UPSC New Rules: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో అమలులోకి రానున్న కొత్త నిబంధనలు
- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కొత్త నిబంధనలు
- వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- ఫిబ్రవరి 11, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది, పూజా ఖేద్కర్ అనే వ్యక్తి తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి దివ్యాంగుల కోటాలో ఐఏఎస్గా ఎంపికైంది. ఈ కేసు తర్వాత, యూపీఎస్సీ నిబంధనలను మరింత కఠినంగా తీసుకుంది.
Also Read: China: చేజేతులా రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు.. ఇప్పుడేమో లబోదిబో అంటున్నాడుగా
Also Read
- Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
- Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
- Hyderabad: నెంబర్ ప్లేట్ లేని కారుతో ఢీ.. నగరంలో న్యాయవాది దారుణ హత్య!
- Pakistan Cuts Petrol and Diesel Prices: పాక్లో భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు.. వరుసగా రెండోసారి ఊరట
2025 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికుల వివరాలు, విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్లను తప్పనిసరిగా అందించాలి. ఈ పత్రాలను సంబంధిత రుజువులతో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని సమర్పించకపోతే, అభ్యర్థి అభ్యర్ధిత్వం రద్దు చేస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పోస్టులకు దివ్యాంగులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి.
Also Read: Republic Day Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఫిబ్రవరి 11, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని కమిషన్ తెలిపింది. ఈ కీలక మార్పులతో, అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఇచ్చింది.
తాజావార్తలు
-
Kara: ధనుష్ ‘కర’ ఓటీటీ రిలీజ్ డేట్ను ఫిక్స్ ..
-
Pregabalin: ప్రెగాబాలిన్ దుర్వినియోగంపై కేంద్రం అలర్ట్.. అమ్మకాలపై ఆరోగ్యశాఖ ఆంక్షలు
-
Arava Sridhar Resignation: పవన్ కల్యాణ్ను కలిసిన ఎమ్మెల్యే అరవ శ్రీధర్.. పదవికి రాజీనామా..
-
Peddi Censor Report: ‘పెద్ది’కి U/A సర్టిఫికేట్.. కానీ ఈ సీన్లపై సెన్సార్ కత్తెర
-
Dahi Masala Khichdi Recipe: వేసవిలో చల్లదనం ఇచ్చే దహీ మసాలా కిచిడి.. రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేస్తుంది..
ట్రెండింగ్
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?
-
ప్రీమియం డిజైన్, 50MP Sony కెమెరా, 144Hz AMOLED డిస్ప్లే తో Motorola Edge 70 Pro+..!
-
705Km రేంజ్తో Xiaomi YU7 GT ఎలక్ట్రిక్ SUV.. ఫీచర్లు చూస్తే మైండ్ బ్లోయింగ్ అవ్వాల్సిందే.!
-
అదిరిపోయే ఫీచర్లు తక్కువ ధరలోనే.. IP55 రేటింగ్, 50 గంటల బ్యాటరీ బ్యాకప్, 55dB ANCతో Realme Buds Air 8 Pro లాంచ్.!