Vande Bharat Express: ‘వందే భారత్’ వేగంలో మార్పులు.. ఇకపై ఎంత వేగంతో అంటే..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వందే భారత్ వేగంలో మార్పులు జరుగనున్నాయి. ప్రస్తుతం గంటకు గరిష్టంగా 130 కిలో మీటర్ల వేగంతో ప్రయాణిస్తున్న వందే భారత్.. ఇకపై 200 నుంచి 220 కిలో మీటర్లకు పెరగనుంది. అందుకోసం చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ(ఐసీఎఫ్ఎల్) ప్రణాళికలు చేస్తోంది. అయితే అందుకోసం రైళ్లలో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుందని తెలుపుతున్నారు. ప్రస్తుతం ఉన్న వందే భారత్ రైళ్లలో బరువైన స్టెయిన్ లెస్ స్టీల్ వాడుతున్నారు. అయితే రైలు వేగం పెరగాలంటే తేలికైన అల్యూమినియం వాడాల్సి ఉంటుంది. ఐతే ఇది ఇప్పట్లో అయ్యే పనికాదు.. ప్రొటోటైప్ రైలు సిద్ధం కావడానికి రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత కొన్ని రూట్లలో ప్రయోగాత్మకంగా ఈ రైళ్లను ప్రవేశపెడతారు. అంతేకాకుండా ఆ రైళ్లకు తగ్గట్టుగా సిగ్నలింగ్ వ్యవస్థలోనూ మార్పులు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు.
Dil Raju: బిగ్ బ్రేకింగ్.. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో దిల్ రాజు గెలుపు
Also Read
- Shubman Gill: "నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా".. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
- Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
- All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
- Sonam Wangchuk: ‘‘మాకు ఆస్పత్రిపై నమ్మకం లేదు’’..కోర్టుకు సోనమ్ వాంగ్చుక్ భార్య..
మరోవైపు.. వందేభారత్ రైళ్లు ప్రస్తుతం తెలుపు, నీలం రంగుల్లో ఉండగా.. త్వరలో కాషాయ రంగులో కనిపించనున్నాయి. తొలి విడతలో రెండు కోచ్లను, ఒక ఇంజిన్ను కాషాయ రంగులో ట్రయల్ వర్షన్ను సిద్ధం చేశారు. భారతీయ రైల్వే శాఖ .. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి వందేభారత్లో స్లీపర్ కోచ్లు కూడా అందుబాటులోకి తీసుకురానుంది. ఏసీ స్లీపర్లో ఒక ఫస్ట్క్లాస్, 4 టూటైర్, 11 త్రీటైర్ కోచ్లు ఉండనున్నాయి. అంతేకాకుండా వందేభారత్ రైలులో మరో 25 మార్పులు కూడా జరుగనున్నాయి. సీటు వాలులో మార్పులతోపాటు సీటు మెత్తదనాన్ని అదనంగా మరో 25 శాతం పెంచుతున్నారు. దివ్యాంగుల కోసం వీల్చైర్లు, మొబైల్ చార్జింగ్ పాయింట్లు, కాళ్లు పెట్టుకునే స్థలాన్ని విస్తరించడం వంటివి చేయనున్నారు. అలాగే, ఈ రైళ్ల తయారీలో వందశాతం స్వదేశీ సామగ్రినే వినియోగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
- Tags
- changes
- Railway
- spped
- Train
- Vande Bharat
తాజావార్తలు
-
Shubman Gill: “నా చేతుల్లో ఏం లేదు.. ఆటపైనే దృష్టి పెడతా”.. రోహిత్ రిటైర్మెంట్ వేళ కెప్టెన్ గిల్ కీలక వ్యాఖ్యలు..
-
Bollywood Controversy: ‘ఈమె ఎలాంటి సీత?’.. సాయి పల్లవిపై బాలీవుడ్ నటుడు సంచలన వ్యాఖ్యలు..
-
Zohran Mamdani: నెతన్యాహూను అరెస్ట్ చేస్తాం.. న్యూయార్క్ మేయర్ హెచ్చరిక..
-
Hero Surge S32: స్కూటర్ను క్షణాల్లో ఆటోగా మార్చేయొచ్చు.. హీరో Surge S32 ఎలక్ట్రిక్ వాహనం అదిరిపోయే ఫీచర్లు!
-
All-Party Meeting: అఖిలపక్ష సమావేశంలో హైడ్రామా.. ఇండియా కూటమి వాకౌట్..
ట్రెండింగ్
-
Rohit Sharma: టెన్షన్ అవసరం లేదు.. రోహిత్ శర్మ ఆడుతాడు: మోర్కెల్
-
IND vs ENG 3rd ODI: టీమిండియా తుది జట్టుపై ఉత్కంఠ.. ఆ ఇద్దరు స్టార్లకు నిరాశే.. రోహిత్పైనే అందరి చూపు!
-
IND vs ENG 3rd ODI: అభిమానులకు అలర్ట్.. మూడో వన్డే మ్యాచ్ సమయంలో మార్పు.. లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Android vs iPhone ఫైట్కు కొత్త ట్విస్ట్.! మెస్సీ కోసం Samsung, రొనాల్డో కోసం iPhone.. లగ్జరీ ఫోన్లు విడుదల..!
-
Jeera Rice: రెస్టారెంట్ స్టైల్ ‘జీరా రైస్’ ఇంట్లోనే.. వంట రాని వాళ్లు కూడా 5 నిమిషాల్లో సులువుగా చేసేయండి ఇలా..!