భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కీలక ప్రకటన చేశారు. దాడులు తక్షణమే తగ్గించాలని ఇరు దేశాలకు పిలుపునిచ్చారు. భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్ జైశంకర్, పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో ఆయన ఫోన్లో మాట్లాడారు. ఇరుదేశాల మధ్య చర్చలకు యూఎస్ మద్దతు ఉంటుందని వెల్లడించారు. అవసరమైతే భారత్, పాకిస్థాన్ మధ్య చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తానని ప్రతిపాదించారు. హహల్గాం ఉగ్రదాడిని ఖండించిన రూబియో ఉగ్రవాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని మార్కో రూబియో స్పష్టం చేశారు.
READ MORE: India-Pakistan War: విదేశాలకు పారిపోవడానికి యత్నిస్తున్న పాక్ ఉన్నతాధికారులు?
గురువారం రాత్రి భారత్పై దాడులు చేసేందుకు వచ్చిన పాక్ ఫైటర్ జెట్లను.. భారత బలగాలు కూల్చేశాయి. 35 నిమిషాలపాటు సాగిన ఈ ప్రయత్నాలను భారత్ సమర్థంగా తిప్పికొట్టింది. 8 డ్రోన్లను, 3 ఫైటర్ జెట్లను కూల్చేసింది. పాక్ పైలట్ను భారత సైన్యం బందీగా పట్టుకుంది. పాక్ దుస్సాహసంపై జాతీయ భద్రతా సలహాదారు అజీత్ దోవల్ సమీక్షించారు. అనంతరం ఆయన పూర్తి వివరాలను ప్రధాని మోడీకి తెలియజేశారు. పాక్ దాడి తర్వాత- ఫైసలాబాద్, సర్గోదాల్లోని ఆ దేశ రక్షణ వ్యవస్థలను భారత్ ధ్వంసం చేసింది. ఈ నేపథ్యంలో ఇరు దేశాలు సంయమనం పాటించాలని అమెరికా సహా పలు దేశాలు సూచిస్తున్నాయి.
READ MORE: India-Pakistan War: సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం.. పెద్దఎత్తున చొరబాటుకు యత్నం..