Vande Bharat Express: వందేభారత్ ఎక్స్ప్రెస్కు మళ్లీ యాక్సిడెంట్.. ఈ సారి ఎద్దు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vande Bharat Express: ఇటీవల పశువులను ఢీకొన్న ఘటనలతో వార్తల్లో నిలిచిన సెమీ హైస్పీడ్ రైలు వందేభారత్ ఎక్స్ప్రెస్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా మళ్లీ ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. శనివారం ఉదయం ముంబై సెంట్రల్ నుంచి గాంధీనగర్కు వెళుతున్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ఓ ఎద్దును ఢీకొట్టింది. ఫలితంగా.. ట్రైన్ ముందు భాగం దెబ్బతింది.ఇటీవల ప్రధాని చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ రైలుకు కష్టాలు వచ్చిపడుతున్నాయి.
India: పాక్ గ్రే లిస్ట్లో ఉండగా ఉగ్రదాడులు తగ్గిపోయాయి..
Also Read
ఉదయం 8:30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. గుజరాత్లోని అతుల్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ ఎద్దు రైల్వే ట్రాక్పైకి దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. వేగంగా వెళుతున్న రైలు ఆ ఎద్దును ఢీకొట్టింది. ఘటన అనంతరం 15 నిమిషాల పాటు రైలు నిలిచింది. ఈ ఘటనలో రైలుకు ఎలాంటి నష్టం జరగకపోగా.. ముందుభాగం కాస్త విరిగింది. వందే భారత్ ఎక్స్ప్రెస్ ఈ విధంగా జరగడం ఇది మూడోసారి. అక్టోబర్ 6న ముంబై నుంచి గాంధీనగర్కు వెళుతున్న క్రమంలో.. వట్వా- మనీనగర్ రైల్వే స్టేషన్ వద్ద గేదెను ఢీకొట్టింది. అప్పుడు కూడా నోస్ ప్యానెల్ దెబ్బతింది. ఆ మరుసటి రోజు గుజరాత్ నుంచి ముంబైకి వెళుతుండగా.. ఆనంద్ సమీపంలో ఓ ఆవు వందేభారత్ రైలును ఢీకొట్టింది.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!