US-Iran War: అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి. అమెరికాతో మళ్లీ ఘర్షణకు దిగే అవకాశం ఉందని ఇరాన్ సైన్యం సంకేతాలు ఇచ్చింది. రెండు దేశాల మధ్య ఒప్పందాలు, పరిస్థితి క్షీణిస్తున్నాయని ఇరాన్ చెబుతోంది. ఇరాన్ సైనిక కమాండ్ అధికారి మహ్మద్ జాఫర్ అసదీ మాట్లాడుతూ.. అమెరికా నుంచి వస్తున్న సంకేతాలను బట్టి చూస్తే ఆ దేశం ఎలాంటి రాజీ లేదా అవగాహనకు కట్టుబడి ఉండటానికి ఇష్టంగా లేదని చెప్పారు. అమెరికాను కొద్దిగా కూడా నమ్మే అవకాశమే లేదనే సందేశాన్ని ఇరాన్ పంపుతోంది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.. మనం అణ్వాయుధాలను ఉన్మాదుల చేతుల్లో పెట్టలేమని ఇరాన్ను ఉద్దేశిస్తూ ట్రంప్ అన్నారు. ఈ వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య మరింత దూరాన్ని పెంచాయి. తమ సైన్యం పూర్తి అప్రమత్తతతో ఉందని అని కూడా ఇరాన్ పేర్కొంది. పరిస్థితి దిగజారినా, అమెరికా ఏదైనా చర్యకు పాల్పడినా తాము ధీటుగా ప్రతిస్పందించడానికి సిద్ధంగా ఉన్నామని అసదీ చెప్పారు. అమెరికా చేస్తున్న ప్రకటనలు కేవలం షో చేయడానికి మాత్రమే అని ఆరోపించారు. ముఖ్యంగా చమురు, తమ పేరుప్రతిష్టల కోసం అమెరికా ప్రత్యేకంగా ఆందోళన చెందుతోందని ఆయన అన్నారు.
మరోవైపు ట్రంప్ ఇరాన్ చర్యలు తన అంచనాలకు అనుగుణంగా లేవని ట్రంప్ చెప్పారు. తాను అంగీకరించడానికి ఇష్టపడిన డిమాండ్లను ఇరాన్ చేస్తోందని ఆయన అన్నారు. ఇరాన్ నాయకత్వం ఐక్యంగా లేదని, విడిపోయిందని ఆయన అన్నారు. రెండు దేశాల మధ్య తాజా ఉద్రిక్తతలు మళ్లీ యుద్ధానికి దారి తీస్తాయనే అనుమానాలు ప్రపంచ దేశాల్లో నెలకొన్నాయి.
