Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
  • English
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Uttam Kuma Reddy Met Union Minister

Uttam Kumar Reddy : ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యం

Published Date :September 17, 2024 , 8:35 pm
By Gogikar Sai Krishna
Uttam Kumar Reddy : ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యం
  • Follow Us :
  • google news
  • google preferred source icon Add as a preferred
    source on google

రాష్ట్రంలోని సాగునీటి ప్రాజెక్టుల కోసం గత ప్రభుత్వం చేసిన అప్పులు ఇప్పుడు ప్రభుత్వానికి ఆర్థికంగా భారంగా మారినందున వాటిపై విధించిన వడ్డీని పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గించేలా కేంద్ర ప్రభుత్వ రంగ ద్రవ్య సంస్థలను ఒప్పించేలా చొరవ తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వానికి తెలంగాణ ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. వీలైతే మొత్తంగా క్లియర్ చేయాలని, లేదా పాక్షికంగానైనా మాఫీ చేయాలని కోరినట్లు తెలిపారు. మంగళ వారం నాడు న్యూ ఢిల్లీ లోని భారత మండపంలో కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 8వ ఇంటర్నేషనల్ వాటర్ వీక్ సదస్సు- 2024 కు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ప్రారంభమైన ఈ సదస్సు నేటి నుండి నాలుగు రోజుల పాటు కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలంగాణలో ఈ రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఏటా సుమారు ఆరు లక్షల ఎకరాల మేర కొత్త ఆయకట్టును సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బడ్జెట్‌లో రూ. 29 వేల కోట్లను ఈ రంగానికి కేటాయించినట్లు తెలిపారు.

Devara Pre Release Event: దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిక్స్.. ఎక్కడంటే?

Also Read

  • Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు
  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?
  • Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..
  • Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..
Add as a preferred
source on google

రాష్ట్ర ప్రభుత్వ కృషికి తోడుగా కేంద్రం నుంచి తగిన సహాయ సహకారాలు కావాల్సిందిగా ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తన ప్రసంగంలో పేర్కొన్నారు.కేంద్ర ప్రభుత్వం ఏ విధంగానైతే దేశంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను పెంపొందించడం కోసం లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తామని పార్లమెంటులో ప్రకటించారో అదేవిధంగా నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం కోసం అదే స్ధాయిలో కేటాయించాలని మంత్రి కోరారు. ఈ ప్రాజెక్టులకు కేంద్రం నుంచి నిధుల రూపంలో సాయం అందడంతో పాటు వివిధ రకాల క్లియరెన్సులను కూడా త్వరిగతిన ఇచ్చేలా చొరవ తీసుకోవాలని తన ప్రసంగం ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. అంతే కాకుండా పలు సాగునీటి ప్రాజెక్టులకు ప్రపంచబ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు తరఫున సాఫ్ట్ లోన్ కావాల్సిందిగా ఆ రెండు సంస్థల ప్రతినిధులతో ఆయన ఈ రోజు చర్చించారు.. రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన సమ్మక్క-సారలమ్మ ఇరిగేషన్ ప్రాజెక్టులోని కొంత ముంపు భాగం చత్తీస్‌గడ్ రాష్ట్ర పరిధిలో ఉన్నందున దీన్ని పూర్తి చేయడానికి, కేంద్రం నుంచి క్లియరెన్సులు రావడానికి ఆ రాష్ట్రం నుంచి ఎన్ ఓ సీ రావాల్సి ఉన్నదని, ఆ ప్రక్రియను వేగవంతం చేయాల్సిందిగా ఆ రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి కేదార్ కశ్యప్‌తో చర్చించినట్లు తెలిపారు.

Andhra Pradesh: పీజీ వైద్య విద్యలో ఇన్‌సర్వీస్ రిజ‌ర్వేష‌న్‌పై రేపు చ‌ర్చలు

చత్తీస్‌గడ్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి సమ్మక్క-సారలమ్మ ప్రాజెక్టుకు అన్ని రకాల క్లియరెన్సులు ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వమూ చొరవ తీసుకోవాలని ఈ వేదిక నుంచి మంత్రి ఉత్తమ్ విజ్ఞప్తి చేశారు. కేంద్ర జలశక్తి మంత్రి పాటిల్‌తో ఈ విషయంతో పాటు రాష్ట్ర ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి గత అప్పులపై వడ్డీని పూర్తిగా మాఫీ చేయడం లేదా తగ్గించాలని, చత్తీస్‌గడ్ నుంచి ఎన్ ఓ సీ లభించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాల్సిందిగా మంత్రి విజ్ఞప్తి చేశారు.. ఈ కార్యక్రమంలో 40 దేశాల నుంచి ప్రతినిధులతో పాటు మన దేశంలోని 20 రాష్ట్రాలకు చెందిన ఇరిగేషన్ మంత్రులు, ఎన్జీవో సంస్థల ప్రతినిధులు, నిపుణులు, పాలసీ మేకర్స్ పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • breaking news
  • latest news
  • telugu news
  • uttam kumar reddy

తాజావార్తలు

  • Tamil Nadu: రేపు లోక్‌భవన్ ఎదుట ఆందోళనలకు కాంగ్రెస్ పిలుపు

  • Mamata Banerjee: మమతా బెనర్జీ రాజీనామా చేయకుంటే ఎలా.? వచ్చే 2 రోజులు బెంగాల్‌ను ఎవరు పాలిస్తారు.?

  • Suvendu Adhikari PA Murder: పక్కా పథకం ప్రకారమే సువేందు అధికారి పీఏ హత్య..

  • Operation Sindoor: 13 పాక్ విమానాలు, 11 స్థావరాలను లేపేశాం.. సంచలన విషయం బయటపెట్టిన భారత సైన్యం..

  • Minister Seethakka : మహిళా స్వయం సహాయక బృందాలకు శుభవార్త చెప్పిన మంత్రి సీతక్క

ట్రెండింగ్‌

  • Range Rover SV : భారత్‌లో లగ్జరీ కార్లకు భారీ ఊరట.. రేంజ్ రోవర్ SV ధరల్లో కోత

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions