Kishan Reddy: కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెతలా ఉంది..
- హామీలను అమలు చేయని కాంగ్రెస్
- కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉంది
- అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా వ్యవహారం
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కాంగ్రెస్ పరిస్థితి గురువింద గింజ సామెత లా ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీలను ఏడాదికాలంగా కాంగ్రెస్ అమలు చేయలేదన్నారు. అబద్ధపు ప్రచారాలతో బాధ్యత రహితంగా పని చేస్తుందని విమర్శించారు. అధికారంలోకి రాగానే వంద రోజుల్లో ఆరు హామీలను పూర్తి అమలు చేస్తామని రాహుల్ గాంధీ, సోనియా గాంధీ తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాంగ్రెస్ చతికీల పడిందన్నారు. వంద రోజులు పూర్తయ్యాయని.. 200 రోజులు దాటిపోయాయి.. ఎల్లుండితో 365 రోజులు పూర్తికానున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను ఏడాది తర్వాత వాళ్లకు మరోసారి జ్ఞాపకం చేసేందుకే బీజేపీ హైదరాబాదులో సభ నిర్వహిస్తుందని వెల్లడించారు. తెలంగాణ ప్రజలను కాంగ్రెస్ ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తామని చెప్పారు.
READ MORE: Russian President: త్వరలోనే భారత్లో భారీగా పెట్టుబడులు పెడతాం..
Also Read
- TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Central Cabinet Decision: తెలుగు రాష్ట్రాల్లో 4 లేన్ల రైల్వే ట్రాక్లు.. కేంద్ర కేబినెట్ నిర్ణయాలు ఇవే!
- Supreme Court: సీజేపీ నిరసనకారుడికి నోటీసు.. ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్పై సుప్రీంకోర్టు ఆగ్రహం
అలాగే దేశంలో బొగ్గు గనుల గురించి కిషన్ రెడ్డి మాట్లాడారు. భారత దేశంలో కోల్ సెక్టార్ అనేక సంస్కరణలు తెస్తున్నట్లు చెప్పుకొచ్చారు. “2014లో ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టాక కోల్ సెక్టార్ మొత్తం పారదర్శకంగా నడుస్తోంది. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు, పార్టీ కోశాధికారి ఒక తెల్ల కాగితంపై పేర్లు రాసి ప్రధాన మంత్రికి పంపేవారు. నచ్చిన వాళ్లకు ఇచ్చిన వాళ్లకు కోల్ మైన్స్ ను అప్పజెప్పేవాళ్లు. సుప్రీంకోర్టు ఆదేశాలతో కూల్ సెక్టర్లు అనేక సంస్కరణలను తీసుకువచ్చి పారదర్శకంగా ఆక్షన్ నిర్వహిస్తున్నాం. దేశ అవసరాలకు అనుగుణంగా కోల్ ప్రొడక్షన్ చేస్తున్నాం. రానున్న రోజుల్లో కోల్ ప్రొడక్షన్ పెంచి, ఇంపోర్ట్ కోల్ తగ్గించాలన్నది మా లక్ష్యం. ఈ ఏడాది 1080 మెట్రిక్ టన్నుల కోల్ ఉత్పత్తిని టార్గెట్ పెట్టుకున్నాం. పారదర్శకంగా కోల్ బ్లాక్ ల ఆక్షన్ నడుస్తుంది.” అని కేంద్ర మంత్రి వివరించారు.
తాజావార్తలు
-
TPCC Mahesh Goud : కేసీఆర్ ఆరోగ్యంపై మహేష్ గౌడ్ ఫైర్.. ‘చిల్లర రాజకీయం వద్దు’.!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 Pro 5G లాంచ్.. 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, 50MP కెమెరా
-
Ranabaali Teaser: రణబాలి టీజర్లో విజయ్ విశ్వరూపం.. బ్రిటిష్ కాలం నాటి చీకటి కథతో సినిమా!
-
Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
-
Trade War: అమెరికాపై యుద్ధం ప్రకటించిన పొరుగుదేశం! అగ్రరాజ్యం వస్తువులపై 50% టారిఫ్..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!