IAS Officer: పేషెంట్లా ఆస్పత్రికొచ్చిన ఐఏఎస్ ఆఫీసర్.. ఆ తర్వాత ఏం చేశారంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అది ప్రభుత్వాస్పత్రి.. లోపల ఏం జరుగుతుందో.. రోగులకు ఎలాంటి వైద్యం అందుతుందో.. డాక్టర్లు, సిబ్బంది ఎలా పని చేస్తున్నారో తెలుసుకోవాలనుకున్నారు ఐఏఎస్ ఆఫీసర్. అంతే ఎలాంటి హంగు, ఆర్భాటాలతో కాకుండా ఒక సామాన్య పేషేంట్లా ఆస్పత్రి లోపలికి ఎంట్రీ ఇచ్చారు.. ఆస్పత్రి మొత్తం కలయ తిరిగి చూశారు. లోపల జరుగుతున్న బాగోతం చూసి తన ప్రతాపాన్ని చూపించారు ఆఫీసర్. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటుచేసుకుంది.
ఫిరోజాబాద్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలోకి ఐఏఎస్ అధికారి క్రతిరాజ్ రహస్యంగా రోగిలా మారువేషంలో ప్రవేశించారు. ఆస్పత్రి అంతటిని ఆమె క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం అక్కడ జరుగుతున్న లోపాలను గుర్తించారు. ఇంత జరుగుతున్న ఆస్పత్రి సిబ్బంది ఏ మాత్రం కనిపెట్టలేకపోయారు.
Also Read
- Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్పై తీవ్ర విమర్శలు
- Israe-Lebanon: లెబనాన్పై మరోసారి ఇజ్రాయెల్ భీకర దాడులు.. పశ్చిమాసియాలో టెన్షన్
రోగులు ఎదుర్కొంటున్న అసౌకర్యాల గురించి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ మేరకు ఆమె రహస్య పరిశోధనకు పూనుకున్నారు. ఆమె గుర్తింపును దాచిపెట్టి వైద్య విభాగాల్లోకి చొరబడ్డారు. రహస్య ఆపరేషన్ ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నారు. డాక్టర్ల గైర్హాజరు కావడమే కాకుండా పని చేస్తున్న సిబ్బంది పని తీరు కూడా ఏ మాత్రం సరిగ్గా కనిపించలేదు. దీంతో ఆమె డాక్టర్లు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఔషధాలు పంపిణీ చేసే స్టోర్ రూమ్ను కూడా పరిశీలించారు.. అన్ని మందులు గడువు ముగిసిన మందులుగా గుర్తించి విసిరి పారేశారు. అలాగే మరికొన్ని ప్రమాదకరమైన మందులను గుర్తించారు. ఆస్పత్రిలో అవసరమైన సిబ్బంది ఉండి కూడా ఎందుకు ఇలా చేస్తు్న్నారంటూ మండిపడ్డారు. అలాగే ఆస్పత్రిలో ఎక్కడా కూడా పరిశుభ్రత కనిపించలేదు. కనీస ప్రమాణాలు కూడా పాటించకుండా సిబ్బంది నిర్లక్ష్యంగా ఉండడంతో మండిపడ్డారు.
అలాగే కొంత మంది డాక్టర్లు.. రోగులతో సరైన విధంగా వ్యవహరించకపోవడాన్ని కూడా ఆమె గుర్తించారు. అన్ని సాక్ష్యాలను సేకరించిన తర్వాత ఆమె.. దర్యాప్తునకు ఆదేశించారు.
ఇదిలా ఉంటే ఐఏఎస్ ఆఫీసర్ క్రతి రాజ్ ఆరోపణలను చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాంబదన్ రామ్ ఖండించారు. గడువు ముగిసిన మందులను ఉపయోగించడంలేదని.. అలాంటి మందులను ఓ పెట్టెలో పెట్టి దాచినట్లు చెప్పారు. అలాగే ఆస్పత్రిలో కూడా పరిశుభ్రత బాగానే ఉందని ఆయన కితాబు ఇచ్చారు.
కృతి రాజ్.. ఉత్తరప్రదేశ్లోని సదర్కు చెందిన సబ్-డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం)గా పని చేస్తున్నారు. రహస్యంగా ఆస్పత్రిని పరిశీలించి విచారణకు ఆదేశించారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
#WATCH | Uttar Pradesh: Sub-Divisional Magistrate Sadar Kriti Raj inspected a government health centre in Firozabad, after receiving several complaints regarding inconveniences faced by patients.
(Source: SDM Office) pic.twitter.com/UZamZhpvxJ
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 13, 2024
తాజావార్తలు
-
Allu Arjun : అల్లుఅర్జున్ ‘రాకా’ 2027లో రావడం కూడా కష్టమేనా.?
-
US strikes on Iran: మళ్లీ యుద్ధం.. ఇరాన్పై అమెరికా వైమానిక దాడులు.. హార్ముజ్ జలసంధిని మూసివేస్తున్నట్లు ప్రకటన
-
ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు
-
Jr NTR: జూలై 18న ఎన్టీఆర్ కీలక ప్రకటన? అభిమాన సంఘాల ఏకీకరణ వెనుక అసలు ఉద్దేశమేంటి?
-
OTR : యాదాద్రి ఆలయ పాలకమండలి ప్రమాణ స్వీకారం.. మంత్రుల డుమ్మా!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!