V.Hanumantha Rao : మోడీ ప్రధాని అయ్యాక.. సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రధాని అయ్యాక కేవలం బడా వ్యాపారులకే ప్రయోజనం చేకూరుతుందని, సామాన్యులకు ఒరిగింది ఏమి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటీశ్వరులకి మాత్రం బ్యాంకులు లక్షల కోట్ల అప్పులు ఇస్తాయని, పేదలు, రైతులకు మాత్రం రుణాలు ఇయ్యవని ఆయన ఆరోపించారు. ఇచ్చినా.. కట్టే వరకు పీడించుకుంటాయని ఆయన మండిపడ్డారు. ఆదాని షేర్లు పడిపోవడం వల్ల బ్యాంకుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అంటున్నారని, దేశంలో పోర్టులు, బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్లు అన్నీ అమ్మకానికి పెట్టేస్తున్నారని, ఆదానికి కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
Also Read
దేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీని, గంగవరం పోర్టును ఎవడబ్బ సొమ్ము అని అమ్మేస్తున్నారని, పేదవాడి కోసం మోడీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆదాని ఆస్తులపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారని ఆయన అన్నారు. ఈ నెల 15 తరువాత విశాఖ వెళ్లి అన్ని పార్టీల నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్నారు.
Also Read : Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
తాజావార్తలు
-
PeddiTrailer : ‘పెద్ది’ పెద్దగా మెప్పిచలేకపోయాడా? రెహమాన్ దెబ్బేసాడా?
-
MS Dhoni-IPL 2027: ఐపీఎల్ 2027లో ఎంఎస్ ధోనీ.. అసలు విషయం చెప్పేసిన సురేశ్ రైనా!
-
Cost Cutting: బ్యాంకులకు మోడీ సర్కార్ బిగ్ షాక్.. దేశంలో మళ్లీ ‘లాక్డౌన్’ లాంటి కఠిన రూల్స్! అసలేం జరిగిందంటే..
-
Ramayana Epic: రణ్బీర్ ‘రామాయణం’ కోసం హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్
-
What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
ట్రెండింగ్
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh భారీ బ్యాటరీ, 50MP డ్యూయల్ కెమెరా సెటప్తో REDMAGIC 11S Pro సిరీస్ లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
600 రోజుల బ్యాటరీ బ్యాకప్, IP68 రేటింగ్తో Moto Tag 2 లాంచ్..!
-
Viral Video : మృత్యువు ఒడిలో మాతృత్వం.. పిల్లల కోసం రైలు కింద దూరిన తల్లి.! కళ్లు చెదిరే సాహసం.!
-
200MP కెమెరా, 8600mAh భారీ బ్యాటరీతో HONOR 600 సిరీస్.. హైలైట్స్ ఇవే.!
-
NEET UG 2026: నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష.!