V.Hanumantha Rao : మోడీ ప్రధాని అయ్యాక.. సామాన్యులకు ఒరిగింది ఏమి లేదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మోడీ ప్రధాని అయ్యాక కేవలం బడా వ్యాపారులకే ప్రయోజనం చేకూరుతుందని, సామాన్యులకు ఒరిగింది ఏమి లేదన్నారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంత్ రావు. తాజాగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కోటీశ్వరులకి మాత్రం బ్యాంకులు లక్షల కోట్ల అప్పులు ఇస్తాయని, పేదలు, రైతులకు మాత్రం రుణాలు ఇయ్యవని ఆయన ఆరోపించారు. ఇచ్చినా.. కట్టే వరకు పీడించుకుంటాయని ఆయన మండిపడ్డారు. ఆదాని షేర్లు పడిపోవడం వల్ల బ్యాంకుల మీద ఎలాంటి ప్రభావం ఉండదని ఆర్థికమంత్రి నిర్మల సీతారామన్ అంటున్నారని, దేశంలో పోర్టులు, బొగ్గు గనులు, స్టీల్ ప్లాంట్లు అన్నీ అమ్మకానికి పెట్టేస్తున్నారని, ఆదానికి కట్టబెడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను కూడా అమ్మేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : Kohli vs Rohit: కోహ్లీ, రోహిత్ మధ్య గొడవలు నిజమే: మాజీ కోచ్ శ్రీధర్
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
దేశంలోనే అతిపెద్ద ఉక్కు ఫ్యాక్టరీని, గంగవరం పోర్టును ఎవడబ్బ సొమ్ము అని అమ్మేస్తున్నారని, పేదవాడి కోసం మోడీ ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఆదాని ఆస్తులపై సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ తో విచారణ చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను దివంగత ప్రధాని పీవీ నరసింహారావు జాతికి అంకితం చేశారని ఆయన అన్నారు. ఈ నెల 15 తరువాత విశాఖ వెళ్లి అన్ని పార్టీల నేతలతో కలిసి ఆందోళనలో పాల్గొంటానని ఆయన స్పష్టం చేశారు. ఆ ప్లాంట్ ప్రభుత్వం ఆధీనంలోనే ఉండాలన్నారు.
Also Read : Dadisetti Raja: యనమలకు దాడిశెట్టి సవాల్.. తమ్ముడితో ఆ పని చేయించగలవా?
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?