UPI: ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్..
- ఖతార్ లో UPI సేవలను ప్రారంభించిన కేంద్ర మంత్రి పియూష్ గోయల్
- దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
డిజిటల్ పేమెంట్స్ చెల్లింపుల స్వరూపాన్నే మార్చేసింది. దాదాపు అందరు ఆన్ లైన్ చెల్లింపులే చేస్తున్నారు. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం ఇలా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారా ప్రతి రోజు వేల ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. కాగా భారతదేశ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందుతోంది. యూపీఐ ఉపయోగించే దేశాల జాబితాలో ఖతార్ చేరింది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ రాజధాని దోహాలోని లులు మాల్లో UPI వ్యవస్థను ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో, UPI అనేది డిజిటల్ చెల్లింపు పద్ధతి మాత్రమే కాదు, భారతీయ ఆవిష్కరణ, సాంకేతికత శక్తికి చిహ్నం అని పియూష్ గోయల్ తెలిపారు.
Also Read:Rohit Sharma: కెప్టెన్సీ లేని అతడు మరింత ప్రమాదకరం.. మళ్లీ పాత రోహిత్ను గుర్తు చేస్తాడా..?
Also Read
- Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
- Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
- Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
- August 15 Independence Day: భారత్తో పాటు, ఆగస్టు 15న ఈ నాలుగు దేశాలకు స్వాతంత్య్రం..
రెండు రోజుల ఖతార్ పర్యటన సందర్భంగా, కేంద్ర వాణిజ్య మంత్రి పియూష్ గోయల్ యుపిఐ వ్యవస్థను ప్రారంభించారు. ఇది భారతదేశం-ఖతార్ భాగస్వామ్యాన్ని పెంచుతోందన్నారు. భారతదేశంలో 85% డిజిటల్ చెల్లింపులు ఈ వ్యవస్థ ద్వారా జరుగుతుండగా, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 50% డిజిటల్ చెల్లింపులు యుపిఐ ద్వారానే జరుగుతున్నాయని తెలిపారు. ఖతార్ నేషనల్ బ్యాంక్ (QNB), నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తో కలిసి, తన వ్యాపారి క్లయింట్ల కోసం పాయింట్-ఆఫ్-సేల్ టెర్మినల్స్లో QR కోడ్ ఆధారిత UPI చెల్లింపులను ప్రారంభించింది.
ఖతార్లోని లులు అవుట్లెట్లు ఇప్పుడు భారతీయ చెల్లింపు వ్యవస్థ ద్వారా లావాదేవీలను అంగీకరిస్తుండటంతో, భారతదేశం నుండి వచ్చే పర్యాటకులు ఖతార్లో సులభమైన, సౌకర్యవంతమైన డిజిటల్ చెల్లింపులను చేయొచ్చు. ఈ సేవలతో నగదు తీసుకెళ్లడం లేదా కరెన్సీ మార్పిడి అవసరం తగ్గుతుంది. దోహాలో UPIని ప్రారంభించడంతో పాటు, కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్ గోయల్.. ఖతార్ వాణిజ్య, పరిశ్రమల మంత్రి హిజ్ హైనెస్ షేక్ ఫైసల్ బిన్ థాని బిన్ ఫైసల్ అల్ థానితో కూడా సమావేశం అయ్యారు. ఆర్థిక, వాణిజ్య సహకారంపై చర్చించినట్లు తెలిపారు.
తాజావార్తలు
-
Indian Bowler: బుమ్రా లేని లోటు.. సిరాజ్తో కలిసి కొత్త బంతిని పంచుకునే ఆ ‘సీక్రెట్’ పేసర్ ఎవరు..?
-
Wamiqa Gabbi: ఇంతకాలం ఎక్కడున్నావమ్మా.. ఒక్క సినిమాతో వామిక గబ్బికి ఫుల్ డిమాండ్!
-
Attacks on Indians abroad: అమెరికా, యూకే, కెనడాల్లో భారతీయులపై పెరిగిన దాడులు..
-
Telangana Cabinet Decisions : రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులు, సన్నాలకు బోనస్, ఈవీ ఆటోలకు భారీ సబ్సిడీ.!
-
Smart Ration Card Status: మీరు స్మార్ట్ రేషన్ కార్డుకు అర్హులేనా..? ఇలా చెక్ చేసుకోండి..
ట్రెండింగ్
-
Healthy Snacks : నల్లగా మారిన అరటిపండ్లు పారేయొద్దు.. ఇలా చేస్తే అదిరిపోయే టేస్టీ డెజర్ట్స్.!
-
Nagarjuna Akkineni: నేను సైబర్ క్రైమ్ బాధితుడినే.. నాలుగేళ్ల క్రితం మోసపోయా.. ఆసక్తికర విషయాలు చెప్పిన కింగ్!
-
Shridhar Chillal: మూడు అంతస్తుల భవనం కంటే పొడవైన గోర్లు.. గిన్నిస్ బుక్ లో స్థానం.!
-
Income Tax Refund 2026: ఐటీఆర్ రీఫండ్ ఇంకా రాలేదా?.. వెంటనే ఈ 3 అంశాలు సరిచూసుకోండి..
-
Sumith Fernando Dies: టీమిండియాతో మొదటి టెస్ట్ ముందు.. శ్రీలంక క్రికెట్లో పెను విషాదం!