ల ఆస్తులతో పట్టుబడ్డ ప్రభుత్వ ఉద్యోగి
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!