UPSC New Rules: యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో అమలులోకి రానున్న కొత్త నిబంధనలు
- యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్లో కొత్త నిబంధనలు
- వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
- ఫిబ్రవరి 11, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు దరఖాస్తుల స్వీకరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
UPSC New Rules: భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్ష కోసం సంసిద్ధమయ్యే అభ్యర్థులకు ఈ సంవత్సరం నుండి యూపీఎస్సీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ 2025 నోటిఫికేషన్ తాజాగా విడుదల అయింది. ఇందులో ఉన్న కొత్త మార్పుల ప్రకారం, ప్రిలిమినరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకొనే అభ్యర్థులు తమ వయస్సు, రిజర్వేషన్ కోటా ఆధారంగా సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. ఈ మార్పులు గతంలో పూజా ఖేద్కర్ కేసు తర్వాత అమలులోకి వచ్చాయి. గతేడాది, పూజా ఖేద్కర్ అనే వ్యక్తి తప్పుడు ఓబీసీ, మెడికల్ సర్టిఫికెట్ సమర్పించి దివ్యాంగుల కోటాలో ఐఏఎస్గా ఎంపికైంది. ఈ కేసు తర్వాత, యూపీఎస్సీ నిబంధనలను మరింత కఠినంగా తీసుకుంది.
Also Read: China: చేజేతులా రెండు కోట్లు వద్దునుకున్న వృద్ధుడు.. ఇప్పుడేమో లబోదిబో అంటున్నాడుగా
Also Read
- Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
- Shreyas Iyer: ఓటమికి కారణం అతడే.. శ్రేయస్ అయ్యర్ ఆవేదన.. గెలిచే మ్యాచ్ ఓడిపోవాల్సి వచ్చింది..
- IND Vs ENG: ఒకే ఓవర్లో 6, 6, 2, 4, 6, 2.. జాకబ్ బెథెల్ ఊచకోత.. భారత్ ఘోర ఓటమి..
- OTR: ప్రకాశం రాజకీయాల్లో భారీ ట్విస్ట్? జనసేనలోకి మాజీ మంత్రుల ఎంట్రీకి బాలినేని మాస్టర్ ప్లాన్?
2025 సంవత్సరానికి సంబంధించిన నోటిఫికేషన్ ప్రకారం, అభ్యర్థులు తమ ఆన్లైన్ దరఖాస్తు సమయంలో పుట్టిన తేదీ, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులు, మాజీ సైనికుల వివరాలు, విద్యార్హతలు, సర్వీస్ ప్రిఫరెన్స్లను తప్పనిసరిగా అందించాలి. ఈ పత్రాలను సంబంధిత రుజువులతో పాటు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని సమర్పించకపోతే, అభ్యర్థి అభ్యర్ధిత్వం రద్దు చేస్తామని యూపీఎస్సీ స్పష్టం చేసింది. అంతేకాకుండా, 2025 సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష మే 25న నిర్వహించనున్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ ఏడాది మొత్తం 979 పోస్టులను భర్తీ చేయనున్నట్లు కూడా వెల్లడించింది. ఈ పోస్టులకు దివ్యాంగులు, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ వంటి రిజర్వేషన్లు కేటాయించబడ్డాయి.
Also Read: Republic Day Celebrations: బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఫిబ్రవరి 11, 2025వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో తమ దరఖాస్తులను సమర్పించుకోవచ్చని కమిషన్ తెలిపింది. ఈ కీలక మార్పులతో, అభ్యర్థులు తమ దరఖాస్తులను సమర్పించేటప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలని సూచన ఇచ్చింది.
తాజావార్తలు
-
PM Narendra Modi: అమెరికా 250వ స్వాతంత్ర్య దినోత్సవం.. ట్రంప్కు, అమెరికా ప్రజలకు ప్రధాని మోడీ శుభాకాంక్షలు
-
Vaibhav Sooryavanshi: బౌలర్ ఎవరైతే నాకేంటి?.. ఫస్ట్ బాల్ సిక్స్ వెళ్లాల్సిందే.. దిగ్గజ బౌలర్లను వణికిస్తున్న వైభవ్..
-
Dhanush: మరోసారి త్యాగం చేయనున్న ధనుష్?.. రజనీకాంత్ ‘జైలర్ 2’ కోసం ‘ఓం’ వాయిదా పడుతుందా?
-
Onion Price Hike: కొనుగోలు ధరను క్వింటాల్కు రూ. 2,125 పెంచిన ప్రభుత్వం.. ఉల్లి ధరలు మరింత పెరుగుతాయా? పూర్తి వివరాలు
-
Axar Patel: టీ20ల్లో ‘స్పెషల్ సెంచరీ’.. తొలి భారత స్పిన్నర్గా అక్షర్ పటేల్ అరుదైన రికార్డ్
ట్రెండింగ్
-
Rainy Season Tips : వర్షాకాలంలో ఆకుకూరలు తింటున్నారా? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే.!
-
Rainy Season Tips : వర్షాకాలంలో తేమతో సరుకులు పాడవ్వకుండా ఇలా కాపాడుకోండి.!
-
పైరసీ సినిమాలు, ఓటీటీ కంటెంట్పై ‘Telegram’కు కేంద్రం నోటీసు జారీ.. 3,142 పైరసీ ఛానళ్ల గుర్తింపు.!
-
IND Playing XI: సంజు శాంసన్, తిలక్ అవుట్ ఆఫ్ ఫామ్.. ‘వైభవ్’ అరగ్రేటం.? రెండో టీ20 భారత్ ప్లేయింగ్ XI ఇదే.!
-
England Players: ఇంగ్లండ్ ఆటగాళ్లకు ‘వయాగ్రా’ అనుమతి.. అసలు కారణం ఇదే!