US Crime: ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాకు చెందిన శ్రీమతి కందుల జాహ్నవి సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్శిటీ క్యాంపస్లో మాస్టర్స్ చదువుతుంది. కాగా ఈ ఏడాది డిసెంబర్లో ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకొంనుంది. ఇంతలో విధి ఆమెని చిన్నచూపు చూసింది. పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొని ఆమె ఈ ఏడాది ప్రారంభంలో జనవరిలో చనిపోయింది.
టెల్ పోలీస్ డిపార్ట్మెంట్ సమాచారం ప్రకారం మార్క్ చేయబడిన పెట్రోలింగ్ SUVని నడుపుతున్న అధికారి డెక్స్టర్ అవెన్యూ నార్త్లో ఉత్తరం వైపు ప్రయాణిస్తున్నారు అదే సమయలో మహిళ పాదచారి క్రాస్వాక్లో తూర్పు నుండి పడమరకు దాటుతుండగా వాహనం ఆమెను ఢీకొన్నది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన జాహ్నవి మృతి చెందింది.
కాగా ఈ ఆక్సిడెంట్ కి సంబంధించిన ఓ వీడియో వెలుగు చూసింది. జాహ్నవి మరణించాక ఆమె మరణం గురించి ఒక అధికారి నవ్వుతూ, సరదాగా మాట్లాడడం తన బాడీ కెమెరాలో రికార్డ్ కావడంతో సీటెల్ పోలీసు యూనియన్ నాయకులపై దర్యాప్తు ప్రారంభించినట్లు న్యూయార్క్ పోస్ట్ నివేదించింది. సోమవారం ఈ వీడియో ని విడుదల చేశారు. అనంతరం టెల్ కమ్యూనిటీ పోలీస్ కమీషన్ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో Mr ఆడెరర్ మరియు అతని సహోద్యోగి మధ్య జరిగిన సంభాషణ “హృదయ విదారకమైనది అంటూ దిగ్బ్రాంతి వ్యక్తంచేసింది. కాగా ఈ ఘటన పై దర్యాప్తు కొనసాగుతుందని పోలీస్ అధికారులు పేర్కొన్నారు.
విడుదలైన వీడియో లో సీటెల్ పోలీస్ ఆఫీసర్స్ గిల్డ్ వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరర్, గిల్డ్ ప్రెసిడెంట్తో కాల్లో మాట్లాడుతూ, మరియు శ్రీమతి కందులను “సాధారణ వ్యక్తి” అని పిలిచే ముందు, “ఆమె చనిపోయింది అని నవ్వుతూ చెప్పగా. అతను నవ్వుతూ, “అవును, ఒక చెక్కు రాయండి. పదకొండు వేల డాలర్లు” అన్నాడు. వీడియో పరంగా ఆలోచిస్తే జాహ్నవి హత్య చేయబడిందా అనే అనుమానం వ్యక్తం అవుతుంది.