Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uzbekistan: మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా నివసించే దేశమైన ఉజ్బెకిస్థాన్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ఈ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 వేల మసీదులలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లాహ్ దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు చేయడానికి గుమిగూడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ప్రార్థించలేదు, కానీ దేశంలో చాలా కాలంగా వర్షం కురవడం లేదు. కాబట్టి మేము అల్లాహ్ దయ కోసం ప్రార్థించాం” అని అన్నారు.
READ ALSO: Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..
Also Read
- Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
- Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
- Abhijeet Dipke: "ఇది అంతం కాదు.. ఆరంభం".. సీజేపీ విజయంపై అభిజీత్ దిప్కే సంచలన వీడియో..
- BCCI: జింబాబ్వేపై గెలిచినా తగ్గని అసంతృప్తి.. గంభీర్ సపోర్ట్ స్టాఫ్ భవితవ్యంపై బీసీసీఐ కీలక రివ్యూ!
170 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు..
ఉజ్బెకిస్థాన్ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం తాష్కెంట్ 170 సంవత్సరాలలో అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంది. గత 60 ఏళ్లలో దేశ ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు పెరిగాయి. ఈ సంవత్సరం దేశంలో ఏర్పడిన కరువు సమస్య అనేది కేవలం వాతావరణ సమస్య కాదని, వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితం అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా ఆసియాలోని దాదాపు 80 మిలియన్ల జనాభాకు ప్రధాన నీటి వనరు అయిన హిమానీనదాలను వేగంగా కరిగిస్తున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియాలో ఐదు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థలు వేగంగా పెరుగుతున్నాయి, అదే సమయంలో ఈ దేశాల నీటి వనరులు కూడా వేగంతో క్షీణిస్తున్నాయి. ఇది ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలపై తీవ్రమైన నీటి ఒత్తిడిని పెంచిందని నివేదికలు చెబుతున్నాయి.
వర్షాభావం కారణంగా ఈ దేశంలో పంటలు ఎండిపోతున్నాయి, సరస్సులు కుంచించుకుపోతున్నాయి, విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కుంగిపోతున్నాయి. దీంతో ప్రజలు చివరి ప్రయత్నంగా దేవుడి దయ కోసం ప్రార్థనల వైపు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిశోధన నుంచి అంతర్జాతీయ నివేదికల వరకు, ఇది కేవలం కాలానుగుణంగా వచ్చిన వర్షం ఆలస్యం మాత్రమే కాదని, తీవ్రమైన, దీర్ఘకాలిక వాతావరణ సంక్షోభం అని స్పష్టంగా చెబుతున్నాయి. దేశం ముఖ్యమైన పర్యావరణ సంస్కరణలు అమలు చేయకపోతే, ఇలాంటి సంక్షోభాలను నిరంతరం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
READ ALSO: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..
తాజావార్తలు
-
Ishan Kishan: నేను అస్సలు టెన్షన్ పడలేదు.. ఎక్కడ తగ్గాలో నాకు తెలుసు!
-
Peddi Sudarshan Reddy: బీఆర్ఎస్లో తీవ్ర విషాదం.. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కన్నుమూత!
-
Kargil Vijay Diwas 2026: కార్గిల్ విజయ్ దివస్.. వీర జవాన్లకు నివాళులర్పించిన ప్రధాని మోడీ..
-
NBK111: బాలయ్య కోసం గోపీచంద్ ప్రత్యేక హోమం.. డిశ్చార్జ్పై గుడ్ న్యూస్!
-
Arunachalam Cave Tragedy: అరుణాచలంలో విషాదం.. మోక్ష మార్గంలో చిక్కుకుని రాజమహేంద్రవరం భక్తుడు మృతి!
ట్రెండింగ్
-
IND vs ZIM 3rd T20: మరో ఇద్దరు అరంగేట్రం.. భారత్ ప్లేయింగ్ 11 ఇదే.. పిచ్, వెదర్, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Parents Alert: రోజూ ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నారా? పిల్లల్లో ఈ ప్రమాదం 52% పెరుగుతుందట.!
-
Easy Wall Cleaning Tips: గోడలపై మరకలా? ఖరీదైన క్లీనర్లు వద్దు.. ఇంట్లో ఉన్నవే చాలు.!
-
Smart Money Rules: జీవితాన్ని మార్చే స్మార్ట్ ‘మనీ రూల్స్’.! ఆర్థికంగా బలపడాలంటే తప్పక తెలుసుకోవాల్సిన సూత్రాలు ఇవే..
-
12.1 అంగుళాల 2.5K డిస్ప్లే, 10,200mAh బ్యాటరీతో రానున్న Moto Pad 70.!