US-Iran War: ఇరాన్ యుద్ధంలో అమెరికాకు చావుదెబ్బ.. 16 యుద్ధ విమానాలు ధ్వంసం!
- కుప్పకూలిన 12 డ్రోన్లు, మూడు F-15 యుద్ధ విమానాలు
- ఒక్కో డ్రోన్ విలువ సుమారు రూ.2.5 బిలియన్లు
- అమెరికాకు దాదాపు రూ.4000 కోట్ల ప్రత్యక్ష నష్టం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
US-Iran War: మధ్యప్రాచ్యంలో ఇరాన్తో జరుగుతున్న పోరులో అగ్రరాజ్యం అమెరికా ఊహించని నష్టాలను చవిచూస్తోంది. ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో అగ్రరాజ్యం చావుదెబ్బ తిందని విశ్లేషకులు చెబుతున్నారు. 2026 యుద్ధ గమనంలో ఇప్పటివరకు అమెరికా వాయుసేనకు చెందిన 16 విమానాలు కూలిపోయినట్లు నివేదికలు అందుతున్నాయి. ఇందులో అత్యాధునిక డ్రోన్లతో పాటు కీలకమైన యుద్ధ విమానాలు కూడా ఉండటం గమనార్హం. వాటి గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
READ ALSO: Stock Market: హమ్మయ్య.. తేరుకున్న మార్కెట్.. భారీ లాభాల్లో సూచీలు
Also Read
- Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
- Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
- Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
- Gold In Bag: అలిపిరిలో దొరికిన బంగారం బ్యాగ్.. సీసీటీవీ పరిశీలించిన అధికారులు..
కుప్పకూలిన 12 ‘రీపర్’ డ్రోన్లు
అమెరికా గర్వంగా చెప్పుకునే MQ-9 రీపర్ డ్రోన్లకు ఈ యుద్ధంలో భారీ నష్టం వాటిల్లింది. ఇరాన్ క్షిపణి స్థావరాలపై దాడులకు వెళ్లిన 12 డ్రోన్లను ఇరాన్ రక్షణ వ్యవస్థలు కూల్చివేశాయి. ఒక్కో రీపర్ డ్రోన్ విలువ సుమారు రూ.2.5 బిలియన్లు (రూ. 250 కోట్లు). 27 గంటల పాటు నిరంతరాయంగా ఎగురుతూ క్షిపణి దాడులు చేయగల ఈ డ్రోన్లు కూలిపోవడం అమెరికాకు పెద్ద దెబ్బ అనే చెబుతున్నారు.
మిత్రదేశం పొరపాటు.. ముగ్గురు పైలట్ల మృతి
ఈ యుద్ధంలో అత్యంత దురదృష్టకరమైన ఘటన కువైట్ ఆకాశంలో చోటుచేసుకుంది. ఇరాన్పై మిషన్లో ఉన్న మూడు F-15 యుద్ధ విమానాలను కువైట్ దళాలు శత్రు విమానాలుగా పొరబడి క్షిపణులతో కూల్చివేశాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు అమెరికన్ పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అలాగే, గాలిలో ఇంధనాన్ని నింపే KC-135 స్ట్రాటోట్యాంకర్ విమానం ఇరాక్లో కూలిపోవడంతో ఆరుగురు సిబ్బంది మరణించారు.
“యుద్ధం వేగంగా ముగుస్తుంది, అమెరికాకు ఎలాంటి ప్రాణనష్టం జరగదు” అని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో ఇచ్చిన హామీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. విమానాల రూపంలోనే అమెరికాకు దాదాపు రూ.4000 కోట్ల ప్రత్యక్ష నష్టం వాటిల్లిందని నివేదికలు చెబుతున్నాయి. డ్రోన్లను తిరిగి తయారు చేయవచ్చు కానీ, అనుభవజ్ఞులైన పైలట్లు, KC-135 వంటి కీలక విమానాలను కోల్పోవడం పూడ్చలేని లోటుగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం ట్రంప్ యంత్రాంగం సందిగ్ధంలో పడినట్లు సమాచారం. దాడులను మరింత తీవ్రతరం చేయడానికి F-35, B-2 బాంబర్లను రంగంలోకి దించుతారా? లేక అంతర్జాతీయ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు ప్రారంభిస్తారా? అన్నది ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. వైట్ హౌస్ మాత్రం ఆపరేషన్ కొనసాగుతుందని చెబుతున్నప్పటికీ, సొంత పార్టీలోనే ట్రంప్ వ్యూహాలపై అసమ్మతి వ్యక్తమవుతోదని తెలుస్తుంది. మొత్తానికి, ఒక చిన్న ఆపరేషన్గా భావించిన ఈ పోరు ఇప్పుడు సుదీర్ఘమైన, అత్యంత ఖరీదైన యుద్ధంగా మారుతోందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: IPL 2026: ఆ ఐదుగురు దిగ్గజాలకు ఇదే చివరి సీజన్ కానుందా? అభిమానుల్లో ఉత్కంఠ!
తాజావార్తలు
-
Shamshabad : ఇండిగో ఉద్యోగినిపై క్యాబ్ డ్రైవర్ అత్యాచారయత్నం..!
-
Free Flight Journey: వారికి భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. ఒక రోజు ఉచిత విమాన ప్రయాణం..
-
Minister Seethakka : ములుగు టూర్కు వెళ్తున్నారా? మంత్రి సీతక్క కీలక హెచ్చరిక.!
-
Indus Waters Treaty: సింధు జలాల ఒప్పందంపై పాకిస్తాన్కు కెనడా షాక్..
-
Kavya Maran: పాకిస్థాన్ క్రికెటర్ను కొనుగోలు చేయడంపై చెలరేగిన రచ్చ.. కావ్య మారన్ రియాక్షన్ ఇదే!
ట్రెండింగ్
-
Cleaning Hacks : తుప్పు పట్టిన ఇనుప అల్మారా కొత్తదానిలా మెరవాలా? ఈ 4 చిట్కాలు చాలు.!
-
Remote Cleaning : వర్షాల్లో టీవీ రిమోట్ పనిచేయడం లేదా? ఈ 4 ట్రిక్స్తో కొత్తదానిలా మారుతుంది.!
-
Food Storage Tips : వంట నూనె ఇలా నిల్వ చేస్తే విషమే.! ఈ 5 సంకేతాలు కనిపిస్తే వెంటనే పారేయండి
-
Kitchen Tips : పుట్టగొడుగులు 2 రోజుల్లో పాడవుతున్నాయా? ఈ సీక్రెట్ ట్రిక్తో వారాల పాటు ఫ్రెష్.!
-
Sanju Samson: రోహిత్ భాయ్ సారీ.. నిన్ను నేను నమ్మలేదు.. సంజు ఆసక్తికర వ్యాఖ్యలు!