Snake: ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి వెళ్లిందని ఆస్పత్రికి పరుగెత్తాడు.. తర్వాత ఏమైందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Snake in Stomach: ఉత్తరప్రదేశ్లోని హర్దోయ్లో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. సోమవారం రాత్రి ఓ వ్యక్తి కడుపునొప్పితో హర్దోయ్లోని మెడికల్ కాలేజీలోని ఎమర్జెన్సీ వార్డుకు పరిగెత్తుకుంటూ వెళ్లాడు. వైద్యులు ఏమైందని ప్రశ్నించగా.. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా తన ప్రైవేట్ పార్ట్ ప్రాంతంలో పాము కాటేసిందని, అనంతరం తన ప్రైవేట్ పార్ట్ ద్వారా పాము శరీరంలోకి ప్రవేశించిందని డ్యూటీలో ఉన్న వైద్యుడికి చెప్పాడు. కడుపులోకి ప్రవేశించిందని వైద్యులకు చెప్పగా.. అతడిని పరీక్షలకు తరలించారు. అతడికి వైద్యులు క్షుణ్ణంగా పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతడు పాము కాటుకు గురికాలేదని, అతని శరీరంలో ఎలాంటి పాము లేదని తేలింది. మరుసటి రోజు ఉదయం అతను ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆ వ్యక్తి పేరు మహేంద్ర, హర్దోయ్లో నివసిస్తున్న 25 ఏళ్ల వ్యక్తి.
మహేంద్ర కుటుంబం సోమవారం రాత్రి 8:15 గంటలకు హర్దోయిలోని మెడికల్ కాలేజీ ఎమర్జెన్సీకి వచ్చారు. బహిరంగ మలవిసర్జన చేస్తుండగా పాము కాటేసి.. ప్రైవేట్ పార్ట్ ద్వారా కడుపులోకి దూరిందని చెప్పారు. అతడిని పరీక్షించిన వైద్యులు పాము కాటు ఏం లేదని, ఆయనకు ఏం కాలేదని కడుపును నొక్కి చూసి చెప్పారు. కానీ మహేంద్ర కుటుంబసభ్యులు ఆ వైద్యులను నమ్మలేదు. వైద్య సిబ్బంది హామీ ఇచ్చినప్పటికీ రెండో అభిప్రాయం కోసం మహేంద్రను మరో ఆస్పత్రికి తరలించాలని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. అతన్ని పరీక్షించిన వైద్యులు, అతను డ్రగ్స్ మత్తులో ఈ చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. ఆ రాత్రి చికిత్స అందించిన తర్వాత మరుసటి రోజు ఉదయం అతన్ని డిశ్చార్జ్ చేసినట్లు వైద్యులు చెప్పారు. అయితే బాధితుడికి చికిత్స చేసి నొప్పి నివారణ మాత్రలు ఇచ్చారు.
Also Read
- BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
- Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
- Krishna Delta Water Crisis: 90 శాతం భూముల్లో సాగు కాలేదు.. కృష్ణా డెల్టా పరిస్థితిపై పేర్ని నాని కీలక వ్యాఖ్యలు
- Gang R*ape Case: మద్యం తాగించి, తుపాకీతో బెదిరించి సామూహిక అత్యాచారం..! బీజేపీ మాజీ ఎమ్మెల్యే సహా ఇద్దరిపై కేసు
Read Also: Man shoots girlfriend: పెళ్లికి నిరాకరించిందని.. ప్రియురాలిని కాల్చి చంపి ఆపై!
ఆ యువకుడు మత్తు పదార్థాలకు బానిసైనట్లు కనిపించాడని, డ్రగ్స్ వాడుతున్నప్పుడు అప్పుడప్పుడు కడుపునొప్పి వస్తుందని మెడికల్ కాలేజీ ఎమర్జెన్సీ గదిలో పనిచేసిన డాక్టర్ షేర్ సింగ్ పేర్కొన్నారు. బాధితుడు డ్రగ్స్ మత్తులో ఉన్నప్పుడు, తన కుటుంబ సభ్యులతో అదే విధంగా మాట్లాడాడని తెలిసింది. డాక్టర్ షేర్ సింగ్ ప్రకారం, “ఆ వ్యక్తి మాదకద్రవ్యాల ప్రభావంలో ఉన్నట్లు కనిపించాడు. మాదకద్రవ్యాల వాడకం వల్ల కలిగే అప్పుడప్పుడు కడుపు నొప్పి గురించి ఫిర్యాదు చేస్తున్నాడు. ఆ వ్యక్తి తన ఆందోళనను కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. వారు ఆందోళన చెందారు. చికిత్స కోసం ఆసుపత్రికి తీసుకువచ్చారు. మరుసటి రోజు ఉదయం, యువకుడికి సీటీ స్కాన్ జరిగింది, ఇది ఎటువంటి సమస్యలు లేవని తెలిసింది. దీని తరువాత, అతని కుటుంబ సభ్యులు అతన్ని తదుపరి పరీక్ష కోసం తీసుకెళ్లమని అభ్యర్థించారు. తరువాత అతను డిశ్చార్జ్ అయ్యాడు.” అని తెలిపారు.
తాజావార్తలు
-
BRICS Summit: బ్రిక్స్ తర్వాత ప్రపంచ నాయకులకు అస్వస్థత అంటూ తప్పుడు ప్రచారం.. తీవ్రంగా ఖండించిన భారత్
-
Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
-
Dharmana Krishnadasu: వర్షాలు లేక సాగు ఆలస్యం.. ఎరువులు లేక రైతుల అవస్థలు.. ధర్మాన కృష్ణదాసు ఆవేదన..
-
Sanju Samson: ఇక ఫెయిల్ అవ్వడు.. హాఫ్ సెంచరీలే.. సంజు శాంసన్పై సన్నీ కీలక వ్యాఖ్యలు!
-
Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
ట్రెండింగ్
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!