Uzbekistan: ఈ ముస్లిం దేశంలో ఏక కాలంలో 2 వేల మసీదులలో ప్రార్థనలు.. దీని కోసమేనా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uzbekistan: మధ్య ఆసియాలో ముస్లింలు అధికంగా నివసించే దేశమైన ఉజ్బెకిస్థాన్ ప్రస్తుతం చరిత్రలో ఎన్నడూ లేనంత దారుణమైన కరువును ఎదుర్కొంటోంది. ఈ దేశంలో పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, శుక్రవారం దేశవ్యాప్తంగా ఏకకాలంలో 2 వేల మసీదులలో వర్షం కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సైన్స్, వాతావరణం సహకరించనప్పుడు ప్రజలు అల్లాహ్ దయ కోసం ప్రార్థించాలని మత నాయకులు పిలుపునిచ్చారు. దీంతో దేశ రాజధాని తాష్కెంట్లో వేలాది మంది ప్రజలు ఏకకాలంలో బహిరంగ ప్రదేశాలు, మసీదులలో ప్రార్థనలు చేయడానికి గుమిగూడారు. ఈ సందర్భంగా పలువురు ప్రజలు మాట్లాడుతూ.. “మేము ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా ప్రార్థించలేదు, కానీ దేశంలో చాలా కాలంగా వర్షం కురవడం లేదు. కాబట్టి మేము అల్లాహ్ దయ కోసం ప్రార్థించాం” అని అన్నారు.
READ ALSO: Putin India Visit: ‘‘చమురు, S-400, Su-57 జెట్స్ ’’.. పుతిన్ పర్యటనలో కీలక అంశాలు..
Also Read
- YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
- TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
- స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
- Supreme Court: SIR ప్రక్రియ చట్టబద్ధమే.. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణకు సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్..
170 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా కరువు..
ఉజ్బెకిస్థాన్ వాతావరణ సంస్థ నివేదికల ప్రకారం.. ఈ సంవత్సరం తాష్కెంట్ 170 సంవత్సరాలలో అత్యంత దారుణమైన కరువును ఎదుర్కొంది. గత 60 ఏళ్లలో దేశ ఉష్ణోగ్రత ప్రపంచ సగటు కంటే మూడు రెట్లు పెరిగింది. దీంతో దేశంలో కరువు పరిస్థితులు పెరిగాయి. ఈ సంవత్సరం దేశంలో ఏర్పడిన కరువు సమస్య అనేది కేవలం వాతావరణ సమస్య కాదని, వాతావరణ మార్పుల ప్రత్యక్ష ఫలితం అని పలువురు విశ్లేషకులు చెబుతున్నారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం.. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు కారణంగా ఆసియాలోని దాదాపు 80 మిలియన్ల జనాభాకు ప్రధాన నీటి వనరు అయిన హిమానీనదాలను వేగంగా కరిగిస్తున్నాయి. ఇదే సమయంలో మధ్య ఆసియాలో ఐదు దేశాల జనాభా, ఆర్థిక వ్యవస్థలు వేగంగా పెరుగుతున్నాయి, అదే సమయంలో ఈ దేశాల నీటి వనరులు కూడా వేగంతో క్షీణిస్తున్నాయి. ఇది ఉజ్బెకిస్థాన్ వంటి దేశాలపై తీవ్రమైన నీటి ఒత్తిడిని పెంచిందని నివేదికలు చెబుతున్నాయి.
వర్షాభావం కారణంగా ఈ దేశంలో పంటలు ఎండిపోతున్నాయి, సరస్సులు కుంచించుకుపోతున్నాయి, విద్యుత్, నీటిపారుదల వ్యవస్థలపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది, అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థలు కుంగిపోతున్నాయి. దీంతో ప్రజలు చివరి ప్రయత్నంగా దేవుడి దయ కోసం ప్రార్థనల వైపు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ పరిశోధన నుంచి అంతర్జాతీయ నివేదికల వరకు, ఇది కేవలం కాలానుగుణంగా వచ్చిన వర్షం ఆలస్యం మాత్రమే కాదని, తీవ్రమైన, దీర్ఘకాలిక వాతావరణ సంక్షోభం అని స్పష్టంగా చెబుతున్నాయి. దేశం ముఖ్యమైన పర్యావరణ సంస్కరణలు అమలు చేయకపోతే, ఇలాంటి సంక్షోభాలను నిరంతరం ఎదుర్కొనే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నాయి.
READ ALSO: Australian PM Wedding: 62 ఏళ్ల వయసులో ప్రేమ వివాహం.. ప్రధాని జీవితంలో సరికొత్త అధ్యాయం..
తాజావార్తలు
-
SRH vs RR Eliminator: కళ్లు చెదిరే గణాంకాలు వర్మ.. ఎలిమినేటర్లో బౌలర్లకు అతి పెద్ద సవాల్ ఆ ఇద్దరే!
-
YS Jagan: వైసీపీ విస్తృత స్థాయి సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు.. రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు పిలుపు
-
Vishwambhara : అదిగో విశ్వంభర.. ఇదిగో రిలీజ్
-
TDP Mahanadu: పసుపు జెండా చూస్తే వచ్చే వైబ్రేషన్సే వేరు.. మహానాడులో చంద్రబాబు భావోద్వేగ ప్రసంగం
-
August Box Office: టాలీవుడ్లో హీట్ పెంచనున్న ఆగస్టు రిలీజ్లు.. నాని Vs రవితేజ Vs శర్వా!
ట్రెండింగ్
-
స్టైలిష్ డిజైన్, 50MP పెరిస్కోప్ కెమెరా, IP69K రెసిస్టెన్స్ తో OPPO Reno16 సిరీస్ లాంచ్..
-
200MP కెమెరా, 8600mAh బ్యాటరీ, Dimensity 8550 Elite చిప్తో HONOR 600 సిరీస్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10100mAh బ్యాటరీతో HONOR Pad 20 లాంచ్.!
-
Raw Mango Roti Pachadi: అమ్మ చేతి రుచిని గుర్తు చేసే పుల్లటి “మామిడికాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!