Smartphones: వచ్చే నెలలో రాబోయే బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు ఇవే..
- వచ్చే నెలలో రాబోయే బ్రాండెడ్ స్మార్ట్ఫోన్లు ఇవే
- Samsung, Vivo, POCO, Motorola, Oppo
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏప్రిల్ 2025లో మార్కెట్లోకి బ్రాండెడ్ స్మార్ట్ ఫోన్లు లాంచ్ కానున్నాయి. Samsung, Vivo, POCO, Motorola, Oppo వంటి స్మార్ట్ఫోన్ బ్రాండ్లు ఏప్రిల్ నెలలో కొత్త మొబైల్స్ ను విడుదల చేయబోతున్నాయి. రాబోయే ఫోన్లలో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లతో పాటు బడ్జెట్ విభాగానికి చెందిన ఫోన్లు కూడా ఉన్నాయి. క్రేజీ ఫీచర్లు, స్టన్నింగ్ డిజైన్ తో మొబైల్ లవర్స్ ను ఆకట్టుకోనున్నాయి. ఏప్రిల్ నెలలో రాబోయే ఫోన్లు ఏవో ఇప్పుడు చూద్దాం.
Also Read:Vignesh Puthur: ఇంటర్నెట్ సంచలనంగా విఘ్నేశ్.. ఓవర్ నైట్లో 3.7 లక్షల ఫాలోవర్స్!
Also Read
- Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
- Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
- Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
- CJI Protest: నిరసనకారులకు ఢిల్లీ పోలీసులు బిగ్ షాక్.. అలా చేస్తే పాస్పోర్టులు రద్దు!
ఏప్రిల్ 2025 లో రాబోయే స్మార్ట్ఫోన్లు
మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్:
మోటరోలా ఏప్రిల్ నెలలో మోటో ఎడ్జ్ 60 ఫ్యూజన్ను విడుదల చేయనుంది. ఈ ఫోన్ను మీడియాటెక్ 7400 ప్రాసెసర్తో రూ. 25 వేల బడ్జెట్ లో లాంచ్ చేయవచ్చు. మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ 50MP సోనీ లైటియా ప్రైమరీ కెమెరాతో రానున్నట్లు సమాచారం. ఈ ఫోన్లో సెల్ఫీ కోసం 32 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ, 68W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానుంది.
Samsung Galaxy S25 Edge:
Samsung ఫ్లాగ్షిప్ సిరీస్లోని ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో లాంచ్ చేయవచ్చని టాక్ వినిపిస్తోంది. రాబోయే Samsung S25 Edge 5.84mm సన్నగా ఉంటుందని చెబుతున్నారు. రాబోయే Samsung S25 Edge స్మార్ట్ఫోన్ గురించి, దీనిని Qualcomm Snapdragon 8 Elite చిప్సెట్తో లాంచ్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ 3900mAh బ్యాటరీని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్లో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను అమర్చనున్నారని టాక్.
Also Read:Sajjanar: సమస్య ఏదైనా సరే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదు..
Oppo Find X8 Ultra:
చైనీస్ స్మార్ట్ఫోన్ కంపెనీ Oppo కూడా ఏప్రిల్లో తన ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్ Oppo Find X8 Ultraను విడుదల చేయనుంది. ఇది 2K OLED డిస్ప్లేను కలిగి ఉంటుంది. దీని పరిమాణం 6.82 అంగుళాలు.
ఇందులో 1-అంగుళాల ప్రైమరీ కెమెరా సెన్సార్ ఉంటుంది. దానితో పాటు 2 పెరిస్కోప్ టెలిఫోటో లెన్సులు, అల్ట్రావైడ్ కెమెరా సెన్సార్ ఉండనున్నాయి.
రియల్మీ నార్జో 80 ప్రో:
రియల్మీ వచ్చే నెలలో భారత్ లో నార్జో సిరీస్లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. ఈ రియల్మీ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ చిప్సెట్తో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ను MediaTek Dimensity 7400 ప్రాసెసర్తో లాంచ్ చేయవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఫోన్ 12 GB RAM తో వస్తుంది. ఈ రియల్మీ ఫోన్ రూ. 20 వేల ధరకు లాంచ్ చేయవచ్చని టాక్.
Also Read:Disha Salian Case: దిశా సాలియన్ మరణం కేసు రీ ఓపెన్.. ఆదిత్య ఠాక్రే, రియాలపై ఎఫ్ఐఆర్..
POCO F7:
Xiaomi సబ్-బ్రాండ్ Poco కూడా ఏప్రిల్లో కొత్త స్మార్ట్ఫోన్ను విడుదల చేయనుంది. ఈ పోకో ఫోన్ పోకో ఎఫ్ 7 పేరుతో విడుదల అవుతుంది. ఈ పోకో ఫోన్ సరసమైన ఫ్లాగ్షిప్ కిల్లర్ స్పెసిఫికేషన్లతో మార్కెట్లో లాంచ్ అవుతుంది. మార్చి 27న ప్రపంచ మార్కెట్లో విడుదల కానున్న ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో భారతదేశంలో విడుదల కానుంది. POCO F7 స్మార్ట్ఫోన్ లో క్వాల్కమ్ ప్రాసెసర్ ఉంటుందని నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ లేదా స్నాప్డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్ అమర్చుతున్నారా అనే విషయంలో స్పష్టత లేదు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15, 6000mAh బ్యాటరీతో లాంచ్ చేయవచ్చు.
Also Read:Nabha Natesh : నభా నటేష్ అందాల రచ్చ..
Vivo T4 5G:
Vivo కూడా ఏప్రిల్లో కొత్త ఫోన్ను లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తోంది. ఈ ఫోన్ను అతిపెద్ద బ్యాటరీతో లాంచ్ చేయవచ్చని కంపెనీ చెబుతోంది. దీనితో పాటు క్వాల్కమ్ ప్రాసెసర్ కూడా ఇందులో లభిస్తుందని కంపెనీ స్పష్టం చేసింది. మీడియా నివేదికల ప్రకారం.. Vivo రాబోయే ఫోన్ Snapdragon 7s Gen 3 ప్రాసెసర్తో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్ 7,300mAh బ్యాటరీ, 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో రానున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Ahmedabad: అహ్మదాబాద్ను ముంచెత్తిన కుండపోత వర్షం.. 2 గంటల్లో 177 మిల్లీమీటర్ల వర్షం
-
ZIM vs IND: జింబాబ్వేను వణికించిన టీమిండియా.. భారత్ ముందు 126 పరుగుల టార్గెట్!
-
Venky Anil5: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్.. క్రేజీ వీడియో రిలీజ్ చేసిన అనిల్ రావిపూడి!
-
Pakistan: సౌదీకి మేమున్నాం.. ఇరాన్కు పాకిస్తాన్ ప్రధాని వార్నింగ్..
-
Paper Leaks: పంజాబ్లో పేపర్ లీక్.. చిక్కుల్లో ఆమ్ ఆద్మీ పార్టీ..
ట్రెండింగ్
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?