IPL 2025-Uppal Stadium: ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు.. రూ.5 కోట్లతో రినోవేషన్ పనులు!
- మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ఆరంభం
- మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్
- సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోన్న ఉప్పల్ స్టేడియం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 మ్యాచ్లు మార్చి 22 నుంచి ఆరంభం కానున్నాయి. సన్రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్) ఈ సీజన్లో తన తొలి మ్యాచ్ను మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది. ఈ మ్యాచ్ కోసం ఎస్ఆర్హెచ్ ప్లేయర్స్ ఇప్పటికే హైదరాబాద్ చేరుకొని ముమ్మర సాధన చేస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ఐపీఎల్ కోసం ఉప్పల్ స్టేడియానికి కొత్త రూపు తీసుకొస్తోంది. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియాన్ని రూ.5 కోట్లతో రినోవేషన్ పనులు చేస్తున్నామని హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్ మోహన్ రావు తెలిపారు.
బీసీసీఐ, సన్రైజర్స్ హైదరాబాద్ ప్రతినిధులతో కలిసి హెచ్సీఏ బాస్ జగన్ మోహన్ రావు ఉప్పల్ స్టేడియం రినోవేషన్ పనులను పరిశీలించారు. ఐపీఎల్ తొలి మ్యాచ్ సమయానికి స్టేడియం పూర్తిగా సిద్ధంగా ఉండాలని, రినోవేషన్ పనుల్లో వేగం పెంచాలని సిబ్బందిని ఆయన ఆదేశించారు. స్టేడియానికి కొత్త రూపు తెచ్చేందుకు హెచ్సీఏ రూ.5 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. స్టేడియం మొత్తం పెయింటింగ్, నార్త్ స్టాండ్స్లో కొత్త రెస్ట్ రూమ్స్, డ్రెస్సింగ్ రూమ్స్ అండ్ కార్పొరేట్ బాక్సుల్లో ఏసీలు మారుస్తున్నామని జగన్ మోహన్ రావు తెలిపారు. సన్రైజర్స్ హైదరాబాద్ కూడా తమకు సహకారం అందిస్తుందని చెప్పుకొచ్చారు. రినోవేషన్ పనులను బీసీసీఐ అధికారులు వైభవ్, యువరాజ్.. సన్రైజర్స్ హైదరాబాద్ నుంచి శరవానణ్, రోహిత్ పరిశీలించారు.
Also Read
- Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
- WhatsApp Username Feature: వాట్సాప్ కొత్త ఫీచర్పై సందేహాలన్నింటికీ చెక్.. మెటా కీలక ప్రకటన
- Green Chillies Storage Tips: ఈ సింపుల్ ట్రిక్ చాలు.. పచ్చిమిరపకాయలు వారాల తరబడి ఫ్రెష్గా ఉంటాయి
- IND vs ENG: మ్యాచ్ రద్దు.. భారత్ బ్యాటింగ్లో కనిపించిన కీలక లోపాలు
Also Read: Gold Rate Today: గోల్డ్ లవర్స్కు షాక్.. భారీగా పెరిగిన బంగారం ధరలు!
59 కార్పొరేట్ బాక్సులతో కలిపి ఉప్పల్ స్టేడియంలో 35,000 మంది ప్రేక్షకులు మ్యాచ్ చూడొచ్చు. ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో 9 మ్యాచ్లు జరగనున్నాయి. ఏడు లీగ్ మ్యాచ్లు, ఓ క్వాలిఫైయర్, ఓ ఎలిమినేటర్ మ్యాచ్ జరగనుంది. ఐపీఎల్ మ్యాచ్లు చూసేందుకు క్రికెట్ ఫాన్స్ సిద్ధంగా ఉన్నారు. ఇటీవల మొదటి రెండు మ్యాచ్లకు సంబంధించిన టికెట్స్ రిలీజ్ చేయగా.. నిమిషాల్లో అమ్ముడుపోయాయి. టికెట్స్ దొరకని వారు తీవ్ర నిరాశకు గురయ్యారు.
తాజావార్తలు
-
Ayodhya Ram Mandir: అయోధ్య రామ్ మందిర్ కొలువుల్లో ‘కమిషన్ల’ భాగోతం.. ట్రస్ట్ కీలక సభ్యుల రాజీనామా వెనుక అసలు రహస్యం ఇదేనా?
-
Schools and Colleges Closed: ఎడతెరిపి లేని వర్షాలు.. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు
-
Gold & Silver Prices Today: కనకం ఇలా షాకిచ్చిందేంటి.. వామ్మో సిల్వర్ కూడా..
-
Hardik Pandya-CSK: సీఎస్కేలోకి హార్దిక్ పాండ్యా.. క్లారిటీ ఇచ్చిన చెన్నై సీఈఓ!
-
Best Crime Thriller Movies: కేతన్ అగర్వాల్ కేసును గుర్తు చేసే థ్రిల్లర్లు.. ఈ సినిమాల ట్విస్టులు చూస్తే షాక్ అవుతారు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: సంజునే స్వయంగా ఛాన్స్ ఇస్తున్నాడు.. రెండో టీ20లో వైభవ్ అరంగేట్రం!
-
144Hz డిస్ప్లే, 10,000mAh బ్యాటరీతో Vivo Pad 5c ఎంట్రీ.. ధర ఎంతంటే?
-
Lenovo నుంచి డబుల్ ధమాకా.. Tab Plus Gen 2, LOQ మానిటర్ సిరీస్ లాంచ్.!
-
Fluffy Omelette: రెగ్యులర్ ఆమ్లెట్కు బదులుగా.. స్పాంజీలా ఉండే ‘ఫ్లఫీ ఆమ్లెట్’ చేసేయండి ఇలా.! లొట్టలేసుకుని తింటారంతే.!
-
Air Fryer vs Stove Cooking: ఎయిర్ ఫ్రయర్ Vs స్టవ్ వంట.. ఆరోగ్యానికి ఏది మంచిది.?