Yogi Adityanath: ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే.. ఆలంగీర్ ఆలం కూడా అంటూ సీఎం యోగి ఫైర్
- జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో యూపీ సీఎం యోగి.
- హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఫైర్.
- ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నాడంటూ..
Yogi Adityanath: జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ హేమంత్ సోరెన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోరెన్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అలంగీర్ ఆలం తన సన్నిహితుడి ఇంటి నుంచి భారీ మొత్తంలో నగదు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయనను సీఎం యోగి ‘ఔరంగజేబు’తో పోల్చారు. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నట్లే ఆలంగీర్ రాష్ట్రంలోని పేదలను దోచుకున్నాడని ఆయన అన్నారు. జార్ఖండ్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో సీఎం యోగి మాట్లాడుతూ.. ఔరంగజేబు దేశాన్ని దోచుకున్నాడని.. ఆలయాలను ధ్వంసం చేశాడని, అలాగే జార్ఖండ్ ముక్తి మోర్చాకు చెందిన మంత్రి ఆలంగీర్ ఆలం.. ఇంటి నుంచి నోట్లు దొరికాయని అన్నారు. ఈ డబ్బు జార్ఖండ్లోని పేదలకు చెందినదని, ఇది దోచుకుని దాచుకున్నట్లు తెలిపారు. మంత్రితో పాటు పనిమనిషి, బంధువుల ఇళ్లలో నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఇదంతా జార్ఖండ్ ప్రజల సొమ్ము. ఇంతకంటే దారుణమైన దోపిడీ మరెక్కడా కనిపించదని ఆయన అన్నారు.
Read Also: MIG 29 Crash: కుప్పకూలిన మిగ్-29 యుద్ధ విమానం.. (వీడియో)
Also Read
- UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
- Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి 'భట్టి' భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
- Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
- Watermelon Prices: నలుగురు మృతి.. రూ. 7కు పడిపోయిన వాటర్మిలన్ ధరలు..
జార్ఖండ్లోని కోడెర్మాలో మాట్లాడిన యోగి.. మాఫియాలకు సంబంధించి ఓ ప్రకటన కూడా ఇచ్చారు. 2017 తర్వాత యూపీలో బుల్ డోజర్ల హవా మొదలైందని, అందుకు సంబంధించి కొందరు జైల్లో ఉన్నారని, కొందరికి రాముడి పేరు నిజమైందని అన్నారు. గాడిద తలపై నుంచి కొమ్ము మాయమైనట్లే యూపీ నుంచి మాఫియా అంతరించిపోయిందని ఆయన అన్నారు. సోరెన్ ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేసిన అలంగీర్ ఆలమ్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) బృందం అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మే 6న అలంగీర్ ఆలం ప్రాంగణంలో ఈడీ దాడులు చేసి రూ.30 కోట్లకు పైగా నగదు స్వాధీనం చేసుకుంది. ఇంత పెద్ద మొత్తంలో నగదు దొరికిన తర్వాత, నోట్లను లెక్కించేందుకు ఈడీ పలు యంత్రాలను తెప్పించుకుంది. జహంగీర్ ఆలం ఫ్లాట్ నుండి అధికారులు కొన్ని నగలు, పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Read Also: Green Tea Effects: ప్రతిరోజూ గ్రీన్ టీ తాగితే ఏమవుతుందంటే?
సీఎం యోగి కంటే ముందే అస్సాం సీఎం హిమంత శర్మ కూడా అలంగీర్ ఆలంపై మాటల దాడి చేయడం గమనార్హం. ప్రస్తుత సోరెన్ ప్రభుత్వాన్ని మంత్రులు ఇర్ఫాన్ అన్సారీ, అలంగీర్ ఆలం వంటి వారు కైవసం చేసుకున్నారని అన్నారు. ఆలంగీర్ ఇంటి నుండి అపారమైన సంపద రికవరీ చేయబడింది. అయినప్పటికీ కాంగ్రెస్ అతని భార్యకు టిక్కెట్ ఇచ్చిందని అన్నారు.
తాజావార్తలు
-
Pan Masala: గుట్కా ప్రియులకు షాక్.. పాన్ మసాలా ప్యాకెట్లపై కేంద్రం సంచలన నిర్ణయం!
-
UAE OPEC Exit: యూఏఈ ఒపెక్ ఎగ్జిట్.. భారత్కు లాభం, పాకిస్తాన్కు నష్టం..
-
Gayapadda Simham: స్టార్ హీరోల ఫాన్స్ గెట్ రెడీ ఫర్ బ్లాస్టింగ్ స్పూఫ్స్!
-
Bhatti Vikramarka: ప్రభుత్వ ఉద్యోగులకు మంత్రి ‘భట్టి’ భరోసా.. రూ.1000 కోట్ల బకాయిల విడుదల.!
-
Adhir Ranjan Chowdhury: మమతా బెనర్జీ కళ్లలో భయం, ఇలా ఎప్పుడూ చూడలేదు..
ట్రెండింగ్
-
50 గంటల బ్యాటరీ, IP54 రేటింగ్తో Vivo TWS 5i లాంచ్.. ధర కూడా బడ్జెట్ లోనే.!
-
13 అంగుళాల 3.5K PureSight Pro డిస్ప్లే, AI ఫీచర్లతో Lenovo Idea Tab Pro Gen 2 లాంచ్.. ధర ఎంతంటే.?
-
7200mAh భారీ బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో మిడ్ రేంజ్ బడ్జెట్లో Vivo Y500s లాంచ్.. ఫీచర్స్ ఇవే.!
-
10200mAh భారీ బ్యాటరీ, IP68 + IP69 రేటింగ్స్, 120Hz AMOLED డిస్ప్లేతో vivo Y600 Pro లాంచ్.. ధర ఎంతంటే.?
-
Vaibhav Sooryavanshi: ఎంతకు తెగించావ్ బుడ్డోడా.. సెల్ఫీ కావాలంటే రూ.100 ఇవ్వాల్సిందేనా.. వైరల్ వీడియో