Rahul Gandhi: ప్రధాని మోడీ ఆ విషయంలో అబద్దం చెప్పారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rahul Gandhi Attacks Modi over China’s Map Dispute: చైనా-భారత్ సరిహద్దు వివాదానికి సంబంధించి కాంగ్రెస్ ముఖ్యనేత, ఎంపీ రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీ పై ఫైర్ అయ్యారు. భారతదేశంలో ఇంచు కూడా చైనా కబ్జా చేయలేదంటూ మోడీ అన్నీ అబద్దాలే చెప్పారంటూ ఆయన మండిపడ్డారు. ఈ విషయం లడ్డాఖ్ లో ఉన్న ప్రజలకు కూడా తెలుసునన్నారు. మన భూమిలో మన ప్రజలను కూడా ఆ ప్రాంతంలోకి చైనా అనుమతించడం లేదని, ఆఖరికి వారి పశువులను గడ్డి మేయడానికి కూడా అక్కడికి రానివ్వడం లేదని పేర్కొన్నారు. తాను కొన్ని రోజుల క్రితం లద్దాఖ్ పర్యటనకు వెళ్లినప్పుడు ఈ విషయాన్ని గమనించానని ఆయన తెలిపారు. ఎన్నో ఏళ్ల నుంచి దీనికి సంబంధించి చర్యలు తీసుకోవాలని మోడీని కోరానని, అయిన ఆయన అబద్దాలలో ప్రజలను మోసం చేస్తున్నారని రాహుల్ తప్పుబట్టారు.
Also Read: Karnataka: పెళ్లి భోజనాలు చేసి ఆసుపత్రి పాలైన 150 మంది
Also Read
- Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! 'బై-బై' సెలబ్రేషన్ వీడియో వైరల్.!
- Telangana High Court: "సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా".. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Mahabubabad: ఇద్దరు పిల్లల తల్లి దారుణం.. ప్రియుడితో కలిసి భర్త హత్యకు స్కెచ్.. ఫోన్ చెక్ చేస్తే మైండ్ బ్లాక్..
ఇక చైనా 2023 చైనా ఎడిషన్ పేరుతో విడుదల చేసిన మ్యాప్ భారత్ లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. భారతలోని భూభాగాలను తమ ప్రాంతాలుగా చూపుతూ సోమవారం చైనా అధికారికంగా ఓ మ్యాప్ను రిలీజ్ చేసింది. కాగా ఇందులో అరుణాచల్ ప్రదేశ్, అక్సాయిచిన్ వంటి వివాదాస్పద భూభాగాలను తమ దేశంలో అంతర్భాగంగా పేర్కొంది డ్రాగన్ కంట్రీ. ఇక అరుణాచల్ ప్రదేశ్ను దక్షిణ టిబెట్గా చూపించడంతోపాటు తైవాన్, దక్షిణా చైనా సముద్రాన్ని కూడా తమ దేశ ప్రాంతాలుగా కలిపేసుకుంది. ఈ విషయంపై మోడీ ఇంకా స్పందించలేదు. దీనిపై విపక్షాలు అధికార పార్టీ టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నాయి. చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేసే దమ్ము మోడీకి ఉందా అని శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఘాటుగా స్పందించారు. ఈ విషయంలో రాహుల్ చెప్పింది నిజమేనని, భారత భూభాగం ఆక్రమణకు గురయ్యిందని ఆయన ముందే చెప్పారని అన్నారు. ఇప్పుడు ఆ విషయం స్పష్టమయ్యిందని పేర్కొన్నారు. అయితే బ్రిక్స్ సమావేశాలకు హాజరైన మోడీ చైనా ప్రతినిధులను ఆలింగనం చేసుకొని ఆప్యాయంగా మాట్లాడిన కొన్ని రోజుల తరువాతే చైనా ఇలాంటి మ్యాప్ విడుదల చేసింది. ఇక దీనిపై స్పందించిన విదేశాంగ మంత్రి జైశంకర్ మా సరిహద్దుల గురించి మేం స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నాం. ఇలాంటి ఆరోపణలతో ప్రజల స్థలాన్ని మీరు లాక్కోలేరు అంటూ పేర్కొన్నారు. ఇక వచ్చే నెలలో భారత్ లో జరగున్న జీ-20 సదస్సుకు చైనా కూడా హాజరుకానుంది.
#WATCH | Delhi | While leaving for Karnataka, Congress MP Rahul Gandhi speaks on China government’s ‘2023 Edition of the standard map of China’; says, “I have been saying for years that what the PM said, that not one inch of land was lost in Ladakh, is a lie. The entire Ladakh… pic.twitter.com/NvBg0uhNY1
— ANI (@ANI) August 30, 2023
తాజావార్తలు
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్తో బెయిర్స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
-
Telangana High Court: “సమాజంలో ఎవరికైనా బాధ్యత ఉందా”.. ఉచిత పథకాలపై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు..
-
CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
-
Petrol Cars India: పెట్రోల్ కార్ల శకం ముగిసిందా? ఈవీలు, హైబ్రిడ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయికి.. మార్కెట్లో మారుతి ఆధిపత్యం
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్కు గుడ్బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్లో లాంచ్..!