Yogi Adityanath: ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే.. ఆలంగీర్ ఆలం కూడా అంటూ సీఎం యోగి ఫైర్
- జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి.
- హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్.
- ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నాడంటూ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Yogi Adityanath: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అలంగీర్ ఆలం తన సన్నిహితుడి ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయనను సీఎం యోగి ‘ఔరంగజేబు’తో పోల్చారు. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే ఆలంగీర్ రాష్ట్రంలోని పేదలను దోచుకున్నాడని ఆయన అన్నారు. జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నాడని.. ఆలయాలను ధ్వంసం చేశాడని, అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన మంత్రి ఆలంగీర్ ఆలం.. ఇంటి నుంచి నోట్లు దొరికాయని అన్నారు. ఈ డబ్బు జార్ఖండ్లోని పేదలకు చెందినదని, ఇది దోచుకుని దాచుకున్నట్లు తెలిపారు. మంత్రితో పాటు పనిమనిషి, బంధువుల ఇళ్లలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇదంతా జార్ఖండ్ ప్రజల సొమ్ము. ఇంతకంటే దారుణమైన దోపిడీ మరెక్కడా కనిపించదని ఆయన అన్నారు.
Read Also: MIG 29 Crash: కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. (వీడియో)
Also Read
- Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
- రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
- Nepal Floods: నేపాల్లో భారీ వరదలు.. 16 మంది హైదరాబాద్ ఎన్ఆర్ఐలు గల్లంతు..!
- 50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
జార్ఖండ్లోని కోడెర్మాలో మాట్లాడిన యోగి.. మాఫియాలకు సంబంధించి ఓ ప్రకటన కూడా ఇచ్చారు. 2017 తర్వాత యూపీలో బుల్ డోజర్ల హవా మొదలైందని, అందుకు సంబంధించి కొందరు జైల్లో ఉన్నారని, కొందరికి రాముడి పేరు నిజమైందని అన్నారు. గాడిద తలపై నుంచి కొమ్ము మాయమైనట్లే యూపీ నుంచి మాఫియా అంతరించిపోయిందని ఆయన అన్నారు. సోరెన్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అలంగీర్ ఆలమ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మే 6న అలంగీర్ ఆలం ప్రాంగణంలో ఈడీ దాడులు చేసి రూ.30 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరికిన తర్వాత, నోట్లను లెక్కించేందుకు ఈడీ పలు యంత్రాలను తెప్పించుకుంది. జహంగీర్ ఆలం ఫ్లాట్ నుండి అధికారులు కొన్ని నగలు, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Green Tea Effects: ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే?
సీఎం యోగి కంటే ముందే అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అలంగీర్ ఆలంపై మాటల దాడి చేయడం గమనార్హం. ప్రస్తుత సోరెన్ ప్రభుత్వాన్ని మంత్రులు ఇర్ఫాన్ అన్సారీ, అలంగీర్ ఆలం వంటి వారు కైవసం చేసుకున్నారని అన్నారు. ఆలంగీర్ ఇంటి నుండి అపారమైన సంపద రికవరీ చేయబడింది. అయినప్పటికీ కాంగ్రెస్ అతని భార్యకు టిక్కెట్ ఇచ్చిందని అన్నారు.
తాజావార్తలు
-
Janasena Party: స్థానిక పోరుకు జనసేన సిద్ధం.. 30 రోజుల పాటు ప్రత్యేక ప్రణాళిక
-
Range Rover Sport Twenty Edition: రేంజ్ రోవర్ స్పోర్ట్ ట్వంటీ లిమిటెడ్ ఎడిషన్ విడుదల.. 537HP పవర్, కొత్త ఆరెంజ్ కలర్
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
ISI Spy Trap: పాక్ ISI స్పై ట్రాప్.. ‘నగ్న ఫొటోలు’ ఎరగా వేసి భారత రక్షణ అధికారులను టార్గెట్ చేస్తున్న పాక్ ISI?
-
Hrehaan Roshan: హృతిక్ రోషన్ కొడుకు సింగర్గా ఎంట్రీ.. తొలి పాటతోనే అదరగొట్టిన హృహాన్!
ట్రెండింగ్
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!
-
Fridge Wall Gap : ఫ్రిజ్ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!