Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Union Minister Kishan Reddy Inaugurated The Kalyana Mandapam In The Thousand Pillar Temple

Kishan Reddy: వేయి స్తంభాల గుడిలో కళ్యాణమండపాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

Published Date :March 8, 2024 , 10:41 am
By Mahesh Jakki
Kishan Reddy: వేయి స్తంభాల గుడిలో కళ్యాణమండపాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • Follow Us :
  • google news
  • dailyhunt

Kishan Reddy: వేయి స్తంభాల గుడిలో పునర్నిర్మాణం చేసిన కళ్యాణమండపాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రారంభించారు. ఆలయానికి ఉదయమే చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. కుటుంబ సమేతంగా వేయి స్తంభాల గుడిలో కిషన్‌ రెడ్డి పూజలు చేశారు. వేయి స్తంభాల గుడి పునరుద్ధరణ అనంతరం శివునికి మందిరాన్ని అంకితం చేసిన సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ప్రసంగించారు. ఏఎస్‌ఐ అధికారులకు చాలా పరిమితులున్నాయని. ఆ పరిమితుల్లోనే వాళ్లు పనిచేస్తారని, వీటి కారణంగా నిర్మాణం కాస్త ఆలస్యమైన మాట వాస్తవమేనన్నారు. దేశ చరిత్రలో కాకతీయుల పాలనాకాలం స్వర్ణయుగం లాంటిదన్నారు. వ్యవసాయం మొదలుకుని.. కళలు, సంస్కృతి, సంప్రదాయాలు, చేతివృత్తులకు వారు ఇచ్చిన ప్రాధాన్యత ఇవాళ్టికి కూడా రీసెర్చ్ టాపిక్ అని పేర్కొన్నారు. అలాంటి కాకతీయుల కళావైభవానికి ఇవాళ భక్తులకు అంకితమైనటువంటి ఈ వేయి స్తంభాల మండపం ఓ మచ్చుతునక అని అన్నారు.

Read Also: CM Revanth Reddy: ప్రజలకు సీఎం రేవంత్‌ రెడ్డి మహాశివరాత్రి, ఉమెన్స్‌ డే శుభాకాంక్షలు

Also Read

  • Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..
  • PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు
  • SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!
  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ.. 1163లో కాకతీయ పాలకుడైన రుద్రదేవుడు ఈ ఆర్కిటెక్చురల్ మార్వెల్ (ఇంజనీరింగ్ అద్భుతం)ను నిర్మించారు. అప్పట్లోనే దీన్ని నిర్మించేందుకు 72 ఏళ్లు పట్టిందని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి.1324-25లో తుగ్లక్ సైన్యం చేసిన దాడిలో ఈ మందిరం కొంతమేర ధ్వంసమైంది. దీంతోపాటుగా ఈ మందిరంలో ఉన్నటువంటి.. సూర్య, వాసుదేవ విగ్రహాలను తుగ్లక్ సైన్యం తీసుకెళ్లింది.మధ్యయుగ కాలంనాటి ఈ గుడి.. సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక కేంద్రంగా ప్రత్యేకతను చాటుకుంది. ఇక్కడున్న మండపంలో గ్రామసభలు, నాట్య కార్యక్రమాలు నిర్వహించుకునేవారు. 132 స్తంభాలున్న కల్యాణ మండపం ప్రమాదకర స్థితిలో ఉన్నప్పుడు 2006లొ దీన్ని కూల్చేశారు. నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించాను. అప్పుడు ఈ పరిస్థితి విని బాధ కలిగింది. దీంతో ప్రత్యేక దృష్టి సారించాను. ఆ తర్వాత వివిధ కారణాలతో.. పిల్లర్లు ఊగిసలాడుతూ ఉన్న ఈ వెయ్యిస్తంభాల గుడి.. 40 ఏళ్ల క్రితం పూర్తిగా శిథిలమైంది. ఆ తర్వాత 2006 నుంచి దీన్ని పునరుద్ధరణ ప్రక్రియ ప్రారంభమైనా.. అది నత్త నడకన సాగింది. వాస్తవానికి.. వెయ్యిస్తంభాల మండపం పునరుద్ధరణ ఓ చాలెంజింగ్ టాస్క్‌ గా మారింది.” అని ఆయన పేర్కొన్నారు.

Read Also: Kedarnath Temple: బిస్కెట్స్ తో కేదార్‌నాథ్ ఆలయం.. అద్భుతమే..

మోడీ పగ్గాలు చేపట్టాక ఏఎస్‌ఐకి నిధులు రావడంతో పనులు వేగంగా జరిగాయన్నారు. 2021 సెప్టెంబర్ తర్వాత ఈ పనులు మరింత వేగవంతమయ్యాయన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ నుంచి ఆలయ నిర్మాణంలో విశేష అనుభవం ఉన్న కళాకారులను (స్థపతులు) తీసుకురావడం, వారి సహాయంతో.. డాక్యుమెంటేషన్ ఆధారంగా ఈ వేయిస్తంభాల గుడి పునరుద్ధరణ ప్రక్రియ వేగవంతమైందన్నారు. వాళ్లందరికీ మనమంతా రుణపడి ఉండాలన్నారునంది విగ్రహం జీవం పోసుకున్నట్లుగా లైవ్ లీగా ఉందన్నారు. స్థపతులు అనారోగ్య సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా.. ఈ మహత్కార్యంలో భాగస్వాములై పనిచేశారని కిషన్‌ రెడ్డి ప్రశంసించారు.
ధ్వంసమైన పిల్లర్ల స్థానంలో.. బ్లాక్ గ్రానైట్ తో అచ్చం పాతవాటిలా ఉండే స్తంభాలను వీరు తయారుచేశారన్నారు.

పని దాదాపుగా పూర్తయింది.. మిగిలిన చిన్నాచితకా పనులను కూడా త్వరలోనే పూర్తిచేస్తామన్నారు. ఇవాళ శివరాత్రి పర్వదినం సందర్భంగా భక్తులకు అంకితం చేయాలనే ఉద్దేశంతో.. ఇవాళ కార్యక్రమం పెట్టుకున్నామన్నారు. మహాశివుని ఆశీస్సులతో భారతదేశం త్వరలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా అవతరిస్తుందనే విశ్వాసం ఉందన్నారు. మోడీ నాయకత్వంలో.. భారతదేశం అన్ని రంగాల్లో ముందుకెళ్లేందుకు.. శివుని ఆశీస్సులు మనపై ఉంటాయనే నమ్మకం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో.. తెలంగాణ శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ పసునూరి దయాకర్, స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, ప్రొఫెసర్ పాండురంగారావు, ASI అధికారులు పాల్గొన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalyana Mandapam
  • Kishan Reddy
  • telugu news
  • Thousand Pillar Temple
  • Union Minister Kishan Reddy

తాజావార్తలు

  • Hyderabad: నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో భారీ ఆపరేషన్.. రూ. 17 కోట్ల విలువైన డ్రగ్స్ సీజ్..

  • PM Modi: మే 4న స్వీట్లు, బాణాసంచా సిద్ధం చేసుకోండి.. బెంగాల్‌ ఎన్నికల ప్రచారంలో మోడీ పిలుపు

  • SRH Players Dance: గ్రౌండ్‌లో బ్యాట్‌తోనే కాదు.. ఫ్లోర్‌పై డాన్స్‌తో కూడా అదరగొడుతున్న SRH ఆటగాళ్లు.. వీడియో వైరల్!

  • Shivathmika: నెపోటిజంపై శివాత్మిక రాజశేఖర్ బోల్డ్ కామెంట్స్..

  • Tamilnadu Elections: తమిళనాడులో ఓటేసిన సినీ, రాజకీయ ప్రముఖులు

ట్రెండింగ్‌

  • Moong Dal Pakoda Recipe: శనగపిండి వాడకుండా ఆరోగ్యకరంగా, రుచిగా ఉండే ‘పెసరపప్పు పకోడీ’లను చేసేయండి ఇలా..!

  • మిడ్-రేంజ్‌లో ఫ్లాగ్‌షిప్ ఫీచర్లు.. 200MP కెమెరా, 5-స్టార్ డ్రాప్ & క్రష్ సర్టిఫికేషన్, 7000mAh బ్యాటరీతో HONOR 600 సిరీస్ లాంచ్..!

  • Kitchen Cleaning Hacks: మెరిసే పాత్రల కోసం చిట్కాలు.. పింగాణీ పాత్రలపై పసుపు మరకలను వదిలించుకోండిలా.!

  • Mirchi Bajji Recipe: పర్ఫెక్ట్ గా, బండిమీద టేస్ట్ రావాలంటే మిరపకాయ బజ్జీ పిండి ఇలా కలిపి వేయండి.. లొట్టలేసుకుంటూ తినాల్సిందే.!

  • భారీ బ్యాటరీ + స్లిమ్ డిజైన్, రఫ్ & టఫ్ ఫోన్ Motorola Edge 70 Pro లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions