Varun Gandhi: బాబా సీఎం ఎప్పుడైనా కావచ్చు.. యోగి ఆదిత్యనాథ్ పై వరుణ్ సెటైర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Varun Gandhi Setairts On Yogi Adityanath: బీజేపీ నేత వరుణ్ గాంధీ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్నారు. సొంత పార్టీపైనా, నేతలపైనా ఈ మధ్య సెటర్లు వేస్తు్న్నారు. ట్విటర్ వేదికగా పార్టీకి నష్టం కలిగించే అనేక పోస్టులను ఆయన పెడుతున్నారు. ఇక మరోమారు వరుణ్ గాంధీ అలాంటి పనినే చేశారు. తన నియోజకవర్గమైన పిలిభిత్లో పార్టీ కార్యకర్తలతో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు వరణ్ గాంధీ. ఇక ఆ సమావేశంలో సొంతపార్టీపైనే ఆయన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆ సమావేశంలో వరుణ్ మాట్లాడుతూ ఉండగా ఒక సాధువు ఫోన్ రింగ్ అయ్యింది. అప్పుుడు వరణ్ గాంధీ స్పందిస్తూ ఆయనను ఫోన్ సైలెంట్ లో పెట్టమని ఎవరు అడగొద్దు. ఎందుకంటే సాధువులు ఎప్పుడు సీఎం అవుతారో ఎవరికీ తెలియదు. వారు ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావచ్చు. అప్పుడు మనకి ఏం జరగుతుందో ఎవరికి తెలుసు అంటూ మాట్లాడారు. ఇప్పుడు వరుణ్ గాంధీ మాట్లాడిన ఈ మాటలు వైరల్ గా మారాయి. ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారంటూ ప్రచారం జరుగుతుంది. గత కొంత కాలంగా వరుణ్ సొంతపార్టీ, ఆ పార్టీ నేతలపైనే విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే.
Also Read: Rahul Gandhi: ప్రధాని మోడీ ఆ విషయంలో అబద్దం చెప్పారు
Also Read
- Gig Workers Strike: "పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి".. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
- Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
- Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
- VD Satheesan: 'సీఎం ఇలా ఏడవకూడదు..' గురువు భార్య వద్ద కాబోయే సీఎం భావోద్వేగం..!
యోగి ఆదిత్యనాథ్ ఉత్తర ప్రదేశ్లోని గోరక్ష పీఠాధీశ్వరుడు అనే సంగతి తెలిసిందే. సీఎం అయిన తరువాత కూడా ఆయన నిరంతరం కాషాయ వస్త్రాలు ధరించే కనిపిస్తారు. సాధువు అయినప్పటికీ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత మాఫియాపై విరుచుకుపడిన యోగి బుల్డోజర్ బాబాగా ప్రసిద్ధి పొందారు. ఇక వరుణ్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఇతర నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. ఇక ఉత్తరప్రదేశ్ లో యోగి ఆదిత్యనాథ్ వరుసగా రెండోసారి సీఎంగా గెలుపొందారు. చాలా సంవత్సరాల తరువాత వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి పదవి చేపట్టి తమ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత యోగీ ఆదిత్యనాథ్ కే దక్కుతుంది. మూకదాడులు, హిందు ముస్లిం గొడవలు లాంటి రకరకాల విమర్శలు ఎదుర్కున్నప్పటికీ యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ లో రెండోసారి అధికారం సాధించారు.
తాజావార్తలు
-
Gig Workers Strike: “పెరిగిన రేట్లకు తగ్గట్టు సర్వీస్ ఛార్జీలు పెంచండి”.. మళ్లీ సమ్మే బాట పట్టిన గిగ్ వర్కర్లు..
-
Messi-Ronaldo: మెస్సీ vs రొనాల్డో.. ఆఖరి వరల్డ్ కప్లో చరిత్ర సృష్టించనున్న ఫుట్బాల్ దిగ్గజాలు
-
Manchu Manoj: మంచు మనోజ్ టీమ్లో మిస్టరీ డెత్.. ‘డేవిడ్ రెడ్డి’ సెట్స్లో అసలేం జరిగింది?
-
Buchi Babu Sana: జాన్వీకి ‘పెద్ది’ ఛాన్స్ వెనుక ఇంత పెద్ద స్టోరీ ఉందా..!
-
Rishabh Pant: ‘మా గెలుపుకు కారణం.. నేను బ్యాటింగ్కు రాకపోవడానికి రీజన్ ఇదే’: రిషబ్ పంత్
ట్రెండింగ్
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!
-
Work From Home: కేంద్రం కంపెనీలకు “వర్క్ ఫ్రమ్ హోమ్” ఆదేశాలు జారీ చేసిందా? క్లారిటీ ఇదిగో..
-
Low Hemoglobin: హిమోగ్లోబిన్, ప్లేట్లెట్స్ తగ్గుతున్నాయా.? అయితే ఈ ఆయుర్వేద ఈ చిట్కాలు పాటించాల్సిందే..