Vande Bharat Express: ‘వందే భారత్’ వేగంలో మార్పులు.. ఇకపై ఎంత వేగంతో అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ వేగంలో మార్పులు జరుగనున్నాయి. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వందే భారత్.. ఇకపై 200 నుంచి 220 కిలో మీటర్లకు పెరగనుంది. అందుకోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్ఎల్) ప్రణాళికలు చేస్తోంది. అయితే అందుకోసం రైళ్లలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లలో బరువైన స్టెయిన్ లెస్ స్టీల్ వాడుతున్నారు. అయితే రైలు వేగం పెరగాలంటే తేలికైన అల్యూమినియం వాడాల్సి ఉంటుంది. ఐతే ఇది ఇప్పట్లో అయ్యే పనికాదు.. ప్రొటోటైప్ రైలు సిద్ధం కావడానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా ఈ రైళ్లను ప్రవేశపెడతారు. అంతేకాకుండా ఆ రైళ్లకు తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Dil Raju: బిగ్ బ్రేకింగ్.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు గెలుపు
Also Read
- Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
- Saudi-Europe: యూరప్కు సౌదీ బిగ్ షాక్.. చమురు నిలిపిపోయే అవకాశం
- Macron: యూరప్లో ఇంధన ధరలు మంటలు.. త్వరలో G7 దేశాల సమావేశం
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
మరోవైపు.. వందేభారత్ రైళ్లు ప్రస్తుతం తెలుపు, నీలం రంగుల్లో ఉండగా.. త్వరలో కాషాయ రంగులో కనిపించనున్నాయి. తొలి విడతలో రెండు కోచ్లను, ఒక ఇంజిన్ను కాషాయ రంగులో ట్రయల్ వర్షన్ను సిద్ధం చేశారు. భారతీయ రైల్వే శాఖ .. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వందేభారత్లో స్లీపర్ కోచ్లు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఏసీ స్లీపర్లో ఒక ఫస్ట్క్లాస్, 4 టూటైర్, 11 త్రీటైర్ కోచ్లు ఉండనున్నాయి. అంతేకాకుండా వందేభారత్ రైలులో మరో 25 మార్పులు కూడా జరుగనున్నాయి. సీటు వాలులో మార్పులతోపాటు సీటు మెత్తదనాన్ని అదనంగా మరో 25 శాతం పెంచుతున్నారు. దివ్యాంగుల కోసం వీల్చైర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, కాళ్లు పెట్టుకునే స్థలాన్ని విస్తరించడం వంటివి చేయనున్నారు. అలాగే, ఈ రైళ్ల తయారీలో వందశాతం స్వదేశీ సామగ్రినే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Tags
- changes
- Railway
- spped
- Train
- Vande Bharat
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..