Ursula von der Leyen: భారత్ విజయం ప్రపంచానికి లాభం.. ఈయూ చీఫ్ ప్రశంసలు..
- భారత విజయవంతమైతే ప్రపంచానికి లాభం..
- ప్రపంచాన్ని సురక్షితం, సంపన్నం చేస్తుందన్న ఈయూ చీఫ్..
- ఈయూ-భారత్ ట్రేడ్ డీల్కు ముందు ఉర్సులా వాన్ డెర్ లేయన్ కామెంట్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ursula von der Leyen: యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్ లేయన్, భారత 77వ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సోమవారం ఆమె మాట్లాడుతూ.. ‘‘విజయవంతమైన భారతదేశం ప్రపంచాన్ని మరింత స్థిరంగా, సంపన్నంగా, సురక్షితంగా చేస్తుంది’’ అని అన్నారు. 27 దేశాల యూరోపియన్ యూనియన్(ఈయూ) కూటమి-భారత్ మధ్య జరిగే చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందానికి ముందు ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
భారతదేశంలో మూడు రోజుల పర్యటనలో ఉన్న ఈయూ చీఫ్, తాను భారతదేశ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరుకావడాన్ని ‘‘జీవితకాల గౌరవం’’గా భావిస్తున్నానని చెప్పారు. ఆమెతో పాటు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా కూడా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంగళవారం ఆమె ప్రధాని నరేంద్రమోడీతో శిఖరాగ్ర చర్చలు జరపనున్నారు.
Also Read
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
- Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
- Trump: డెమోక్రాట్లు గెలిస్తే అమెరికాకు అదే గతి.. స్పెయిన్ వలసపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
భారతదేశం-EU వాణిజ్య ఒప్పందం:
భారత్, ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం(FTA) కోసం ఇరు పక్షాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. భారత పర్యటనకు ముందు.. ఆమె మాట్లాడుతూ, భారత్-ఈయూలు ‘చారిత్రాత్మక వాణిజ్య ఒప్పందం’ అంచున ఉన్నాయని, ఇది ప్రపంచ జీడీపీలో దాదాపు పావు వంతు వాటాను కలిగి ఉన్న రెండు బిలియన్ల ప్రజల మార్కెట్లను సృష్టిస్తుందని అన్నారు. గత మంగళవారం ఆమె దావోస్ సమావేశాల్లో మాట్లాడుతూ.. ఈ ఒప్పందాన్ని ‘‘మదర్ ఆఫ్ ఆల్ డీల్స్’’గా అభివర్ణించారు.
యూరోపియన్ యూనియన్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి, 2023-24 ఆర్థిక సంవత్సరంలో ద్వైపాక్షిక వస్తు వాణిజ్యం 135 బిలియన్ డాలర్లుగా నమోదైంది. ఈయూ, భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కో్సం చర్చలు మొదటగా 2007లో ప్రారంభమయ్యాయి, 2013లో చర్చల నిలిచిపోయాయి, 2022లో చర్చలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈయూ నుంచి దిగుమతి అయ్యే కార్లపై సుంకాలు 110 శాతం నుంచి 40 శాతానికి తగ్గించాలని భారత్ యోచిస్తున్నట్లు సమాచారం. ఈ డీల్ తో వోక్స్వ్యాగన్, మెర్సిడెస్-బెంజ్ మరియు బీఎండబ్ల్యూ వంటి యూరోపియన్ ఆటోమొబైల్ తయారీదారులకు భారత మార్కెట్లోకి ప్రవేశాన్ని సులభతరం అవుతుంది. ఇదే విధంగా భారత ఉత్పత్తుల్ని ఈయూ మార్కెట్లోకి తీసుకెళ్లవచ్చు.
తాజావార్తలు
-
Telangana : ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్.. కొత్త హెల్త్ స్కీమ్ డ్రాఫ్ట్ విడుదల.!
-
Telangana RERA : తెలంగాణ రియల్ ఎస్టేట్కు ఊరట.. RERA ప్రాజెక్టులకు 4 నెలల గడువు.!
-
Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
-
Gold Medal In Glasgow: కామన్వెల్త్ గేమ్స్లో దూసుకుపోతున్న భారత్.. మరో రెండు స్వర్ణాలు సొంతం..
-
Kulgam: కుల్గామ్లో ఉగ్ర దాడి.. వలస కార్మికుడు మృతి
ట్రెండింగ్
-
Kitchen Tips : బియ్యం కేవలం వంటకే కాదు.. ఈ సీక్రెట్ హ్యాక్స్ తెలిస్తే ఆశ్చర్యపోతారు.!
-
Flipkart Pay Later: ఇప్పుడు కొనండి.. నిమ్మలంగా కట్టండి.. ఫ్లిప్కార్ట్లో ‘పే లేటర్’ సదుపాయం!
-
ITR Filing Deadline: ట్యాక్స్పేయర్లకు అలెర్ట్.. ITR ఫైల్ చేశారా? ఈరోజే చివరి గడువు.!
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీ అవసరమా?.. అసలు ఆ ఆలోచన ఏంటి?.. ప్రముఖ వ్యాఖ్యాత ఆసక్తికర వ్యాఖ్యలు!
-
కొత్త కలర్స్, ట్యూబ్లెస్ స్పోక్ వీల్స్తో 2026 Yezdi బైక్స్ లాంచ్..!