Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!
Uzbekistan: మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా నివసించే దేశమైన ఉజ్బెకిస్థాన్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ఈ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 వేల మసీదులలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లాహ్ దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు చేయడానికి గుమిగూడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ప్రార్థించలేదు, కానీ దేశంలో చాలా కాలంగా వర్షం కురవడం లేదు. కాబట్టి మేము అల్లాహ్ దయ కోసం ప్రార్థించాం” అని అన్నారు.
READ ALSO: Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..
Also Read
- Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే...
- MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
- Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
- Chairmans Desk : ఐదు రాష్ట్రాల ఎన్నికలు పొలిటికల్ ట్రెండ్ మార్చయా? రాజకీయాలు అంటే యుద్ధాలేనా ?
170 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు..
ఉజ్బెకిస్థాన్ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం తాష్కెంట్ 170 సంవత్సరాలలో అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంది. గత 60 ఏళ్లలో దేశ ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు పెరిగాయి. ఈ సంవత్సరం దేశంలో ఏర్పడిన కరువు సమస్య అనేది కేవలం వాతావరణ సమస్య కాదని, వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితం అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా ఆసియాలోని దాదాపు 80 మిలియన్ల జనాభాకు ప్రధాన నీటి వనరు అయిన హిమానీనదాలను వేగంగా కరిగిస్తున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియాలో ఐదు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థలు వేగంగా పెరుగుతున్నాయి, అదే సమయంలో ఈ దేశాల నీటి వనరులు కూడా వేగంతో క్షీణిస్తున్నాయి. ఇది ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలపై తీవ్రమైన నీటి ఒత్తిడిని పెంచిందని నివేదికలు చెబుతున్నాయి.
వర్షాభావం కారణంగా ఈ దేశంలో పంటలు ఎండిపోతున్నాయి, సరస్సులు కుంచించుకుపోతున్నాయి, విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కుంగిపోతున్నాయి. దీంతో ప్రజలు చివరి ప్రయత్నంగా దేవుడి దయ కోసం ప్రార్థనల వైపు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిశోధన నుంచి అంతర్జాతీయ నివేదికల వరకు, ఇది కేవలం కాలానుగుణంగా వచ్చిన వర్షం ఆలస్యం మాత్రమే కాదని, తీవ్రమైన, దీర్ఘకాలిక వాతావరణ సంక్షోభం అని స్పష్టంగా చెబుతున్నాయి. దేశం ముఖ్యమైన పర్యావరణ సంస్కరణలు అమలు చేయకపోతే, ఇలాంటి సంక్షోభాలను నిరంతరం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
READ ALSO: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..
తాజావార్తలు
-
Gen Z: జెన్ జీల ప్రభావం.. రాష్ట్రాల సీఎంలనే మార్చేశాయి.. విజయ్కు కలిసొచ్చింది ఇదే…
-
Off The Record : కాకినాడ ఎంపీ పనితీరుపై జనసేనలోనే అసహనం!
-
MK Stalin: ఓడిన కొన్ని గంటలకే కొళత్తూరులో స్టాలిన్ పర్యటన.. ఫొటోలు వైరల్
-
Off The Record : బెంగాల్ తర్వాత టార్గెట్ తెలంగాణేనా..?
-
Story Board : దీదీ దూకుడుకి కళ్లెం పడ్డట్టేనా..? బెంగాల్ కూతురు భవిష్యత్ కార్యాచరణ ఏంటి..?
ట్రెండింగ్
-
Range Rover SV : భారత్లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత
-
3.4K డిస్ప్లే, 13380mAh బ్యాటరీ, క్రయో-వెలాసిటీ కూలింగ్ టెక్నాలజీతో OnePlus Pad 4 లాంచ్.!
-
స్టైలిష్ కలర్స్తో iQOO Neo 10 కొత్త వేరియంట్లు లాంచ్.. ధర ఎంతంటే.?
-
స్టైల్ + టెక్.. Motorola ‘Brilliant Collection’లో సిగ్నేచర్ స్మార్ట్ ఫోన్, మోటో బడ్స్ 2.!
-
Viral Video: రైలుకింద పడ్డ చిన్నారి.. ప్రాణాలను పణంగా పెట్టి కాపాడిన తండ్రి.!