Uttarakhand Tunnel Collapse: రంగంలోకి అంతర్జాతీయ టన్నెలింగ్ నిపుణుల బృందం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Uttarakhand Tunnel Collapse: ఉత్తరాకాండ్ రాష్ట్రం ఉత్తరకాశిలోని సిల్కియారా సొరంగం కుప్పకూలిన ఘటన జరిగి ఎనిమిది రోజులు అవుతోంది. సొరంగంలో చిక్కుకున్న 41 కార్మికులు బిక్కుబిక్కుమంటు రోజులు గడుపుతున్నారు. ఇంకా అక్కడ రెస్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. వారిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం శతవిధాల ప్రయత్నిస్తోంది. కానీ సహాయ చర్యల్లో తరచూ అవాంతారాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ టన్నెల్ నిపుణులను అధికారులు రంగంలోకి దింపారు. సోమవారం ఉదయం అంతర్జాతీయ టన్నెల్ నిపుణుడు అర్నాల్డ్ డిక్స్ బృందం ఉత్తరాకాండ్ చేరుకుంది.
Also Read: Tirupati: తిరుపతి లో షాకింగ్ ఘటన.. పోలీస్ స్టేషన్ ఎదుట వ్యక్తి ఆత్మహత్యాయత్నం..
Also Read
- Rajya Sabha Candidates: టీడీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు.. చివరి నిమిషంలో చింతకాయల విజయ్ పేరు ఖరారు!
- Nitin Nabin: విదేశాల నుంచి భారత యువతను ఆడించలేరు.. సీజేపీపై బీజేపీ పరోక్ష విమర్శలు..
- Shashi Tharoor: రాహుల్గాంధీపై అనుచిత వ్యాఖ్యలు.. ‘ఒబామా.. మోడీ సంగతి ఏంటి?’.. రామచంద్ర గుహకు శశిథరూర్ కౌంటర్
- Vaibhav's Father: ‘సూర్యవంశీ వారి కాలి దుమ్ముకు కూడా సరిపోడు’.. సంచలన వ్యాఖ్యలు చేసిన వైభవ్ తండ్రి..
రెస్క్యూ ఆపరేషన్ తొమ్మిదో రోజుకు చేరుకోవడంతో ఇంటర్నేషనల్ టన్నెల్లింగ్ అండ్ అండర్ గ్రౌండ్ స్పేస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్నాల్డ్ డిక్స్ సంఘటన స్థలంలో నిపుణులతో కలిసి ఆపరేషన్ను పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెస్క్యూ ఆపరేషన్ పనులు సాగుతున్నాయని, తన బృందం మొత్తం ఇక్కడే ఉందని తెలిపారు. ఈ త్వరలోనే సమస్యను పరిష్కరించి కార్మికులను సురక్షితంగా బయటకు తీసుకువస్తామని ఆయన పేర్కొన్నారు. ఇక్కడ చాలా పని జరుగుతోందని, చిక్కుకున్న కార్మికులే కాదు రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్నవాళ్లు కూడా సురక్షితంగా ఉండాలని అర్నాల్డ్ సూచించారు.
Also Read: Fishing Harbour Fire Accident: ఫిషింగ్ హార్బర్లో అగ్నిప్రమాదం.. అసలు కారణం ఇదా..?
కాగా ఇప్పటికే ఈ రెస్క్యూ ఆపరేషన్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఆర్మీ తమ సేవలను అందిస్తున్న సంగతి తెలిసిందే. రెస్క్యూ ఆపరేషన్ కోసం ఉపయోగపడే భారీ పరికరాలను ఘటనా స్థలానికి తీసుకొచ్చే బాధ్యతను ఎయిర్ ఫోర్స్ తీసుకుంది. అలాగే ఈ రెస్క్యూ ఆపరేషన్ను పర్యవేక్షించడానికి భారత ఆర్మీకి చెందిన ఓ డ్రోన్ వచ్చింది. ఇది ఏరియల్ మానిటరింగ్, ప్రాజెక్ట్ ఆపరేషన్ను సమర్థవంతంగా పూర్తి చేయడానికి సహాయపడుతోంది.
తాజావార్తలు
-
Samantha Ruth Prabhu : ‘మా ఇంటి బంగారం’ హీరోయిన్ సాయి పల్లవా ? ఆ ఛాన్స్ సామ్ ఎలా కొట్టేసిందంటే ?
-
Vivo V70 Lite: వివో V70 లైట్ విడుదల.. 6500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్, 6.77 అంగుళాల FHD+ AMOLED డిస్ప్లే
-
Astrology: డబ్బు విషయంలో ఈ 3 రాశులవారు చాలా జాగ్రత్త.. ఖర్చు పెట్టే ముందు పదిసార్లు ఆలోచిస్తారట!
-
Veerappan Interview Controversy : వీరప్పన్ కేసులో హీరోయిన్ కు బిగ్ రిలీఫ్… ఆ ఛానల్ భారీ పరిహారం చెల్లించాల్సిందే.!
-
Suryakumar-Shreyas: చాలా సంతోషంగా ఉంది.. సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం.. సూర్య సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!