Snake: ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి వెళ్లిందని ఆస్పత్రికి పరుగెత్తాడు.. తర్వాత ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake in Stomach: ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సోమవారం రాత్రి ఓ వ్యక్తి కడుపునొప్పితో హర్దోయ్లోని మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ వార్డుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వైద్యులు ఏమైందని ప్రశ్నించగా.. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా తన ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో పాము కాటేసిందని, అనంతరం తన ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న వైద్యుడికి చెప్పాడు. కడుపులోకి ప్రవేశించిందని వైద్యులకు చెప్పగా.. అతడిని పరీక్షలకు తరలించారు. అతడికి వైద్యులు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతడు పాము కాటుకు గురికాలేదని, అతని శరీరంలో ఎలాంటి పాము లేదని తేలింది. మరుసటి రోజు ఉదయం అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరు మహేంద్ర, హర్దోయ్లో నివసిస్తున్న 25 ఏళ్ల వ్యక్తి.
మహేంద్ర కుటుంబం సోమవారం రాత్రి 8:15 గంటలకు హర్దోయిలోని మెడికల్ కాలేజీ ఎమర్జెన్సీకి వచ్చారు. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా పాము కాటేసి.. ప్రైవేట్ పార్ట్ ద్వారా కడుపులోకి దూరిందని చెప్పారు. అతడిని పరీక్షించిన వైద్యులు పాము కాటు ఏం లేదని, ఆయనకు ఏం కాలేదని కడుపును నొక్కి చూసి చెప్పారు. కానీ మహేంద్ర కుటుంబసభ్యులు ఆ వైద్యులను నమ్మలేదు. వైద్య సిబ్బంది హామీ ఇచ్చినప్పటికీ రెండో అభిప్రాయం కోసం మహేంద్రను మరో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అతన్ని పరీక్షించిన వైద్యులు, అతను డ్రగ్స్ మత్తులో ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఆ రాత్రి చికిత్స అందించిన తర్వాత మరుసటి రోజు ఉదయం అతన్ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు చెప్పారు. అయితే బాధితుడికి చికిత్స చేసి నొప్పి నివారణ మాత్రలు ఇచ్చారు.
Also Read
- Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
- రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
- Telangana Formation Day.. సీఎం రేవంత్, కేసీఆర్ శుభాకాంక్షలు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక సందేశాలు.!
- Commercial Taxes Department: వాణిజ్య పన్నుల శాఖ పునర్వ్యవస్థీకరణ.. కొత్త డివిజన్లు, సర్కిల్స్ ఏర్పాటు.!
Read Also: Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
ఆ యువకుడు మత్తు పదార్థాలకు బానిసైనట్లు కనిపించాడని, డ్రగ్స్ వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుందని మెడికల్ కాలేజీ ఎమర్జెన్సీ గదిలో పనిచేసిన డాక్టర్ షేర్ సింగ్ పేర్కొన్నారు. బాధితుడు డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు, తన కుటుంబ సభ్యులతో అదే విధంగా మాట్లాడాడని తెలిసింది. డాక్టర్ షేర్ సింగ్ ప్రకారం, “ఆ వ్యక్తి మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లు కనిపించాడు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అప్పుడప్పుడు కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన ఆందోళనను కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. వారు ఆందోళన చెందారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరుసటి రోజు ఉదయం, యువకుడికి సీటీ స్కాన్ జరిగింది, ఇది ఎటువంటి సమస్యలు లేవని తెలిసింది. దీని తరువాత, అతని కుటుంబ సభ్యులు అతన్ని తదుపరి పరీక్ష కోసం తీసుకెళ్లమని అభ్యర్థించారు. తరువాత అతను డిశ్చార్జ్ అయ్యాడు.” అని తెలిపారు.
తాజావార్తలు
-
Peddi Breakeven Target : రామ్ చరణ్ ‘పెద్ది’ ప్రీ రిలీజ్ బిజినెస్.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఎంతంటే?
-
Visakhapatnam Tragedy: విశాఖలో విషాదం.. చెవి ఆపరేషన్కు ముందు 13 ఏళ్ల బాలిక మృతి!
-
Job News: ఏడాదికి రూ.55 లక్షల భారీ ప్యాకేజీ.. నోటిఫికేషన్ ఔట్.. ఇలా అప్లై చేసుకోండి!
-
Sonam Bail Cancellation: రాజా రఘువంశీ హత్య కేసు.. బెయిల్ పై సోనమ్.. మేఘాలయ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
రూ.1,799కే IP67 రేటింగ్ ఫీచర్ ఫోన్.. AI నాయిస్ క్యాన్సిలేషన్తో Itel Aqua లాంచ్.!
ట్రెండింగ్
-
BSNL నుండి అదిరిపోయే ప్లాన్.. రోజుకు 3GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.!
-
Kitchen Hacks : ఇంట్లో తోడుపెట్టిన పెరుగుపై నీరు చేరుతోందా.? ఈ చిట్కాలతో గడ్డలా చిక్కటి పెరుగు రెడీ.!
-
Home Safety Tips : మీ ఇంటి దగ్గర పాము కనిపిస్తే భయపడకండి, ఈ 5 సులభమైన చిట్కాలను పాటించండి!
-
Balcony Tips : బాల్కనీలో పావురాల లొల్లి ఎక్కువైందా.? ఈ సింపుల్ ట్రిక్స్తో గుడ్బై చెప్పేయండి.!
-
Wash Basin Blocked : వాష్ బేసిన్ బ్లాక్ అయిందా.? ప్లంబర్ అవసరం లేకుండా ఈ చిట్కాలతో నిమిషాల్లో క్లియర్ చేయండి.!